Brahmamudi Serial Today January 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్కు నిజం చెప్పిన కావ్య – ధర్మేంద్రను నిజం అడిగిన తులసి
Brahmamudi serial today episode January 30th: రాజ్ను నిజం చెప్పి రాజ్ను తీసుకుని మినిస్టర్ ఇంటికి వెళ్తుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్య తన ఇంటికి రావడం. తాను మార్చిన రిపోర్ట్స్ చూపించడంతో మినిస్టర్ ధర్మేంద్ర షాక్ అవుతాడు. కావ్యను కోపంగా చూస్తూ.. తాను హాస్పిటల్ లో మార్చిన రిపోర్ట్స్ కనిపెట్టావు అంటే చాలా దూరం వచ్చావు అంటూ తిడతాడు.
కావ్య: నీ దగ్గర ఉన్న బిడ్డ.. నా బిడ్డ అని చెప్పడానికి ఈ రిపోర్ట్స్ అక్కర్లేదు. నా చూపు చాలు.. నాకు తగిలే నా బిడ్డ ఊపిరి చాలు. నువ్వు దుర్మార్గానికి పూనుకున్నావని తెలుసుకోవడానికి
మినిస్టర్: నీ బిడ్డను నేనే మార్చాను... నీ బిడ్డను నీ దగ్గరికి ఇక చేర్చను
కావ్య: నీ బిడ్డను మార్చి.. నా ఒడిలోకి చేర్చే హక్కు నీకు ఎవరిచ్చారు?
మినిస్టర్: కావ్య నీ మీద నాకు ఎలాంటి పగ, ద్వేషం ఏం లేవు.. ఆ రోజు మాకు పుట్టిన బిడ్డకు ఆరోగ్య సమస్య ఉందన్నారు.. బతకదన్నారు. కానీ పాప గురించి తెలిస్తే నా భార్య నాకు దక్కదు. అందుకే మరో మార్గం లేక అలా చేశాను
కావ్య: అందుకని మరో తల్లికి కడుపుకోత మిగులుస్తావా? ఇంకో ఆడదాని చేత కన్నీళ్లు పెట్టిస్తావా?
మినిస్టర్: నా భార్య సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను.. నువ్వు తెలుసుకున్న నిజం, ఈ రిపోర్ట్స్ చాలా చిన్నవి.. ఈ బిడ్డ నీది అని చెప్పడానికి ఒక్క సాక్ష్యమైనా ఉందా? మీరు చేయించిన డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా నేనే మార్చేశాను.. నువ్వు ఎక్కడ పట్టుకోలేవు, ఇండియాలో ఎక్కడ డీఎన్ఏ టెస్ట్ చేయించినా నాకు అనుకూలంగానే రిపోర్ట్స్ వస్తాయి. మీకు ఈ పాప కాకపోతే మరో బిడ్డను కనేందుకు అవకాశం ఉంది.. కానీ మాకు ఆ అవకాశం లేదు. కాబట్టి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను... నీ బిడ్డను మాత్రం మరిచిపో
కావ్య: డబ్బు, పలుకుబడి, పదవి ఉందని విర్రవీగుతున్నావు... నీ పవర్ని అడ్డం పెట్టుకుని ఎందరి జీవితాలతోనైనా ఆడుకోవచ్చని అనుకుంటున్నావు, వాటిని నేను పెకిలిస్తున్నాను. పదవితో వచ్చిన పవర్ నీది, పేగు తెంచుకుని కన్న మమకారం నాది. నీది బిడ్డల్ని మార్చిన కిరాతకం, నాది రక్తం పంచిన అమ్మతనం. ఇక నీకు, నాకే పోటీ. ఆట నువ్వు మొదలుపెట్టావు.. ముగింపు నేను ఇస్తాను, నా బిడ్డను నేను తిరిగి తీసుకెళ్తాను.. నీకు 15 రోజులు గడువు ఇస్తున్నాను.. గడువులోపు నీకు నువ్వుగా చేసిన తప్పు ఒప్పుకునేలా నీ చేతుల్లో బిడ్డని, నా చేతుల్లో పెట్టేలా చేస్తాను. నా పాపని నేను తీసుకెళ్తాను
అంటూ చెప్పి కావ్య వెళ్లిపోతుంది. అంతసేపు చాటుగా ఉన్న రుద్రాణి మినిస్టర్ దగ్గరకు వస్తుంది.
మినిస్టర్: దాని కాన్ఫిడెన్స్ ఏంటీ? మినిస్టర్తో మాట్లాడుతున్నానన్న భయం కూడా లేదు
రుద్రాణి: అది ఒంటరి ఆడది, దాని భర్త, దాని కుటుంబమే దానిని నమ్మడం లేదు. దానికి అంత సీన్ లేదు.
అంటూ రుద్రాణి మాట్లాడుతుంది. ఇక ఇంటికి వెళ్లిన కావ్యను రాజ్ గుమ్మం దగ్గరే అపేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అపర్ణ వచ్చి కావ్యను తిట్టి బాధపడుతుంది. దీంతో కావ్య ఇప్పటిదాకా మిమ్మల్ని బాధపెట్టాను ఇక నిజం తెలిసింది బాధపెట్టను అంటూ లోపలికి వెళ్లిపోతుంది. రేఖ వచ్చి కావ్యకు పిచ్చిపట్టినట్టు ఉంది. అది బయటకు వెళ్తే మన కుటుంబం పరువు పోతుందని చెప్తుంది. అందరూ ఆలోచిస్తుంటారు. తర్వాత రాజ్కు జరిగిన విషయం చెప్పి మనిష్టర్ ఇంటికి రాజ్ను తీసుకుని వెళ్లి తమ పాపను చూపిస్తుంది కావ్య. అప్పుడే మినిస్టర్ అక్కడికి వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















