అన్వేషించండి

Brahmamudi Serial Today April 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : బిడ్డ గురించి ఆరా తీసిన మీడియా – ఆ బిడ్డ దుగ్గిరాల వారసుడేనని ఒప్పుకున్న అపర్ణ, కావ్య

Brahmamudi Today Episode: మీడియా ముందు రాజ్ తీసుకొచ్చిన బిడ్డ దుగ్గిరాల కుటుంబం వారసుడేనని అపర్ణ, కావ్య ఒప్పుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Brahmamudi Serial Today Episode:

నాకూతురికి సవతి వచ్చినా సరే అక్కడే ఉంటుంది. ఆస్థి లేదని భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చి నువ్వు పడుతున్న అగచాట్లు చూశాకా కూడా నా కూతురును పుట్టింటికి ఎలా తీసుకెళ్లగలను రుద్రాణి అంటూ కనకం చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో అనామిక, స్వప్న వచ్చి రుద్రాణిని తిట్టి వెళ్లిపోతారు. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణ్‌ జరిపిస్తుంటారు. రామాయణం గురించి పంతులు చాలా గొప్పగా చెప్తుంటాడు. అందరూ శ్రద్దగా వింటుంటారు. అప్పు వచ్చి కళ్యాణ్‌ను పక్కకు తీసుకెళ్తుంది.

కళ్యాణ్‌: ఎంటి బ్రో ఏమైంది..?

అప్పు: ఏదో జరుగుతుంది. మీ ఫ్యామిలీలోనే ఎవరో మీడియా వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ పరువు తీయాలని చూస్తున్నారు.

కళ్యాణ్‌: ఎంటి అప్పు నువ్వు మాట్లాడేది..?  

అప్పు: మీడియా వాళ్లు వాళ్లంతట వాళ్లు రాలేదు. ఇదంతా ఏదో ప్లాన్‌ లా ఉంది. బహుశా.. బావ తీసుకొచ్చిన బాబు గురించి బయట పెట్టడానికే ఇదంతా ప్లాన్‌ చేస్తున్నట్టున్నారు.

కళ్యాణ్‌: అవును. అసలే బాబు వచ్చిన్నప్పటి నుంచి ఇంట్లో అన్నయ్యతో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియా వాళ్లు కూడా ఇంటి పరువు తీసినట్టు మాట్లాడితే.. మా పెద్దమ్మ అన్నయ్యని అసలు క్షమించదు. ఇప్పుడు ఏం చేద్దాం. ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి.

అప్పు: ఆగరా బై అందరూ పూజలో ఉన్నారు. ఎవరికీ ఏదీ చెప్పేటట్టు లేదు మనమే ఏదో ఒకటి చేసి ఆపాలి.

అంటూ కళ్యాణ్‌ చేతి పట్టుకుని ఆపి చెప్పగానే దూరం నుంచి చూసిన అనామిక కోపంగా వచ్చి అప్పును తిడుతుంది. ఏం బతుకులే మీవి అంటూ ఘోరంగా తిడుతుంది. దీంతో కళ్యాణ్‌ అడ్డుపడితే కళ్యాణ్‌ను కూడా అనామిక తిడుతుంది. దీంతో కళ్యాణ్‌, అనామికను కొడతాడు. దీంతో నీసంగతి చూస్తానని చాలెంజ్‌ చేసి  అనామిక వెళ్లిపోతుంది. కళ్యాణ్‌, అప్పు కలిసి మీడియా రిపోర్టర్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడతారు. ఒక పరువు గల ఫ్యామిలీ పరవు తీయడం కరెక్టు కాదని కళ్యాణ్‌ అడగ్గానే.. ఇంత వరకు మాకున్న ఇన్మఫర్మేషన్‌ నిజమా? కాదా అని డౌట్‌ ఉండేది. ఇప్పుడు అది నిజమనిపిస్తుంది. మా డ్యూటీ మేము చేస్తామని చెప్పి రిపోర్టర్‌ వెళ్లిపోతుంది. ఇంతలో కళ్యాణ్‌ లొపలికి వెళ్లి రాజ్‌ను మనం త్వరగా వెళ్లాలి అని చెప్తుండగానే రిపోర్టర్లు లోపలికి వస్తారు. రాజ్‌ను ప్రశ్నింస్తుంటారు. ఇంతలో కళ్యాణ్‌ కోపంగా అరుస్తాడు.

కళ్యాణ్‌: స్టాపిట్‌.. ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నారు. ఇలాంటి పుకార్లను ఎవ్వరూ నమ్మోద్దు. మా కుటుంబంలో తప్పులు జరిగే అవకాశమే లేదు. ఒకవేశ మా అన్నయ్య వేరే అమ్మాయితో బిడ్డను కంటే.. ఇప్పుడు మా కుటుంబంలో ఒకడిగా ఎందుకుంటాడు. ఆయన భార్యగా కళ్యాణ్‌ అన్నతో కలిసి ఎందుకు పూజలో కూర్చుంటుంది.  

రిపోర్టర్‌: ఆ బిడ్డన తీసుకురావడం వల్లనే రాజ్‌ గారిని ఎండీ స్థానం నుంచి తీసేశారని మా దగ్గర ఇన్ఫర్మేషన్‌ ఉంది. ఆ స్థానంలో మీరున్నారని.. ప్రస్తుతం ఆఫీసు వ్యవహారాలు మీరు చూస్తున్నారని తెలిసింది.

కళ్యాణ్‌: మీకు ఎవరో రాంగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. నేను అన్నయ్య స్థానంలో లేను ఆయన స్థానం ఎప్పుడూ ఆ స్థాయిలో ఉంటుంది. మేమంతా ఆయన కింద పనిచేసేవాళ్లమే..

అని కళ్యాణ్‌ చెప్పగానే రిపోర్టర్స్‌ మీ కుటుంబంలో ఏదో సంక్షోభం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్‌ ఉంది. అందుకే అడుగుతున్నాం అంటారు. దీంతో కావ్య ఆధారం లేని ఆరోపణలు చేయడం కరెక్టు కాదని చెప్తుంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక గొప్ప కుటుంబం మీద మచ్చ వేయకండి. మమ్మల్ని బతకనీయండి అనగానే రిపోర్టర్‌ మరి ఈ బిడ్డ ఎవరు అని అడుగుతుంది. దీంతో కావ్య నాకు మా ఆయనకు పుట్టిన బిడ్డ అని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. రిపోర్టర్స్‌ అపర్ణను కూడా నిజం చెప్పమని అడుగుతారు. దీంతో అపర్ణ కూడా ఆ బిడ్డ నా మనవడు అని మా ఇంటి వారసుడు అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ ఇయిపోతుంది.

ALSO READ: సీనియర్ నటి రాధ కోసం స్పెషల్ బిర్యానీ చేసిన ఆలీ భార్య - చూస్తే నోరూరుతుంది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget