అన్వేషించండి

Guntur Kaaram: తెలంగాణలో 4 గంటల నుంచి గుంటూరు కారం షోస్ - టికెట్ రేట్ ఎంత పెంచారంటే?

Guntur Kaaram tickets price: 'గుంటూరు కారం' విడుదలైన రోజు నుంచి వారం పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుతం అనుమతి ఇచ్చింది. అలాగే, ఉదయం నాలుగు గంటల నుంచి షోలు వేసుకోవచ్చని తెలిపింది.

Guntur Kaaram tickets price hike in Telangana state: సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి సినిమా రానుంది. గురువారం (ఈ నెల 11వ తేదీ) మిడ్ నైట్ 1 గంట నుంచి ఎంపిక చేసిన 23 థియేటర్లలో బెనిఫిట్ షోల ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదలైన రోజు నుంచి వారం పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఉదయం నాలుగు గంటల షో ప్రదర్శనకు సైతం అనుమతులు లభించాయి.

తెలంగాణలో టికెట్ రేటు ఎంత పెంచారంటే?
'గుంటూరు కారం' 12వ తేదీన విడుదల అవుతుంటే... ఆ రోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు వారం పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు మీద సింగిల్ స్క్రీన్లలో 65 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 100 టికెట్ పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం థియేటర్లలో ఐదు షోలు వేస్తున్నారు. కొన్ని థియేటర్లలో నాలుగు షోలు మాత్రమే వేస్తున్నారనుకోండి. అయితే... రోజుకు  ఆరు షోలు ప్రదర్శించవచ్చని, ఉదయం నాలుగు గంటలకు ఒక షో ప్రదర్శనకు సైతం అనుమతి లభించింది.

Also Read'గుంటూరు కారం' దెబ్బకు 'సలార్' రికార్డ్ గల్లంతు... మమ మహేష్ మాస్

టాలీవుడ్ ఫ్రెండ్లీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి నెల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ముందు సుమారు పదేళ్ల పాటు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) అధికారంలో ఉంది. కెసిఆర్ తనయుడు, మంత్రిగా పని చేసిన కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేసిన తలసాని శ్రీనివాస యాదవ్ టాలీవుడ్ ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు.

Also Readశ్రద్ధా శ్రీనాథ్ @ వైఫ్ రోల్స్ - గ్లామర్ రోల్స్ కాదు, సపరేటు రూటులో సైంధవ్ హీరోయిన్

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే ప్రశ్న తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరిలో వచ్చింది. ఇప్పుడు 'గుంటూరు కారం', దీనికి ముందు 'సలార్' సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం ద్వారా తమది సినిమా ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి సంకేతాలు పంపినట్లు అయ్యింది. 

Also Readపెళ్లికి ముందు ప్రెగ్నెంట్... అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?

రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కొంత మంది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలతో పాటు కొందరు నిర్మాతలు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. దిల్ రాజు నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలు నూతన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఉగాదికి నంది అవార్డులు సైతం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Embed widget