By: ABP Desam | Updated at : 10 Feb 2022 12:58 PM (IST)
సినిమా ప్రారంభోత్సవంలో శివకార్తికేయన్, సురేష్ బాబు, రామ్ మోహన్ రావు, అనుదీప్ తదితరులు
తమిళ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan), 'జాతి రత్నాలు'తో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన దర్శకుడు కేవీ అనుదీప్ (KV Anudeep) కలిసి తెలుగు, తమిళ ద్విభాషా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో శివ కార్తికేయన్కు 20వ చిత్రమిది. అందుకని, #SK20 గా వ్యవహరిస్తున్నారు. తమిళనాడులోని కారైకుడిలో ఈ రోజు పూజా కార్యాక్రమాలతో సినిమా మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజే మొదలు పెట్టినట్టు తెలిపారు.
టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామి. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. కారైకుడిలో జరిగిన పూజా కార్యక్రమాల్లో హీరో, దర్శకుడితో పాటు నిర్మాతలు సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు పాల్గొన్నారు. "నవ్వుల ప్రయాణం మొదలైంది" అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. శివ కార్తికేయన్తో ఆయనకు తొలి సినిమా ఇది.
గత ఏడాది విడుదలైన 'డాక్టర్', అంతకు ముందు 'సీమ రాజా', 'రెమో', 'శక్తి' చిత్రాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు.
Gruhalakshmi August 12th Update: సామ్రాట్ కౌగిట్లో తులసి, అది చూసి తలబాదుకుంటున్న నందు, లాస్యకు ఊహించని షాక్
Guppedantha Manasu ఆగస్టు 12 ఎపిసోడ్: లగ్నపత్రిక రాయించే వేడుకలో రిషి సాక్షికి షాకివ్వబోతున్నాడా, వసు ఎందుకంత కూల్ గా ఉంది!
Devatha August 12th Update: నాన్నని తీసుకొస్తానని దేవికి మాట ఇచ్చిన ఆదిత్య- చంపేస్తానంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య
Ennenno Janmalabandham August 12th Update: ఖైలాష్ మీద కేసు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళిన వేద - కానీ అంతలోనే..
Karthika Deepam Serial ఆగస్టు 12 ఎపిసోడ్: శౌర్య ప్రేమని గెలిపించేందుకు హిమ గుళ్లో ప్రేమ్ ని పెళ్లిచేసేసుకుంటుందా!
Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!
Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !