By: ABP Desam | Updated at : 05 Jun 2023 01:33 PM (IST)
‘సైతాన్‘ వెబ్ సిరీస్(Photo Credit: Disney+ Hotstar Telugu/Instagram)
ఓటీటీ కోసం సినిమాలు, వెబ్ సిరీస్లు తీస్తున్న దర్శకుల జాబితాలో మహి వి. రాఘవ్ కూడా చేరారు. ఇప్పటికే ఆయన ‘సేవ్ ద టైగర్స్’వెబ్ సిరీస్తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు. ఈ సిరీస్ కు ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇంట్లో భార్య భర్త మధ్య జరిగే గొడవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలై చక్కటి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన మరో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.
పరిమితికి మించిన బోల్డ్ కంటెంట్
మహి వి. రాఘవ్ విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు. 'పాఠశాల'తో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తీసిన 'ఆనందో బ్రహ్మ', ముఖ్యంగా 'యాత్ర'తో పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దర్శకుడు ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. అదే ‘సైతాన్’. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే, పూర్తి స్థాయిలో బూతులు, పగలు, ప్రతీకారాలు, రక్తపాతాల చుట్టే తిరిగింది. బోల్డ్ కంటెంట్ పరిమితికి మించి ఉంది. మహి వి. రాఘవ్ తెరకెక్కిస్తున్నఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడిగా మహి వి. రాఘవ్ తీసిన చిత్రాలకు ఈ వెబ్ సిరీస్ భిన్నంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
'సైతాన్' వెబ్ సిరీస్లో సాయి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్ చేశారు. 'ప్రియురాలు' సినిమాలో ఆమె హీరోయిన్. అంతకు ముందు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'లో అఖిల్ అక్కినేని స్నేహితురాలిగా నటించారు. ఓటీటీలో విడుదలైన 'మా ఊరి పొలిమేర' సినిమాలో కూడా హీరోయిన్గా నటించారు. ఇంకా 'ద బేకర్ అండ్ ద బ్యూటీ', 'కుబూల్ హై', 'అన్యాస్ ట్యుటోరియల్' వెబ్ సిరీస్లలో కీలక పాత్రల్లో కనిపించారు. ఈ క్రైమ్ సిరీస్ ఈ నెల 15న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కు రానుంది.
కరోనా తర్వాత ఓటీటీలకు పెరిగిన ఆదరణ
వాస్తవానికి కరోనా తర్వాత ఓటీటీలకు మంచి ఆదరణ పెరిగింది. ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమా టీవీలో చూడాలంటే కనీసం మూడు, నాలుగు నెలల సమయం పట్టేది. కానీ, ఇప్పుడు ఒకటి, రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సినీ అభిమానులు సైతం ఓటీటీలకు ఎప్పువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలకు తోడు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సిరీస్ ను ప్రేక్షకులు గంటల తరబడి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు టాప్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెబ్ సిరీస్ ల ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
/body>