అన్వేషించండి

Poonam Kaur Health Update: పూనమ్ కౌర్ ఆరోగ్యంపై అప్‌డేట్, రెండేళ్లుగా ఆ వ్యాధితో పోరాటం!

నటి పూనమ్ కౌర్ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వచ్చింది. తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత వెల్లడించారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న పూనమ్ కౌర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత తెలిపారు. ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పూనమ్ హెల్త్ కండీషన్ గురించి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పూనమ్ ఎలా అనారోగ్యం పాలైందో వివరించారు.  

ఈ నెల 12న కేరళకు వెళ్లిన పూనమ్

గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో పూనమ్ చురుగ్గా పాల్గొంటున్నట్లు వెంకన్న చెప్పారు. నవంబర్ 10న తమతో కలిసి సూరత్  గాంధీ పార్కులో చేనేతపై  పన్ను ఎత్తివేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. 11న సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేసిన తర్వాత, 12న ఢిల్లీలో జరిగే బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని చెప్పారు. ఢిల్లీలో ఆమెకు వెన్ను నొప్పి రావడంతో, చికిత్స కోసం కేరళ వెళ్లినట్లు తెలిపారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు ఫైబ్రో మైయాల్జియా నిర్ధారణ అయ్యింది. కేరళలో ట్రీట్మెంట్ అనంతరం ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె త్వరలోనే కోలుకుంటారనే పూర్తి ఆత్మశ్వాసంతో ఉన్నట్లు వెంకన్న వెల్లడించారు.   

2 ఏండ్లుగా పూనమ్ కు అరుదైన రుగ్మత

పూనమ్ సుమారు రెండు సంవత్సరాలుగా ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.  ఈ రుగ్మత కారణంగా చాలా ఇబ్బందులు పడుతోందట. ఫైబ్రో మైయాల్జియా కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతోందట. తాజాగా తన చికిత్సకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేరళలో ఆయుర్వేద చికిత్స  

కేరళలోని ఆయుర్వేద నిపుణులు పూనమ్ కు ప్రత్యేక చికిత్స అందించారు.  గత కొంత కాలంగా ఆమె అక్కడే ఉండి చికిత్స తీసుకున్నది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందింది.  ఎక్సర్ సైజ్, టాకింగ్ థెరఫీతో పాటు సరైన సమయానికి మందులు తీసుకుంటోంది. గత కొంతకాలంగా తీసుకుంటున్న చికిత్స మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం ఈ విషయాన్ని పూనమ్ రహస్యంగా ఉంచింది. తాజాగా ఆమె చికిత్సకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అసలు విషయం వెల్లడైంది. 

రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న పూనమ్

తాజాగా పూనమ్ కౌర్ రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తన చేతిని పట్టుకుని నడవడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటికి పూనమ్ కౌంటర్ ఇచ్చింది. తాను పడిపోతుంటే రాహుల్ పట్టుకున్నారని వివరణ ఇచ్చింది. ఇలాంటి విషయాలపై విమర్శలు చేయడం సరికాదని వెల్లడించింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీకి చేనేత కార్మికుల సమస్యలను వివరించింది. వారికి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరింది.

Read Also: పూనమ్ కౌర్‌ కు అరుదైన వ్యాధి, కేరళలో చికిత్స

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Biker Trailer : రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
Mrunal Thakur : చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
Niharika Konidela : హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
Anchor Suma : సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget