అన్వేషించండి

Chiranjeevi: జిమ్‌లో మెగాస్టార్‌‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్

ఇటీవల షూటింగులో ప్రమాదానికి గురైన ప్రకాశ్ రాజ్.. మెగాస్టార్ చిరంజీవిని కలవడం చర్చనీయమైంది.

‘మా’ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. మెగాస్టార్ చిరంజీవిని జిమ్‌లో కలవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ షూటింగులో చేతికి గాయం కావడంతో ప్రకాశ్ రాజ్ హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, మంగళవారం ఉదయం ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ మరోసారి ‘మా’లో కాకరేపుతోంది.

చేతికి కట్టుతో ఉన్న ప్రకాశ్ రాజ్ చిరంజీవితో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘ఉదయం జిమ్‌లో బాస్‌ను కలిశాను. సినిమా శ్రామికుల సమస్యలను పరిష్కరించేందుకు చిరు తీసుకుంటున్న చొరవకు ధన్యవాదాలు. ‘అన్నయ్య’ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆయన మనకు దక్కడం మన అదృష్టం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చిరంజీవి మద్దతు ఉందనే స్పష్టమవుతోందని పలువురు అంటున్నారు. 

తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్ షూటింగ్‌లో కింది పడ్డారు. చేతికి బలమైన గాయం కావడంతో సర్జరీ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం (ఆగస్టు 16) హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు వైద్యం అందించిన ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ‘‘నా స్నేహితుడు ప్రకాశ్ రాజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్ని తెలుపుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. త్వరలోనే ఆయన్ని మళ్లీ వెండితెరపై చూడాలి’’ అని ట్వీట్ చేశారు. 

మంగళవారం ఉదయం ప్రకాశ్ రాజ్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయన్ని జిమ్‌లో కలిసి కాసేపు మంతనాలు జరిపారు. ‘మా’ ఎన్నికలు నిర్వహించాలంటూ చిరంజీవి లేఖ రాసిన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఆయన్ని అభినందిచినట్లు తెలిసింది. చిరు-ప్రకాశ్ రాజ్‌ల మీటింగ్.. ఇప్పుడు ‘మా’లోని ఓ వర్గాన్ని కలవర పెడుతున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ‘మా’లో ఓ వర్గం ఎన్నికలు లేకుండా నరేష్‌నే అధ్యక్షుడిగా కొనసాగించాలని చెబుతుంటే.. మరో వర్గం హీరో మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. 

Also Read: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?

ప్రస్తుతం చిరంజీవి టాలీవుడ్ సమస్యలపై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా, లాక్‌డౌన్ వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరలు తదితర విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.

Also Read: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Biker Trailer : రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
Mrunal Thakur : చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
Niharika Konidela : హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
Anchor Suma : సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget