Keerthy Suresh: చిన్న వయసులోనే దూరం అయ్యింది - కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్ పోస్టు
తన బెస్ట్ ఫ్రెండ్ గురించి కీర్తి సురేష్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. చిన్న వయసులోనే చనిపోయిందటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.

Keerthy Suresh About Her Best Friend Death: వరుస సినిమాలతో బిజీగా ఉంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆమె తాజాగా నటించిన ‘రఘుతాత’ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా బిజీగా గడుపుతోంది. తాజాగా కీర్తి సురేష్ తన స్నేహితురాలి గురించి షేర్ చేసిన పోస్టు అందరికీ కంటతడి పెట్టిస్తోంది. ఇంతకీ ఆమె షేర్ చేసిన పోస్టులో ఏం ఉందంటే…?
కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్ పోస్టు
కీర్తి సురేష్ ప్రాణ స్నేహితురాలు మనీషా రీసెంట్ గా బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయింది. ఇదే విషయాన్ని ఆమె పుట్టిన సందర్భంగా గుర్తు చేసుకుంటూ సుదీర్ఘ పోస్టు పెట్టింది. ఆమెతో తనకున్న అనుబంధం, చనిపోయే ముందు తను పడిన బాధ గురించి రాసుకొచ్చింది. “గత కొన్ని వారాలుగా నేను ఎంతో బాధను అనుభవిస్తున్నాను. నా చిన్ననాటి స్నేహితురాలు ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లడం నమ్మశక్యంగా లేదు. 21 ఏళ్ల వయసులోనే తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్ కు గురైంది. దాదాపు 8 ఏళ్ల పాటు వ్యాధితో పోరాడింది. గత నవంబర్ లో ఆమెకు మూడో సర్జరీ జరిగింది. ఆ సమయంలోనూ తను ధైర్యంగానే ఉంది. కానీ, ఆ సమయంలో తను నొప్పి భరించలేకపోతున్నట్లు నాతో చెప్పి కంటతడి పెట్టింది. ఆమె బాధ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. రోజు రోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు చివరిసారిగా చూశాను. ఆ బాధను పంచుకోలేకపోతున్నాను” అని కీర్తి రాసుకొచ్చింది.
కలలు నెరవేరకుండానే అనంతలోకాలకు..
చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన తన స్నేహితురాలిని తలచుకుని కీర్తి సురేష్ కంటతడి పెట్టుకుంది. “తన జీవితాన్ని ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది. తను ఎన్నో కలలు కన్నది. ఆమె కలలు ఏవీ నెరవేరలేదు. ఇంత చిన్న వయసులోనే ఆమెకు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. బ్రెయిన్ ట్యూమర్ ఆమెను అనంతలోకాలకు తీసుకెళ్లింది. కానీ, ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు తన చివరి శ్వాస వరకు పోరాడింది. సరిగ్గా నెల రోజుల క్రితం ఆమె పోరాడుతూ ఓడిపోయింది. ఆమె గురించి గుర్తు చేసుకోలేని రోజులేదు. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా ఆమెను మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. ఎప్పటికీ మర్చిపోలేను మనీషా” అంటూ కీర్తి ఆవేదన వ్యక్తం చేసింది.
View this post on Instagram
ఆగష్టు 15న ‘రఘుతాత’ విడుదల
కీర్తి సురేష్ చివరగా పాన్ ఇండియన్ మూవీ 'కల్కి 2898AD'లో తన వాయిస్ వినిపించింది. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. కీర్తి ప్రధాన పాత్రలో సుమన్ కుమార్ తెరకెక్కించిన ‘రఘుతాత’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. హిందీ రాని ఓ తమిళ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడింది అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఆగష్టు 15న విడుదలకానుంది.
Read Also: మహేష్ బాబు, జక్కన్న మూవీలో విక్రమ్? అసలు విషయం చెప్పేసిన చియాన్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















