DD3 Concept Poster: ధనుష్ దర్శకత్వంలో మూడో సినిమా, కాన్సెప్ట్ పోస్టర్ అదిరింది గురూ!
DD3 Concept Poster: తమిళ నటుడు ధనుష్ దర్శకత్వంలో ‘DD3’ అనే మూవీ తెరకెక్కబోతోంది. తాజాగా మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను ఆయన షేర్ చేశారు.

Dhanush Third Directorial Venture ‘DD3’ Concept Poster Released: తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్. హీరోగానే కాకుండా దర్శకుడిగా, సింగర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కగా, తాజాగా మూడో ప్రాజెక్టును ప్రకటించారు. ప్రస్తుతం ‘DD3’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి.
‘DD3’ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
తాజాగా ‘DD3’ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కాన్సెప్ట్ పోస్టర్ ను షేర్ చేశారు ధనుష్. ఈ పోస్టర్ చాలా ప్రెజెంట్ గా కనిపిస్తోంది. బీచ్లో పసుపు రంగా బెంచ్, దాని మీద ఏదో రాసిన ఉన్న పలు పేపర్లు కనిపిస్తున్నాయి. అటు ఆకాశం, ఇటు సముద్రం కలిసి పోయినట్లు ఆహ్లాదంగా ఉంది. ప్రేమకథను సూచించే సెట్టింగ్ తో పాటు టీజర్ పోస్టర్ ప్రకటన తేదీని కూడా ఇందులో ప్రస్తావించారు. D అక్షరాన్ని పోలి ఉండే రెండు నెలవంకలు తన మూడో వెంచర్ కు సింబాలిక్ గా 3వ నంబర్ వచ్చేలా చక్కగా పోస్టర్ ను రూపొందించారు. ఇక ‘DD3’ కాన్సెప్ట్ పోస్టర్ కు పైన ఎడమ భాగంగాలో వండర్ బార్ ఫిల్మ్స్ లోగో కనిపిస్తుంది. అంటే, ఈ సినిమా ధనుష్ సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లు అర్థం అవుతోంది.
#DD3 pic.twitter.com/IgXDIDReca
— Dhanush (@dhanushkraja) December 22, 2023
ఈ నెల 24న అధికారిక ప్రకటన
సినిమా టైటిల్, నటీనటుల వివరాలు బయటకు రాకపోయినప్పటికీ, మూవీకి సంబంధించి డిసెంబర్ 24, 2023 నాడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ధనుష్ దర్శకుడిగా తన రెండవ ప్రాజెక్ట్ చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేశాడు. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘D50’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ఆయన తాజాగా ధన్యవాదాలు చెప్పారు. ట్విట్టర్ వేదికగా సినిమాలో భాగస్వామ్యం అయిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. అటు తన విజన్ కు సపోర్టు చేసిన కళానిధి మారన్ తో పాటు సన్ పిక్చర్స్ కు థ్యాంక్స్ చెప్పారు.
‘పా పాండి’తో దర్శకుడిగా పరిచయమైన ధనుష్
తమిళ నటుడు ధనుష్ 2017లో కామెడీ చిత్రం ‘పా పాండి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ధనుష్ తన తర్వాతి చిత్రం ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్కుమార్, సందీప్ కిషన్లతో కలిసి చేస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం 2024 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. తొలుత ఈ సినిమా విడుదల రోజునే రజనీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమా విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ధనుష్ మూవీతో పోటీ వద్దు అనే ఉద్దేశంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read: ‘సలార్‘ టీమ్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు, ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















