అన్వేషించండి

Vishal: ఆ డైరెక్టర్ అర్థరాత్రి ఫోన్ చేసి, నా పేరు రాసి సూసైడ్ చేసుకుంటున్నా అన్నాడు: విశాల్

దర్శకుడు అధిక్ రవిచంద్రన్ గురించి ఆసక్తికర విషయం బయటపెట్టాడు విశాల్. 9 సంవత్సరాల ముందు ఒక కథ రాసుకొని నిర్మాతల కోసం వెతికితే.. దాదాపు 40 మంది నిర్మాతలు గెంటేశారని అధిక్ గురించి చెప్పుకొచ్చాడు.

మిళ నటులు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన నటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు విశాల్. పేరుకే తమిళ హీరో.. కానీ విశాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టం. స్క్రీన్‌పై తన నటన మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ తన మంచితనాన్ని అభిమానించే వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి విశాల్.. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. ఈ మూవీ ఒక టైమ్ ట్రావెల్ కథతో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలయిన ‘మార్క్ ఆంటోనీ’ టీజర్, ఫస్ట్ లుక్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి మరికొన్ని విశేషాలు పంచుకున్నాడు విశాల్.

ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు..
విశాల్ హీరోగా మారి 19 ఏళ్లు అయ్యిందని ముందుగా ‘మార్క్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గుర్తుచేసుకున్నారు. 19 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 10న తన మొదటి చిత్రం ‘చెల్లం’.. తెలుగులో ‘ప్రేమ చదరంగం’ చిత్రం విడుదలయిందని తెలిపాడు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రేక్షకులు తనను ఆదరించినందుకు ధన్యవాదాలు చెప్పాడు. అందరూ తన గురించి చెప్తుంటే తృప్తిగా ఉందని అన్నాడు. కెప్టెన్ విజయ్‌కాంత్ అని ఒక వ్యక్తి ఉన్నారని, ఆయన ఆఫీసుకు వచ్చిన ఎవరినైనా ఆకలితో పంపించరని చెప్పిన విశాల్.. తమ ఆఫీసులో కూడా అలాగే చేస్తున్నామని చెప్పాడు. తన సినిమా టికెట్ కోసం పెట్టే డబ్బులు.. ఏదో ఒక విధంగా సమాజానికే ఉపయోగపడాలని అనుకుంటానని తెలిపాడు. ‘మార్క్ ఆంటోనీ’ అనేది తన కెరీర్‌లోని కాస్ట్‌లీ చిత్రమని బయపెట్టాడు.

అభినయ ఒక ఇన్‌స్పిరేషన్..
‘మార్క్ ఆంటోనీ’ సినిమాకు కారణమయిన వ్యక్తి వినోద్ అని తన నిర్మాతకు ధన్యవాదాలు తెలిపాడు. ఒక పాటకు రూ.1 కోటి ఖర్చు అవుతుందని చెప్తే వద్దు అని అనకుండా అసవరమైతే ఎక్కువ ఖర్చు చేయడానికి కూడా నిర్మాత ఆలోచించేవాడు కాదని బయటపెట్టాడు. ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంలో మార్క్ పాత్రకు జోడీగా రీతూ వర్మ నటించిందని, ఆంటనీ పాత్రకు భార్యగా అభినయ నటించిందని కథ గురించి చెప్పాడు. అభినయ గురించి మాట్లాడుతూ.. తను చాలామందికి స్ఫూర్తినిస్తుందని అన్నాడు. మాటలు రాకపోవడం, వినికిడి లోపం ఉండడం కాదు.. నటించడం వచ్చు అంటే చాలు.. ఇండస్ట్రీకి రావచ్చు అని చెప్పాడు.

సూసైడ్ చేసుకుంటానన్నాడు..
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ గురించి ఆసక్తికర విషయం బయటపెట్టాడు విశాల్. 9 సంవత్సరాల ముందు ఒక కథ రాసుకొని నిర్మాతల కోసం వెతికితే.. దాదాపు 40 మంది నిర్మాతలు గెంటేశారని అధిక్ గురించి చెప్పుకొచ్చాడు. ‘త్రిష లేదా నయనతార’ అనే సినిమాను తెరకెక్కించినందుకు యూత్ చప్పట్లు కొట్టినా కూడా అసలు నేనేనా సినిమా తీసింది అని తనకు తానే ఆశ్చర్యపోయాడని అన్నాడు. ‘‘ఒకరోజు అర్థరాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటున్నా, లెటర్‌లో మీ పేరే రాస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ చేసి ఏమైంది అని అడిగితే మీరు డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగింది అన్నాడు. అయితే దేవుడు సహకరిస్తే కలిసి సినిమా చేస్తామేమో అన్నాను. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’ చేస్తున్నాం’ అని అధిక్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి బయటపెట్టాడు. ఎస్‌జే సూర్య.. ‘మార్క్ ఆంటోనీ’లో తన పాత్ర కోసం 22 గంటలు డబ్బింగ్ చెప్పాడని అభినందించాడు. విశాల్, ఎస్‌జే సూర్య లీడ్ రోల్స్ చేస్తున్న ‘మార్క్ ఆంటోనీ’.. సెప్టెంబర్ 15న అన్ని సౌత్ భాషల్లో విడుదల అవుతుండగా.. హిందీ వర్షన్ మాత్రం సెప్టెంబర్ 22న విడుదల అవుతుంది.

Also Read: పంచ్ ప్రసాద్‌‌కు సర్జరీ - డాడీ వెంటనే తిరిగి వచ్చేస్తారు, గుండె బరువెక్కిస్తోన్న కొడుకు మాటలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget