అన్వేషించండి

‘లైగర్’ రిలీజైన రోజు ఉదయమే విజయ్‌కు అర్థమైపోయింది: ఆనంద్ దేవరకొండ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా 'బేబీ' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ 'లైగర్' మూవీ రిజల్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

గత ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన అతి పెద్ద డిజాస్టర్స్ లో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' మూవీ ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండను ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆడియన్స్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అటు 'ఇస్మార్ట్ శంకర్' తో చాలా ఏళ్ల తర్వాత భారీ కం బ్యాక్ అందుకున్న పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోతో ఇండస్ట్రీకి ఓ పెద్ద మాస్ హిట్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. విడుదలకు ముందు లైగర్ టీం కాన్ఫిడెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంది.

ఈ సినిమా కలెక్షన్ల లెక్క రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందంటూ అన్నాడు విజయ్ దేవరకొండ. అలాంటి మాటలు, ప్రమోషన్స్ తో భారీ స్థాయిలో అంచనాలను పెంచుకున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది. మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద చతికలబడ్డ ఈ సినిమా ఆ తర్వాత డిజాస్టర్ గా నిలిచింది. ఇక లైగర్ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ సినిమాని ఎక్కడ ప్రమోట్ చేయలేదు. సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎర్లీ మార్నింగ్ షోల తోనే తేలిపోవడంతో విజయ్ దేవరకొండ సైలెంట్ అయ్యాడని తాజాగా ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తాను నటించిన 'బేబీ' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "లైగర్ రిజల్ట్ ఏంటో ఎర్లీ మార్నింగ్ షోస్ అయ్యేసరికి అందరికీ అర్థమయిపోయింది. ఇంకా ఈ సినిమాను మనం జనాల మీదకి రుద్దాలి అనే ఇంటెన్షన్ ను అన్న పక్కన పెట్టేసాడు. శారీరకంగా, మానసికంగా సినిమా కోసం మనం ఇంత కష్టపడ్డాం అని బాధపడడం కూడా మానేసి ఆగస్టు 25 సాయంత్రం నుంచి 'ఖుషి' మూవీ కోసం ప్రిపేర్ అవడం మొదలుపెట్టాడు. అన్న సినిమాలు ప్లాప్ అయినా కూడా తన ఎఫర్ట్స్ మీద ఎవరు వేలెత్తి చూపలేదు" అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక 'బేబీ' సినిమా విషయానికొస్తే.. 'కలర్ ఫోటో' వంటి జాతీయ అవార్డు అందుకున్న సినిమాకు కథను అందించిన సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. విరాజ్ అశ్విన్ మరో కీలక పాత్ర పోషించారు. స్కూల్, కాలేజ్ డేస్ ల్ సాగే అందమైన ప్రేమ కథగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందనను రాబట్టాయి. కేవలం పాటలతోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై యువ నిర్మాత SKN ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Also Read : శ్రీ విష్ణు 'సామజవరగమన' పై బన్నీ ప్రశంసలు - ఇది అసలైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, బతికి బయటపడింది ఇద్దరే
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, బతికి బయటపడింది ఇద్దరే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, బతికి బయటపడింది ఇద్దరే
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, బతికి బయటపడింది ఇద్దరే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Embed widget