By: ABP Desam | Updated at : 10 Jun 2023 10:49 AM (IST)
బెల్లంకొండ సురేష్ కారు అద్దాలు ధ్వంసం(Photo Credit: ABP Desam/Instagram)
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత బెల్లకొండ సురేష్ కారు అద్దాలను గుర్తు తెలియని దుండగులు పగులగొట్టారు. కారులోని కొంత నగదుతో పాటు ఖరీదైన మద్యం సీసాలను దొంగిలించారు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ జూబ్లీహిల్స్, రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి లాగే తన ఇంటి ముందు కారు పార్క్ చేశారు. టీఎస్ 09 ఈసీ 3033 నెంబర్ బెంజి కారు రాత్రి పూట పార్కింగ్ ప్లేసులో పెట్టారు. ఇవాళ ఉదయం లేచి చూసే సరికి కారు అద్దాలు పగలుగొట్టబడి ఉన్నాయి. అంతేకాదు, కారులోని నగదుతో పాటు విలువైన 11 రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు(ఒక్క బాటిల్ ధర రూ. 28 వేలు) మాయం అయ్యాయి. సుమారు రూ. 50 వేల నగదును కూడా దుండగులు అపహరించారు.
కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు మద్యం బాటిళ్లు, నగదు దొంగతనం చేసిన ఘటనపై బెల్లంకొండ సురేష్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బెంజి కారు వెనుకాల అద్దం పగలగొట్టిన దుండగులు డిక్కీలో ఉన్న మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సమీపంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారులో మద్యం సీసాలు ఉన్న విషయం తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి దగ్గర అనుమతి లేకుండా 6 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు ఉండకూడదు. కానీ, బెల్లంకొండ కారులో 11 మద్యం బాటిళ్లు ఎందుకు ఉన్నాయనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, 100 కాల్ చేసి చెప్పినప్పుడు 11 మద్యం బాటిళ్లు ఉన్నట్లు చెప్పిన బెల్లంకొండ, ఫిర్యాదులో మాత్రం 5 మాత్రమే ఉన్నాయని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ కేసుపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎన్నో అద్భుత సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. బాలకృష్ణతో కలిసి ‘చెన్నకేశవరెడ్డి’, ‘లక్ష్మీనరసింహా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. జూ. ఎన్టీఆర్, రామ్ పోతినేతిలో పాటు పలువురు హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన కొడుకులు శ్రీనివాస్, గణేష్ హీరోలుగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలను నిర్మించడం తగ్గించారు. కొడుకులను హీరోలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ బ్యూటీ, నెట్టింట్లో ఫోటోలు వైరల్
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు
Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
/body>