అన్వేషించండి

Rashmika Mandanna :రష్మికా మందన్నా AI వీడియోలపై షాకింగ్ కామెంట్స్‌! మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన!

Rashmika Mandanna :ఏఐ టెక్నాలజీ వచ్చిన తరువాత మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఎక్కువయ్యాయి. ఇదే విషయంపై నటి రష్మికా మందన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఎవ్వరూ సురక్షితంగా లేరని అన్నారు.

సాంకేతిక అభివృద్ధి మానవ సమాజం అభివృద్ధికి గొప్ప సహకారం అందించినప్పటికీ, అదే సమయంలో పతనానికి కూడా కారణమవుతుంది. ఈ సాంకేతికతను దుర్వినియోగం చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. మోసం, వ్యక్తులను మార్ఫింగ్ చేయడం ద్వారా అసభ్యంగా చిత్రీకరించడం వంటి అనేక రకాల నేరాలకు కొంతమంది నిరంతరం పాల్పడుతున్నారు. దీనిని నిరోధించడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా, కఠినమైన శిక్షలు విధించినా నేరాలు తగ్గడం లేదు. సాంకేతికత పెరుగుదుల మనిషి ఎదుగుదలకు దన్నుగా నిలవాలని వారికిని తొక్కే పరిస్థితికి రాకూడదని నేషనల్‌ క్రష్, నటి రష్మికా మందన్నా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతను సరైన విధంగానే ఉపయోగిద్దామని సూచించారు.

ఏఐ సాంకేతికత దుర్వినియోగం

ముఖ్యంగా ఏఐ సాంకేతికత వచ్చిన తర్వాత, అందులో జరిగే అనేక అవాంఛనీయ ఘటనలు మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. సెలబ్రిటీల నుంచి సాధారణ మహిళల వరకు ఎవరూ ఈ బుల్లీయింగ్‌ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఏఐ సాంకేతికత ఏది, నిజం ఏది అని తెలియని విధంగా దాని అభివృద్ధి ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అలాంటి ఏఐ సాంకేతికత కారణంగా ప్రముఖ నటి రష్మికా మందన్నా ఇబ్బంది పడ్డారు. అందుకే దీనిపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రష్మికా మందన్నా విజ్ఞప్తి

సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టులో" నిజం సృష్టించగలిగేది అయితే విచక్షణ మన గొప్ప రక్షణగా మారుతుంది. AI అనేది అభివృద్ధికి ఒక శక్తి, అయితే దానిని దుర్వినియోగం చేయడం, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం కొంతమందిలో నైతిక పతనాన్ని సూచిస్తుంది. ఇంటర్నెట్ ఇకపై నిజానికి ప్రతిబింబం కాదని గుర్తుంచుకోండి. ఇది ఏదైనా కల్పించగల ఒక కాన్వాస్." అని అభిప్రాయపడ్డారు. 

అంతే కాకుండా బాధ్యతాయుతంగా ఉందామని పిలుపునిచ్చారు రష్మిక.... "దుర్వినియోగానికి అతీతంగా ఎదిగి, మరింత గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి AIని ఉపయోగిద్దాం. బాధ్యతారహితంగా ఉండటానికి బదులుగా బాధ్యతగా ఉందాం. కొందరు మానవులుగా ప్రవర్తించలేకపోతే, వారికి కఠినమైన క్షమించరాని శిక్ష విధించాలి” అని తెలిపారు. 

ఏఐ బారిన పడిన వారిలో రష్మిక మొదటి స్థానంలో ఉంటారు. 2023లోనే ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి డీప్‌ ఫేక్ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించారు. తనను అసభ్యంగా చిత్రీకరిస్తూ వీడియో విడుదలైనప్పుడు రష్మికా మందన్నా అప్పుడు కూడా చాలా బాధపడ్డారు. ప్రస్తుత కాలంలో సాంకేతికత చాలా రాంగ్‌ వేలో వినియోగిస్తున్నారని అన్నారు. పాఠశాల, కళాశాల రోజుల్లో ఇలాంటి వీడియో విడుదలై ఉంటే ఎలా ఎదుర్కొనేదానినో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పుడు మానసికంగా ఇలాంటి వాటికి తట్టుకొని నిలబడే శక్తి వచ్చిందని అన్నారు. మరికొందరు ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు ముందుగానే చర్యలు తీసుకోవాలని అప్పట్లో విజ్ఞప్తి చేశారు. ఆ వీడియో తర్వాత ప్రభుత్వాలు స్పందించాయి. అప్పటి నుంచి ఇలాంటి కంటెంట్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం డీప్ ఫేక్, ఏఐ ద్వారా విడుదలయ్యే వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే వీడియోలను తొలగించి, తగిన చర్యలు తీసుకుంటోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balakrishna New Movie : బాలయ్యతో డింపుల్ - బ్లండర్ మిస్టేక్ అన్న నెటిజన్... మీకెవరు చెప్పారంటూ డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్
బాలయ్యతో డింపుల్ - బ్లండర్ మిస్టేక్ అన్న నెటిజన్... మీకెవరు చెప్పారంటూ డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2026: విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?
విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?
Biker Movie : షూటింగ్ టైంలో ఎన్నో యాక్సిడెంట్స్ - శర్వానంద్ బైకర్ మూవీకి మోటివ్ ఏంటో తెలుసా?
షూటింగ్ టైంలో ఎన్నో యాక్సిడెంట్స్ - శర్వానంద్ బైకర్ మూవీకి మోటివ్ ఏంటో తెలుసా?
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Embed widget