అన్వేషించండి

Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా చేస్తున్నారనే వార్తలతో ఏపీలో  రాజ్యసభ సీట్ల పంపకాల్లో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పొత్తు ధర్మంలో భాగంగా తన సీటును వదులుకుంది. కొత్త ఫార్ములా ఖరారు చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సీట్లు టీడీపీ (3), జనసేన (1)కు కేటాయించారు.
  • అన్నామలై వ్యవహారంతో బీజేపీ తమ ఒక్క సీటును త్యాగం చేసింది.
  • కూటమి నేతలు సమావేశమై సీట్ల పంపకం, భవిష్యత్ కార్యాచరణ చర్చించారు.

Andhra Pradesh Rajya Sabha Elections:ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సీట్ల పంపకం సజావుగా సాగిపోయింది. టీడీపీకి మూడు సీట్లు దక్కగా, జనసేనకు ఒక సీటు కేటాయించారు. ఇక్కడ మొన్నటి వరకు తనకు ఒక సీటు కావాలని పట్టుబట్టింది. తీరా పంపకాల టైంలో వెనక్కి తగ్గింది. తన సీటును త్యాగం చేసింది. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలతో బీజేపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. 

రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకాల ఫార్ములా గురువారం రాత్రి ఖరారు అయ్యింది. గతంలో అనుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీకి ఒక సీటు దక్కాల్సి ఉండగా, తాజా పరిణామాలతో ఆ స్థానాన్ని బీజేపీ వదులుకుంది. గతంలో ఒక సీటు బీజేపీకి, మరొకటి జనసేనకు, మిగిలిన రెండు టీడీపీకి ఇవ్వాలని భావించారు. కానీ ఇప్పుడు బీజేపీ తన క్లెయిమ్‌ను ఉపసంహరించుకోవడంతో టీడీపీ లాభపడింది. 

అన్నామలై ఎఫెక్ట్‌తో...

ఈ కీలక మార్పు వెనుక ప్రధానంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఏపీ నుంచి బీజేపీకి దక్కాల్సిన ఆ ఒక్క రాజ్యసభ సీటును అన్నామలై కోసం కేటాయించాలని అధిష్ఠానం తొలుత భావించింది. 

అయితే కొన్ని రోజులుగా అన్నామలై పార్టీ వీడుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, బీఎల్‌ సంతోష్‌లో వరుస భేటీలు నిర్వహించారు. ఈ చర్చల సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని  తెలియజేసినట్టు సమాచారం. తమిళనాడు రాజకీయ పరిస్థితులపై వివరణ ఇస్తూ, పార్టీ నుంచి తప్పుకోవాలని తన ఆలోచనను నేతలకు వివరించారు. అన్నామలై ఎగ్జిట్‌ ఖాయమనే సంకేతాలు రావడంతో ఏపీలో ఆ సీటును క్లెయిమ్‌‌ చేయకూడదని బీజేపీ నిర్ణయించింది. 

జనసేన- టీడీపీలో జోష్

జనసేనకు ఒక సీటు దక్కడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా, పెద్దల సభలో జనసేన గళం వినిపించే అవకాశం దక్కింది. టీడీపీ మూడు సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు తన రాజకీయ పరపతిని మరింత పెంచుకోనున్నారు. 

మూడు పార్టీల మధ్య సమన్వయ సమావేశం

గురువారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మిత్రపక్షాల బలాన్ని బట్టి సీట్లను సర్దుబాటు చేయడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 

మూడు ప్రాంతాల్లో సభలు

ఈ సమావేశంలో కేవలం సీట్ల పంపకాలే కాకుండా భవిష్యత్‌ కార్యచరపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ఐక్యతను చాటిచెప్పేలా ఈ నెల చివర్లో  తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సీట్ల పంపకం ఎలా జరిగింది?

టీడీపీకి మూడు సీట్లు దక్కగా, జనసేనకు ఒక సీటు కేటాయించారు. గతంలో బీజేపీకి కేటాయించిన సీటును అది వదులుకుంది.

రాజ్యసభ సీటును బీజేపీ ఎందుకు వదులుకుంది?

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై పార్టీ వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సీటును అన్నామలై కోసం కేటాయించాలని మొదట భావించారు.

రాజ్యసభ సీట్ల పంపకంపై ఏ నాయకులు చర్చించారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల వ్యూహంపై చర్చించారు.

కూటమి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు?

కూటమి ఐక్యతను చాటిచెప్పేలా ఈ నెల చివర్లో తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget