అన్వేషించండి

Rajendra Prasad: నా చివరి శ్వాస వరకూ అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడతా - బూతు కామెంట్స్‌ వివాదానికి చెక్ పెట్టిన రాజేంద్ర ప్రసాద్

Rajendra Prasad Abuse Words: ఇటీవల అలీపై బూతు కామెంట్స్ వివాదంపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తాజాగా స్పందించారు. ఇకపై అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని స్పష్టం చేశారు.

Rajendra Prasad's About Abuse Words On Ali: ఇకపై తన జీవితంలో అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని సీనియర్ యాక్టర్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో అలీపై బూతు కామెంట్స్ పెను దుమారం రేపిన వేళ ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. 

ఎవరినీ అమర్యాదగా మాట్లాడను

ఈ క్షణం నుంచి ఇకపై ఎవరినీ అమర్యాదగా మాట్లాడనని చెప్పారు రాజేంద్రప్రసాద్. ఆ కామెంట్స్‌పై అలీకి ఎలాంటి ఇబ్బంది లేదని.. అనవసరంగా విషయాన్ని పెద్దది చేస్తున్నారని అన్నారు. 'అలీ నేను పర్సనల్‌గా మాట్లాడుకున్న విషయం ఇది. ఆయనకు ఇబ్బంది లేదు. మీరెందుకు పెద్దది చేస్తున్నారు. ఇండస్ట్రీలో హానెస్ట్‌గా ప్రేమలు పంచుకోవడమే ఉంటుంది.' అని అన్నారు.

చాలా హర్ట్ అయ్యాను

మొన్న ఈవెంట్‌లో జరిగిన పరిణామాలకు చాలా హర్ట్ అయినట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. 'జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నా. ఇక మీదట అందరినీ బహువచనంతోనే పిలుస్తా. అలా పిలవడం మా అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్నా. నా చివరి శ్వాస వరకూ అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతా. నా పని నాకు ఉంది. ఎవరో ఏదో పని లేని వాళ్లు ఏదో చేశారని నేనేదో చేస్తూ కూర్చోలేను.

ఇండస్ట్రీలో ఉన్న వారంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. ప్రేమలు ఎక్కువైతే వచ్చిన సమస్యే ఇది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పటిలా ఎమోషన్స్, ఎఫెక్షన్స్ చూపించుకునే అవకాశాలు లేవు. అందుకే ఎవరి లిమిటేషన్స్‌లో వారు ఉండడం బెటర్ అని తెలుసుకున్నా. జీవితంలో ఏదీ టేకిట్ గ్రాంటెడ్‌గా ఉండకూడదు. డేవిడ్ వార్నర్ విషయంలో ఆ కామెంట్స్ చేసినప్పుడు కూడా ఆయన సహా నితిన్, శ్రీలీల అంతా కలిసి బయటకు వచ్చాం. ఆ చనువు కొద్దీ మాత్రమే అలాంటి పిలుపు వచ్చేసింది.' అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

Also Read: లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌లోకి కొత్త విలన్ - ఒళ్లంతా గోల్డ్.. లారెన్స్ 'బెంజ్' మూవీ సాలిడ్ అప్‌డేట్..

అసలేం జరిగిందంటే?

ఈ నెల 1న సీనియర్ డైరెక్టర్, యాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయనతో పని చేసిన నటీనటులు, సాంకేతిక బృందం అంతా హాజరయ్యారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఈ ఈవెంట్‌కు హాజరు కాగా.. స్టేజీపై ఆయన అలీని ఉద్దేశించి కొన్ని బూతు వర్డ్స్ వాడడం ఇబ్బంది కలిగించింది. 'ఏరా అలీగా ఎక్కడ? ఇటు రా లం...' అంటూ నోరు జారారు. అయితే.. అలీ కూడా దీన్ని సరదాగానే తీసుకున్నారు.

ఎంత చనువు ఉన్నా తోటి యాక్టర్‌ను అలా అనడం ఏంటంటూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలోనూ నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌ను సంబోధించిన తీరుపైనా అంతా చర్చించుకున్నారు. అయితే.. దీనిపై స్పందించిన అలీ.. రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్ అని.. కుమార్తె పోయిన దుఃఖంలో ఉన్నారని.. ఈ విషయాన్ని పెద్దది చెయ్యొద్దని రిక్వెస్ట్ చేశారు. తాజాగా.. ఈ అంశంపైనే రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget