అన్వేషించండి

Rajendra Prasad: నా చివరి శ్వాస వరకూ అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడతా - బూతు కామెంట్స్‌ వివాదానికి చెక్ పెట్టిన రాజేంద్ర ప్రసాద్

Rajendra Prasad Abuse Words: ఇటీవల అలీపై బూతు కామెంట్స్ వివాదంపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తాజాగా స్పందించారు. ఇకపై అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని స్పష్టం చేశారు.

Rajendra Prasad's About Abuse Words On Ali: ఇకపై తన జీవితంలో అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని సీనియర్ యాక్టర్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో అలీపై బూతు కామెంట్స్ పెను దుమారం రేపిన వేళ ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. 

ఎవరినీ అమర్యాదగా మాట్లాడను

ఈ క్షణం నుంచి ఇకపై ఎవరినీ అమర్యాదగా మాట్లాడనని చెప్పారు రాజేంద్రప్రసాద్. ఆ కామెంట్స్‌పై అలీకి ఎలాంటి ఇబ్బంది లేదని.. అనవసరంగా విషయాన్ని పెద్దది చేస్తున్నారని అన్నారు. 'అలీ నేను పర్సనల్‌గా మాట్లాడుకున్న విషయం ఇది. ఆయనకు ఇబ్బంది లేదు. మీరెందుకు పెద్దది చేస్తున్నారు. ఇండస్ట్రీలో హానెస్ట్‌గా ప్రేమలు పంచుకోవడమే ఉంటుంది.' అని అన్నారు.

చాలా హర్ట్ అయ్యాను

మొన్న ఈవెంట్‌లో జరిగిన పరిణామాలకు చాలా హర్ట్ అయినట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. 'జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నా. ఇక మీదట అందరినీ బహువచనంతోనే పిలుస్తా. అలా పిలవడం మా అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్నా. నా చివరి శ్వాస వరకూ అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతా. నా పని నాకు ఉంది. ఎవరో ఏదో పని లేని వాళ్లు ఏదో చేశారని నేనేదో చేస్తూ కూర్చోలేను.

ఇండస్ట్రీలో ఉన్న వారంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. ప్రేమలు ఎక్కువైతే వచ్చిన సమస్యే ఇది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పటిలా ఎమోషన్స్, ఎఫెక్షన్స్ చూపించుకునే అవకాశాలు లేవు. అందుకే ఎవరి లిమిటేషన్స్‌లో వారు ఉండడం బెటర్ అని తెలుసుకున్నా. జీవితంలో ఏదీ టేకిట్ గ్రాంటెడ్‌గా ఉండకూడదు. డేవిడ్ వార్నర్ విషయంలో ఆ కామెంట్స్ చేసినప్పుడు కూడా ఆయన సహా నితిన్, శ్రీలీల అంతా కలిసి బయటకు వచ్చాం. ఆ చనువు కొద్దీ మాత్రమే అలాంటి పిలుపు వచ్చేసింది.' అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

Also Read: లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌లోకి కొత్త విలన్ - ఒళ్లంతా గోల్డ్.. లారెన్స్ 'బెంజ్' మూవీ సాలిడ్ అప్‌డేట్..

అసలేం జరిగిందంటే?

ఈ నెల 1న సీనియర్ డైరెక్టర్, యాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయనతో పని చేసిన నటీనటులు, సాంకేతిక బృందం అంతా హాజరయ్యారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఈ ఈవెంట్‌కు హాజరు కాగా.. స్టేజీపై ఆయన అలీని ఉద్దేశించి కొన్ని బూతు వర్డ్స్ వాడడం ఇబ్బంది కలిగించింది. 'ఏరా అలీగా ఎక్కడ? ఇటు రా లం...' అంటూ నోరు జారారు. అయితే.. అలీ కూడా దీన్ని సరదాగానే తీసుకున్నారు.

ఎంత చనువు ఉన్నా తోటి యాక్టర్‌ను అలా అనడం ఏంటంటూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలోనూ నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌ను సంబోధించిన తీరుపైనా అంతా చర్చించుకున్నారు. అయితే.. దీనిపై స్పందించిన అలీ.. రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్ అని.. కుమార్తె పోయిన దుఃఖంలో ఉన్నారని.. ఈ విషయాన్ని పెద్దది చెయ్యొద్దని రిక్వెస్ట్ చేశారు. తాజాగా.. ఈ అంశంపైనే రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Best Foods to Eat Raw : ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
Embed widget