Varanasi Latest Update : 'వారణాసి'లో అదే బిగ్ టాస్క్ - మేకింగ్పై రాజమౌళి రియాక్షన్
Rajamouli Reaction : 'వారణాసి' మేకింగ్పై ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు రాజమౌళి. ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్లో తీయడం నిజంగా పెద్ద సవాల్ అని అన్నారు.

Rajamouli Reaction About Varanasi Movie Format : దర్శకధీరుడు రాజమౌళి రాబోయే పాన్ వరల్డ్ సూపర్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ 'వారణాసి' కోసం... బడ్జెట్ నుంచి VFX వరకూ భారీగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారణాసి పుట్టుక నుంచి రామాయణంలో ముఖ్య ఘట్టాన్ని సిల్వర్ స్క్రీన్పై అద్భుతంగా ఆవిష్కరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మూవీని ఐమ్యాక్స్ ఫార్మాట్లో తీసుకు రానున్నట్లు జక్కన్న ముందు అనౌన్స్ చేశారు. అయితే, అది మూవీ మొత్తం ఉండదట.
అదే బిగ్ టాస్క్
తాజాగా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వారణాసి' మేకింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు రాజమౌళి. ఈ ప్రాజెక్టును ఐమ్యాక్స్ ఫార్మాట్లో తీయాలనుకున్నప్పుడు తమకు అది నిజంగా పెద్ద సవాల్గా అనిపించిందని అన్నారు. 'ఐమ్యాక్స్ ఫార్మాట్లో షూట్ చేసి సినిమా స్కోప్కు తగ్గించాలా? లేదా సినిమా స్కోప్లో తీసి ఐమ్యాక్స్ వెర్షన్కు ఫ్రేమ్ చేయాలా ? అనే దానిపై మా సినిమాటోగ్రాఫర్, టెక్నికల్ టీంతో చాలా రోజులు డిస్కస్ చేశాం.
ఈ సినిమా మొత్తం సినిమా స్కోప్ 1:90:1లోనే ఉంటుంది. ఐమ్యాక్స్ స్క్రీన్లలో మాత్రం సినిమాలోని కీలక సీన్స్ ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్లో 1:43:1లో కనిపిస్తాయి. ఎప్పుడు ఏ ఫార్మాట్లో మూవీ చూపించాలి అనేది ఇప్పటికీ మాకు ఓ సవాలే. 'ఆ టైంకు ఆ సీన్ను ట్రూ ఐమ్యాక్స్లో ఉన్నది ఉన్నట్లు చూపిద్దాం.' అని మా టీంకు చెప్పాను.' అని అన్నారు.
Also Read : హీరోయిన్గా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె - ఎమోషనల్గా 'సీతా పయనం' ట్రైలర్
తెలుగు రాష్ట్రాల్లో ఐమ్యాక్స్!
'వారణాసి' ఐమ్యాక్స్ ఫార్మాట్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఒక్క థియేటర్ కూడా లేదు. అయితే, 2027, ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... అప్పటికి ఐమ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది జరిగితే సిల్వర్ స్క్రీన్పై ఓ అద్భుతాన్ని చూసే అవకాశం దక్కుతుందని మూవీ లవర్స్ అంటున్నారు.
జార్జియాలో షూటింగ్!
ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ కాగా... తాజాగా జార్జియాలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రాజమౌళితో పాటు కొందరు అక్కడ లొకేషన్స్ చూసేందుకు వెళ్లినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే అక్కడ షూట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ రన్ టైం 3 గంటల పైనే ఉంటుందని రాజమౌళి చెప్పారు. ఒకటే పార్టులో స్టోరీ మొత్తం ఉంటుందని... మైథాలజీ ఎపిసోడ్ 25 నిమిషాలు ఉంటుందని వెల్లడించారు. మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది రాబోయే మూవీ కోసం ఇంటర్నేషనల్ స్థాయిలో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
మూవీలో రుద్రగా మహేష్ బాబు, మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ 'రణ కుంభ'గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై 1300 కోట్ల భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
























