అన్వేషించండి

Modi video: "స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి

Modi video: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నిన్న రిలీజ్ చేసిన వీడియోకు స్పందించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధాని మోదీ రెండో వీడియోలో యువత సూచనలకు ధన్యవాదాలు తెలిపారు.
  • నీట్ పేపర్ లీక్‌పై తీవ్రతను ప్రధాని తొలి వీడియోలో వివరించారు.
  • లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు హామీ ఇచ్చారు.
  • మొదటి వీడియోతో మోదీ ఫాలోవర్లు కోటి మందికి పైగా పెరిగారు.

Modi video: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని చెబుతున్న ప్రధానమంత్రి మోదీ వరుసగా వీడియోలు పెడుతున్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై చర్యలు తీసుకుంటున్నట్టు ఓ వీడియో విడుదల చేశారు. ఇవాళ మరో సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. తన మొదటి వీడియోకు స్పందించి, సలహాలు సూచనలు చేసిన వారందరికీ థాంక్స్ చెప్పారు. మన బంధం చాలా బలంగా ఉంటుందని అన్నారు. విలువైన సూచనలు చేసిన యువతకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. యువత చూపిన ప్రేమ రెట్టింపు బలాన్ని ఇచ్చిందన్నారు. 

ప్రధాని మోదీ వీడియోలో ఇలా అన్నారు, "ధన్యవాదాలు మిత్రులారా. నిన్న రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం నాకు లభించింది. నేను పోస్ట్ చేసిన వీడియోకు మీరు స్పందించిన తీరు. మీరు ఇచ్చిన సానుకూల సూచనలు. అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మన బంధం మరింత చురుకుగా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ధన్యవాదాలు. మిత్రులారా, ధన్యవాదాలు." ఆయన వీడియో క్యాప్షన్‌లో ఇలా కూడా రాశారు, "నిన్న నా వీడియో చూసి ఉపయోగకరమైన సూచనలు పంపిన యువతకు ధన్యవాదాలు."

నీట్-యూజీ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. వీధుల్లో విద్యార్థుల ఆగ్రహం పెల్లుబుకుతుండగా, అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ నడుస్తోంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు, యువత గళమెత్తుతున్నారు. ఇంతలో ప్రధాని మోదీ గురువారం (జూలై 23) యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ సోషల్ మీడియాలో తొలిసారిగా సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. 

ప్రధాని మోదీ సందేశం ఇదే...

నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై యువతలో నెలకొన్న ఆగ్రహం, ఆందోళనలకు ప్రతిస్పందనగా ప్రధాని మోదీ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో, పేపర్ లీక్ అనేది చిన్న విషయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇది లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బాధాకరమైన విషయం. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. నిందితులను పట్టుకుని ప్రస్తుతం జైలులో ఉంచారు. అని వెల్లడించారు.  

ఇంత తక్కువ సమయంలో 22 లక్షల మంది విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, జూన్ 19న ఫలితాలను విడుదల చేసిందని ఆయన అన్నారు. పేపర్ లీక్‌ల వంటి ఘటనలను ఉక్కు పిడికిలితో ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్ తిరిగి సమావేశమైనప్పుడు, పేపర్ లీక్‌లకు బాధ్యులైన వారికి అత్యంత కఠినమైన శిక్ష పడేలా ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని అన్నారు.

అమాంతం పెరిగిన మోదీ ఫాలోవర్స్‌

ఈ వీడియో విడుదలైన తర్వాత, ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ వేగంగా పెరిగింది. ప్రధాని ఈ వీడియోను పోస్ట్ చేసినప్పుడు, ఆయనకు 101 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కేవలం 12 గంటల తర్వాత, ఆయన ఫాలోయింగ్ 102 మిలియన్లకు చేరుకుంది. అంతేకాకుండా, 15.6 మిలియన్ల మంది ఈ వీడియోను లైక్ చేయగా, దీనికి 288 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 

Frequently Asked Questions

ప్రధాని మోదీ ఇటీవల ఏ విషయంపై సెల్ఫీ వీడియో విడుదల చేశారు?

నీట్ పేపర్ లీకేజీపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ మొదటి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తరువాత, తన మొదటి వీడియోకు స్పందించి, సలహాలు సూచనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ మరో వీడియోను రిలీజ్ చేశారు.

నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోదీ సందేశం ఏమిటి?

పేపర్ లీక్ చిన్న విషయం కాదని, లక్షలాది మంది విద్యార్థులకు బాధాకరమని మోదీ అన్నారు. నిందితులను పట్టుకుని జైలులో ఉంచామని, ఇలాంటి ఘటనలను ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటామని తెలిపారు.

పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

పేపర్ లీక్‌ల వంటి ఘటనలను ఉక్కు పిడికిలితో ఎదుర్కోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా బిల్లును ఆమోదిస్తామని ప్రధాని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో విడుదల తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి ప్రభావం కనిపించింది?

వీడియో విడుదలైన తర్వాత, ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 12 గంటల్లో 101 మిలియన్ల నుండి 102 మిలియన్లకు పెరిగారు. ఈ వీడియోకు 15.6 మిలియన్ల లైక్‌లు, 288 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget