అన్వేషించండి

Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్ క్వశ్చన్స్... కూల్‌గా ఇచ్చి పడేసిన 'డాకు మహారాజ్' హీరోయిన్

Pragya Jaiswal : సీనియర్ హీరో బాలయ్యతో కలిసి రెండు సార్లు స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఏజ్ గ్యాప్ గురించి స్పందిస్తూ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఆసక్తికరంగా సమాధానం చెప్పింది.

స్టార్ హీరోలతో వరుసగా సినిమాలలో నటించే అవకాశం రావడం కష్టమే. ఒకవేళ అలాంటి ఛాన్స్ వచ్చిందంటే ఆ హీరోయిన్ లక్కీ అని చెప్పాలి. ఇలాంటి లక్కీ ఛాన్స్ గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)కి కలిసి వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో కలిసి ఈ అమ్మడు వరుసగా రెండు సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ప్రగ్యా జైస్వాల్ బాలయ్యతో కలిసి వరుసగా రెండు సినిమాలు చేయడం, ఏజ్ గ్యాప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

బాలయ్యతో రెండు సినిమాలపై...
ఈ సందర్భంగా తాజాగా బాలయ్యతో రెండు సినిమాల గురించి ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ "డాకు మహారాజు మూవీ నా బర్త్ డే రోజునే రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. దీంతో ఈ ఏడాది నాకు అద్భుతంగా ప్రారంభమైందని చెప్పాలి. ఈ మూవీలో నేను చేసిన కావేరి పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. డాకు మహారాజు మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి నన్ను అందరూ 'డాకు మహారాణి' అని పిలవడం చూస్తుంటే, కావేరి పాత్ర జనాలపై ఎంత ఎఫెక్ట్ చూపించిందో అర్థమవుతుంది. ఈ సినిమా నాకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాలి. పైగా ఈ మూవీలో ఫస్ట్ టైం గర్భిణీ పాత్రలో నటించడం మంచి ఫీలింగ్ నిచ్చింది. పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసే పోరాటం ప్రేక్షకుల మనసులను కదిలించింది. గతంలో ఎప్పుడూ చేయని రోల్ చేయడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా. కానీ మహిళలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో ఈ రోల్ చూస్తే అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చారు ప్రగ్యా. ఇక ఈ బ్యూటీ గతంలో బాలయ్యతో కలిసి 'అఖండ' అనే సూపర్ హిట్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. 

బాలయ్య తో ఏజ్ గ్యాప్ గురించి... 
ఈ నేపథ్యంలోనే బాలయ్యతో ఏజ్ గ్యాప్ గురించి కూడా ప్రగ్యా స్పందించింది. "బాలయ్య ఒక లెజెండ్. ఆయన పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది పాజిటివిటీ. ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకోవచ్చు. మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పే ఆయన, ప్రతి ఒక్కరిని ఒకేలా గౌరవిస్తారు. బాలయ్య చాలా మంచి మనిషి. అయితే రోల్ ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు. వయసు ఆధారంగా ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరు. నేను చేయాల్సిన రోల్ కు 100% న్యాయం చేశానా లేదా ? అనేదే ఆలోచిస్తాను. అంతేగాని నా వరకు ఏజ్ అనేది అసలు సమస్య కానే కాదు" అంటూ తనకంటే ఎక్కువ ఏజ్ ఉన్న బాలయ్య తో కలిసి నటించడంపై వస్తున్న కామెంట్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

Also Readడాక్యుమెంటరీ వివాదంలో నయనతారకు షాక్... నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ రిజెక్ట్ చేసిన కోర్ట్

ముచ్చటగా మూడోసారి... 
'అఖండ' సినిమాలో బాలయ్యతో కలిసి నటించిన ప్రగ్యా, రెండవ సారి 'డాకు మహారాజ్'లో కూడా కన్పించింది. ఇక సీక్వెల్ 'అఖండ 2'లో కూడా ప్రగ్యా హీరోయిన్ గా నటించబోతుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ రోల్ వేరే హీరోయిన్ చేయబోతుందని అంటున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అంటున్నారు. మరి ముచ్చటగా బాలయ్యతో కలిసి మూడోసారి నటించే ఛాన్స్ ప్రగ్యాను వరిస్తుందా లేదా అని తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Also Read: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
GSLV F15 Satellite: సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
Crime News: ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
CM Chandrababu: 'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం
'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keslapur Nagaoba Jathara | ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధం | ABP DesamG Trisha Century U19 Womens T20 World Cup | టీమిండియాను సెమీస్ కు తీసుకెళ్లిన తెలంగాణ అమ్మాయి | ABPMaha Kumbha Mela 2025 | ప్రయాగరాజ్ కు పోటెత్తుతున్న భక్తులు | ABP DesamChiranjeevi Speech at Experium | ఎక్స్ పీరియమ్ థీమ్ పార్కును ప్రారంభోత్సవంలో చిరంజీవి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
GSLV F15 Satellite: సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
Crime News: ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
CM Chandrababu: 'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం
'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం
SSMB29: ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్
ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్
Nara Lokesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో ప్రతి శనివారం ఇక 'నో బ్యాగ్ డే', మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - త్వరలో ప్రతి శనివారం ఇక 'నో బ్యాగ్ డే', మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
Crime News: చెల్లిపై కోటి 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడు - వీడు అన్న కాదు హంతకుడు !
చెల్లిపై కోటి 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి చంపేశాడు - వీడు అన్న కాదు హంతకుడు !
Rajkot T20 Result: పోరాడి ఓడిన భారత్.. హార్దిక్ పోరాటం వృథా.. ఇంగ్లాండ్ ను గెలిపించిన బౌలర్లు.. 
పోరాడి ఓడిన భారత్.. హార్దిక్ పోరాటం వృథా.. ఇంగ్లాండ్ ను గెలిపించిన బౌలర్లు.. 
Embed widget