Nayanthara: కథ ఒక్కటే... ముగ్గురు స్టార్లతో మూడు సినిమాలు... బ్లాక్ బస్టర్స్ కొట్టిన లేడీ సూపర్ స్టార్
ఓకే కథతో ముగ్గురు స్టార్లతో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన లేడీ సూపర్ స్టార్ నయనతార. వెంకటేష్, అజిత్, చిరంజీవితో 20 ఏళ్లలో మూడు పెద్ద హిట్లు. అన్నీ ఓకే కథతో రూపొందడం విశేషం.

ఇన్నేళ్ల సినిమా చరిత్రలో కథను పోలిన కథలు ఉండడం సహజం. కానీ సౌత్ ఇండియన లేడీ సూపర్ స్టార్ ఒకరు ఇంచు మించు ఓకే కథతో మూడు సూపర్ హిట్స్ అదీ ముగ్గురు వేరే వేరే సూపర్ స్టార్స్ తో సాధించడమే విశేషం. ఆమె మరెవరో కాదు గత 20 ఏళ్లుగా సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార.
2007లో వెంకటేష్ తో 'తులసి'
బోయపాటి శ్రీను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 2007లో వచ్చిన 'తులసి'లో నయనతార హీరోయిన్. ఈ సినిమాలో వెంకటేష్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉన్న ఫ్యాక్షన్ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి గా కనిపిస్తే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని, అతని కోపం తట్టుకోలేక వదలి వెళ్లిపోయి తమ బిడ్డతో సింగిల్ మదర్ గా జీవించే భార్యగా నయన్ నటించారు. ఆ భార్యా భర్తలు ఎలా కలిశారు? అనేదే సినిమా కథ. హీరోయిన్ గా ఎర్లీ డేస్ లో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో నయనతార సూపర్ హాట్ గా కనిపిస్తారు. 12 కోట్లతో తీసిన 'తులసి' రూ. 32 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో డైరెక్ట్ గా 225 సెంటర్ల లో 50డేస్ కంప్లీట్ చేసుకున్న తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం.
2019దలో అజిత్ తో 'విశ్వాసం'
తెలుగు కమ్ తమిళ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తమిళ్ సూపర్ స్టార్ అజిత్ హీరోగా 2019లో 100 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన 'విశ్వాసం' మూవీలో కూడా నయనతారనే హీరోయిన్. బాగా చదువుకున్న డబ్బున్న డాక్టర్ గా కనిపించే నయనతార ఒక విలేజ్ లో మెడికల్ క్యాంపు కోసం వెళ్లి ఆ ఊరు ప్రముఖుడు అజిత్ తో ప్రేమలో పడుతుంది. అతడ్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రత్యర్థులతో అతని వైలెంట్ నేచర్ నచ్చక విడిపోయి వచ్చేస్తుంది. క్రీడాకారిణి కావాలనుకునే తన కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్న నయనతార తన భర్త అజిత్ తో ఎలా తిరిగి కలిసింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి ఎవరేజ్ రివ్యూస్ వచ్చినా మూవీ మాత్రం కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 200 కోట్ల వరకూ బాక్సాఫీస్ వద్ద సాధించినట్టు రికార్డ్స్ ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో పేరుతోనే డబ్ చేయగా ఇక్కడ కూడా సినిమా మంచి హిట్ అయింది.
2026లో చిరంజీవితో 'మన శంకర్ వర ప్రసాద్ గారు'
ఈ ఏడాది (2026) సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ సినిమా 'మన శంకర్ వరప్రసాద్ గారు... పండక్కి వస్తున్నారు' రాజమౌళి తరువాత అపజయం ఎరుగని దర్శకుడి గా పేరుపడ్డ అనిల్ రావిపూడి తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా లోనూ నయన తారనే హీరోయిన్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ని చూసి ప్రేమలో పడి పెళ్ళిచేసుకునే బిజినెస్ ఉమెన్ శశిరేఖ పాత్రలో ఆమె కనిపిస్తుంది ఈ సినిమా లో. అపార్ధాలతో భర్త నుండి విడిపోయిన ఆమె తిరిగి పిల్లలతో సహా చిరంజీవి తో ఎలా కలిసింది అనేది మిగిలిన కథ. ఏకంగా 375కోట్లు సాధించిన ఈ మూవీ కమ్ బ్యాక్ తరువాత మెగాస్టార్ కి వచ్చిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా రికార్డ్స్ కి ఎక్కింది. అయితే సరిగ్గా గమనిస్తే చిన్న చిన్న తేడాలు తప్ప ఈ మూడు సినిమాలూ ఓకే కథతో రూపొందండం విశేషం అయితే ఈ మూడింటి లోనూ నయన తారనే హీరోయిన్ కావడం మరో విశేషం అంటారు ఆమె అభిమానులు.























