అన్వేషించండి

Kaliyugam Pattanamlo Movie: 'సింబా'లో రణవీర్ టీచర్... కలియుగ పట్టణంలో పోలీస్... సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్!

Director Ramakhanth Reddy Interview: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'కలియుగం పట్టణంలో' మార్చి 29న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ...

సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో పాటు తమ సినిమాలో మదర్ సెంటిమెంట్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. మార్చి 29న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. 

'కలియుగం పట్టణంలో' టైటిల్ గురించి దర్శకుడు మాట్లాడుతూ... ''కలియుగం అనేది ఊరి పేరు మాత్రమే కాదు... ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారు? ఏంటి? అనే కథ. ఓ పట్టణం నేపథ్యంగా తీసుకుని అక్కడ మనుషుల గురించి చూపించా. టైటిల్‌ డిజైన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆ మస్కిటో కాయిల్స్, రెంచ్ ఏంటి? అని! కథతో వాటికిలింక్ ఉంది. అందుకే పెట్టాను. కథలో అడవికి, ఔషధ మొక్కలకు కూడా లింక్ ఉంది. నంద్యాల దగ్గరలో అడవి ఉంది. అందుకని, ఆ నేపథ్యం తీసుకున్నా'' అని చెప్పారు. 

మెంటల్ హాస్పిటల్ నుంచి కథ మొదలు
సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో మదర్ సెంటిమెంట్, చక్కటి ప్రేమ కథ, యాక్షన్, యువతకు మంచి సందేశం ఉన్నాయని రమాకాంత్ రెడ్డి చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''హీరో మెంటల్ ఆస్పత్రిలో ఉన్నప్పట్నుంచి కథ మొదలు అవుతుంది. ఎందుకు? అనేది స్క్రీన్ మీద చూడాలి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కూడా చూపించాం. సమాజంలో చాలా మంది తండ్రులు 'మా అబ్బాయి ఇలా ఉండాలి, ఇలా చేయాలి' అంటూ సోషియో ఫోబియాతో ఉన్నారు. అబ్బాయి ఏం చేస్తే సమాజం ఏం అంటుందోనని ఆలోచిస్తారు. పిల్లల ఫీలింగ్స్ పట్టించుకోరు. దాన్ని కూడా ప్రస్తావించా'' అని చెప్పారు.  

బెంగళూరు బస్సులో కథకు పునాది
'కలియుగం పట్టణంలో' కథకు పునాది ఎక్కడ పడిందనేది రమాకాంత్ రెడ్డి చెబుతూ... ''నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక రోజు బెంగుళూరు నుంచి మా ఊరికి బస్సులో వస్తున్నా. నా పక్క సీటులో ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు. ఆవిడ సైకాలజీ బుక్ చదువుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇటువంటి పుస్తకాలు చదవకూడదని చెప్పా. 'మేం ఏం చేయాలో మాకు తెలుసు' అని పొగరుగా సమాధానం చెప్పింది. దాంతో నేను మాట్లాడలేదు. అప్పుడు ఈ కథ గురించి ఆలోచన వచ్చింది'' అని చెప్పారు. 

తాను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్ దగ్గర 'అరుంధతి' చిత్రీకరణ జరగ్గా కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేశానని, అప్పట్నుంచి సినిమాలపై ఆసక్తి పెరిగిందని రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఇంకా తన నేపథ్యం గురించి ఆయన చెబుతూ ''విశాఖలో చదువుకున్నా. అప్పుడే సినిమాల్లో తిరిగా. తర్వాత బెంగళూరులో ఉద్యోగం చేశా. మళ్లీ హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించా. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా చేసిన అనుభవం ఉంది. కరోనా సమయంలో పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా'' అని చెప్పారు. 

విశ్వ కార్తికేయ ధైర్యంగా ముందుకు వచ్చాడు
ఈ సినిమాలో హీరోగా ఇంతకు ముందు ఒకట్రెండు సినిమాలు చేసిన కొందర్ని అప్రోచ్ అయితే... క్యారెక్టర్ ఇంటెన్స్ చూసి చేయలేమని చెప్పారని రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''కొందరు చేయలేమని తప్పుకొంటే విశ్వ కార్తికేయ ప్రొఫైల్ నా దగ్గరకు వచ్చింది. కథ విని ధైర్యంగా చేస్తానని చెప్పాడు. అతనిలో కాన్ఫిడెన్స్ నచ్చింది. దాంతో సెలెక్ట్ చేశాం. ఇంతకు ముందు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. హీరోయిన్ ఆయుషీ పటేల్ తెలుగమ్మాయి. సినిమాలకు కొత్త. గ్లామర్ గాళ్ అని కాకుండా కీలక పాత్రలో కనిపిస్తుంది'' అని చెప్పారు.

Also Read: 'సాహో' హీరోయిన్ దొరికేసిందా? లేదంటే కావాలని అలా చేసిందా?

పోలీస్ పాత్రలో మరో హీరోయిన్ చిత్రా శుక్లా కనిపిస్తారని తెలిపారు. 'సిల్లీ ఫెలోస్'లో ఆమె పోలీస్ రోల్ చేశారు. బాలీవుడ్ హిట్ 'సింబా'లో హీరో రణవీర్ సింగ్ టీచర్ రోల్ చేశారు. ఇప్పుడు ఇందులో ఆమె పోలీస్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి. పలువురు ఇండస్ట్రీ పెద్దలు సినిమా చూసి బావుందని మెచ్చుకోవడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని రమాకాంత్ రెడ్డి చెప్పారు.   

అన్నపూర్ణ సంస్థ ద్వారా విడుదల!
థ్రిల్లర్ సినిమాల నేపథ్య సంగీతం ముఖ్యమని, అజయ్ అరసాడ కొత్త సంగీత దర్శకుడు అయినప్పటికీ మంచి మ్యూజిక్ ఇచ్చారని దర్శకుడు రమాకాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ''అజయ్ అరసాడ అడివి శేష్ 'గూడాచారి'కి కీ బోర్డు ప్లేయర్. 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్... మూడు సినిమాలకు వర్క్ చేశాడు. మా సినిమాకు మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడు'' అని చెప్పారు. 

దర్శకుడిగా తన తొలి సినిమాను ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు రమాకాంత్ రెడ్డి. రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ... ''మేము అన్నపూర్ణ సంస్థ వాళ్లను అప్రోచ్ అయ్యాం. తమకు కథ నచ్చిందని, చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తామని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్లకు థాంక్స్'' అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన మహేష్ తన కజిన్ అని, కథ నచ్చడంతో ఓబుల్ రెడ్డి, రమేష్ యాడ్ అయ్యారని చెప్పారు. ఈ సినిమాకు సీక్వెల్ 'కలియుగం నగరంలో' తీస్తున్నామని రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Readపసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget