VFX And AI Studio in Hyd: హాలీవుడ్లో వాడే టెక్నాలజీ హైదరాబాద్లోనే.. తక్కువ బడ్జెట్ సినిమాలకు ఇక పండగే
అమెరికాలో స్థిరపడి సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా పేరొందిన తెలుగు బిడ్డ.. హైదరాబాద్కు హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీని తీసుకురావడం అభినందనీయమని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు..

హాలీవుడ్లో వాడే టెక్నాలజీ హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటే.. అది స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలకు సైతం అందుబాటు ధరలో ఉంటే.. సినిమా వాళ్లకి ఇంతకంటే పండగ ఏముంటుంది? ఆ పండగనే టాలీవుడ్లో ఉన్న సినీ మేకర్స్కి ఇవ్వబోతున్నారు అమెరికా నుండి ఇండియాకు వచ్చిన డాక్టర్ మల్లీశ్వర్. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వీఎఫ్ఎక్స్కు ఉన్న ప్రాధాన్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు భారీ బడ్జెట్ సినిమాలకే ఈ టెక్నాలజీని వాడేవారు. కానీ ఇప్పుడు చిన్న, మీడియం బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ కూడా టెక్నాలజీని ఉపయోగిస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్ను ప్రారంభించింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్, దర్శకుడు శ్రీను వైట్ల ఈ నూతన బ్రాంచ్ను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
ఆవిష్కరణ మహోత్సవం అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. డాక్టర్ మల్లీశ్వర్ను అభినందించారు. తెలుగు బిడ్డ మల్లీశ్వర్ అమెరికాలో స్థిరపడి అక్కడ పారిశ్రామికవేత్తగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు ఇప్పించాలని నేను ఆహ్వానించగానే సిద్ధిపేటలో ఐటీ కంపెనీ పెట్టి ఎంతో మంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. అందుకు ఆయనని అభినందిస్తున్నాను. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్తో పోటీ పడుతూ దూసుకెళుతోంది. రాబోయే కాలంలో హాలీవుడ్తో మరింత పోటీని ఎదుర్కొవాలంటే.. ఇలాంటి విఎఫ్ఎక్స్, ఏఐ టెక్నాలజీ చాలా అవసరం. సినిమా క్వాలిటీని పెంచుతూ.. విజువల్గా అట్రాక్ట్ చేయాలంటే ఈ టెక్నాలజీ అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ వెంట పరుగులు పెడుతుంది. అమెరికా నుంచి ఇండియాకు వచ్చి, ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్న మల్లీశ్వర్ ప్రయత్నం విజయవంతం కావాలని, చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తనవంతు కృషి చేయాలని కోరుతున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆస్కార్ రేంజ్కి వెళ్లిన తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలాంటి టెక్నాలజీ రావడం అభినందనీయమని అన్నారు.
దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. మల్లీశ్వర్ మంచి ఆలోచనతో విఎఫ్ఎక్స్తో పాటు ఏఐ బ్రాంచ్ను ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. అంతేకాదు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. మరో దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విఎఫ్ఎక్స్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. టెక్నికల్గా మంచి వారిని గుర్తించడం సమస్యగా మారిన ఈ తరుణంలో మల్లీశ్వర్ ఈ కంపెనీ పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. సరైన క్వాలిటీతో అనుకున్న టైమ్కి అవుట్పుట్ ఇవ్వగలిగితే మాత్రం వారికి కాంపిటీషన్ అనేది ఉండదని చెబుతూ మల్లీశ్వర్ అండ్ టీమ్కు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. రఘు కుంచె మాట్లాడుతూ ‘కల్పర వీఎఫ్ఎక్స్ సంస్థ ద్వారా మల్లీశ్వర్ గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్వీసెస్ సీఈవో డాక్టర్ మల్లీశ్వర్ మాట్లాడుతూ.. యూఎస్లో నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఏఐ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ డెవలెప్ చేశాం. మంచి రిజల్ట్ చూశాం. ఈ టెక్నాలజీతో సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాలని అనుకున్నాం. ఈ మధ్యకాలంలో విఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇక్కడ బ్రాంచ్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించి, హాలీవుడ్లో వాడే టెక్నాలజీని ఇక్కడ కూడా పరిచయం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర దర్శకుడు రాజమౌళి, ‘కల్కి 2898 AD’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్లకు బాగా తెలుసు. తక్కువ బడ్జెట్ సినిమాలకు కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. టాలీవుడ్తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాను. నా ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన, చేస్తున్న అందరికీ ధన్యవాదాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్ రెడ్డి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన, సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ.. మల్లీశ్వర్కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
Also Read: డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

