Harish Shankar : పాపం హరీష్ శంకర్... ఉస్తాద్ భగత్ సింగ్ కోసమేమో అనుకున్నా... డైరెక్టర్ రియాక్షన్ వైరల్
Ustaad Bhagat Singh : పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్పై డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పాపం ప్రతాప్ ఈవెంట్లో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Director Harish Shankar Reaction About Ustaad Bhagat Singh Result : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రీసెంట్గా వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోయింది. అయితే, హరీష్ శంకర్ మాత్రం సోషల్ మీడియాలో విమర్శలను పట్టించుకోలేదు.
మూవీని అందరూ ప్రశంసిస్తున్నారంటూ రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆడియన్స్ నుంచి వస్తున్న నెగిటివ్ ఫీడ్ బ్యాక్ను కూడా ఆయన అంగీకరించడం లేదంటూ ట్రోలింగ్ సాగింది. తాజాగా, తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ ఈవెంట్కు హాజరైన హరీశ్ శంకర్... ఉస్తాద్ రిజల్ట్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సరదాగా కామెంట్ చేస్తూనే...
పాపం ప్రతాప్ టైటిల్ ప్రకారం... యాంకర్ స్రవంతి గెస్ట్ల పేరు ముందు పాపం అని యాడ్ చేసి స్టేజ్ మీదకు పిలిచారు. ఈ సందర్భంగా హరీష్ను సైతం అలాగే పిలిచారు. దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు. 'ఇక్కడకు రాగానే స్రవంతి గారు పాపం హరీష్ అని పిలిచారు. మొన్న సినిమా (ఉస్తాద్ భగత్ సింగ్) అనుకున్నంత ఆడలేదు కదా. అందుకే పాపం అన్నారేమో అనుకున్నా. తర్వాత వచ్చిన అందరికీ అనేశారు. అందుకే ఓకే మనది కాదులే అనుకున్నా. ప్రమోషన్లలో భాగం అని అర్థం చేసుకున్నా.' అంటూ కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఎట్టకేలకు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితాన్ని అంగీకరించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్ల కంటే కంటెంట్పై ఫోకస్ చేయాలంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
Also Read : చిరు, బాబీ మూవీ మెగా 158 లాంచ్కు బ్రేక్! - జన నాయగన్ ఎఫెక్ట్... నిర్మాతలు మారతారా?
ఉస్తాద్ విమర్శలకు కౌంటర్
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా వచ్చిన విమర్శలపై డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటరిచ్చారు. 'పవన్ కల్యాణ్ గారి స్వాగ్, డైలాగ్ డెలివరీ ఎలా చూపించాలని అనుకున్నానో అలాగే చూపించా. ఒకవేళ నా నుంచి ఎవరైనా అద్భుతమైన కళాఖండం ఎక్స్ పెక్ట్ చేసుంటే సారీ.' అంటూ కామెంట్ చేశారు. దీనిపై ఫ్యాన్స్ దగ్గర నుంచీ నెట్టింట ట్రోలింగ్ సాగింది. ఫైనల్గా పాపం ప్రతాప్ ఈవెంట్లో ఆయన కామెంట్స్తో నిజం ఒప్పుకొన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి.
'19 సినిమాలు క్యాన్సిల్'
తన కెరీర్లో చేసింది 9 సినిమాలైతే... క్యాన్సిలైంది 19 చిత్రాలని చెప్పారు హరీష్ శంకర్. 'పాపం ప్రతాప్ మూవీ దుర్గా నరేశ్ ఎంతో కష్టపడి తీశారు. గతంలో ఆయన చేయాలనుకున్న చాలా సినిమాలు క్యాన్సిల్ అయ్యాయని తెలిసింది. నరేశ్... మీకో విషయం చెబుతున్నా. నేను చేసింది కేవలం 9 సినిమాలైతే... క్యాన్సిలైంది 19 సినిమాలు.
ప్రెస్ మీట్స్ పెట్టి హీరోలు ఓకే చేసి, ఎల్లుండి ముహూర్తం అనగా ఈ రోజు కూడా క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడకు వచ్చింది పని చేయడానికి మాత్రమే. నచ్చిన పని చేస్తే మనం సక్సెస్ అయినట్లే. ఆడియన్స్కు నచ్చితే అది బోనస్ అవుతుంది' అని అన్నారు.
యంగ్ హీరో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన పాపం ప్రతాప్ మూవీకి దుర్గా నరేష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు






















