అన్వేషించండి

G20 Summit 2023: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు

విశాఖ జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ భాషలో ఉన్న ఫెక్సీలు కట్టడంపై నటి రేఖ భోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

విశాఖపట్నం వేదికగా ఈ నెల 28, 29 తేదీల్లో జీ 20 సదస్సు జరగనుంది. వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు విశాఖను అందంగా తీర్చిదిద్దారు. అయితే, సదస్సుకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు తెలుగులో కాకుండా తమిళ భాషలో ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమిళ బ్యానర్ల ఏర్పాటుపై నటి రేఖ తీవ్ర విమర్శలు

సినీ నటి రేఖ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “కనీసం ఇది తెలుగు రాష్ట్రమని, దీనికి తెలుగు అని ఒక భాష ఉందనే కూడా గుర్తింపు లేదు. తెలుగు భాషలో అచ్చు వేసి పంపాలన్న గౌరవం లేదు. మా జెనరేషన్ చచ్చినా కూడా ఇంకా మదరాసీలుగా ఉంటామేమో? జీ20 సదస్సుకి వైజాగ్ కి పంపిన తమిళ ఫ్లెక్సీలు ఇవి. అవి తమిళ భాషలో ఉన్నాయని చూసి కూడా అధికారులు వాటినే కట్టమన్నారు. ఇది చిన్న చూపో? నిర్లక్ష్యమో? అవహేళనో? అర్థం కాలేదు. వైజాగ్ బీచ్ రోడ్ పొడవునా అంతా ఇవే ఫ్లెక్స్ లు. మన ఆంధ్ర వాళ్ళ అంతటి రోషం, పౌరుషం, సిగ్గు, శరం లేని జాతి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మనల్ని పక్కవాడి కంటే ముందు మనవాడే కొడతాడు ఛా!” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకీ ఈ రేఖ భోజ్ ఎవరంటే?

రేఖ భోజ్, తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావాలంటూ చాలా కాలంగా పోరాటం చేస్తోంది. టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదని పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు అమ్మాయిలను కాదని, ఉత్తరాదితో పాటు తమిళ, మళయాళీ అమ్మాయిలను దిగుమతి చేసుకుంటున్నారని విమర్శలు చేసింది. మాధవీ లత, శ్రీరెడ్డి మాదిరిగానే ఈమె ఆందోళన కొనసాగించింది.  ఇక రేఖ భోజ్ ‘మాంగల్యం’, ‘స్వాతి చినుకు ‘సంధ్య వేళలో’, ‘రంగీలా’, ‘కలయా తస్మై నమా’ అనే చిత్రాల్లో నటించింది.

విశాఖలో 2 రోజుల పాటు జీ 20 సదస్సు

విశాఖలో ఈ నెల 28, 29   జీ 20 సదస్సు జరగనుంది. వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. దీనిలో 45 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. జీ20 దేశాల ప్రతినిధులు చాలా నగరాల్లో ఈ మీటింగ్స్ జరుపుతున్నారు. అందులో భాగంగా విశాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సదస్సు జరపనుంది. వైజాగ్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో రెండు రోజుల పాటు ఈ కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు.

100 కోట్లతో వైజాగ్ సుందరీకరణ

 జీ 20 సదస్సు నేపథ్యంలో జీవీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.  విశాఖ సుందరీకరణ కు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్నమార్గాన్ని అత్యంత అందంగా తయారు చేశారు .  ఎయిర్ పోర్టు నుంచి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను ముస్తాబు చేశారు. ఎటుచూసినా అతిథులకు ,ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు. సదస్సు జరిగే  28,29 తేదీలలో వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి .

Read Also: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget