Gayapadda Simham Release Date : గాయపడ్డ సింహం గర్జించే తేదీ ఫిక్స్ - రామ్ చరణ్ పెద్ది రిలీజ్ తర్వాత రోజే... కానీ చిన్న ట్విస్ట్
Gayapadda Simham : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

Director Tharun Bhascker's Gayapadda Simham Release Date : డైరెక్టర్, హీరో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'గాయపడ్డ సింహం'. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైజర్ హైప్ క్రియేట్ చేస్తుండగా... తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
'పెద్ది' రిలీజ్ తర్వాతి రోజే...
'గాయపడ్డ సింహం' వరల్డ్ వైడ్గా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గాయపడ్డ సింహం గర్జించే తేదీ ఫిక్స్ అయ్యింది' అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఆ తర్వాత రోజే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
View this post on Instagram
Also Read : 700 కోట్ల క్లబ్లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
కండిషన్స్ అప్లై..
'పెద్ది' ఏప్రిల్ 30న రిలీజ్ అయితే, 'గాయపడ్డ సింహం' రిలీజ్ డేట్ మార్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. తాజా ఈవెంట్లో ఆయన మాట్లాడారు. 'ఈ మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది. అందుకే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని ఇందులో భాగమయ్యా. మే 1న రిలీజ్ చేయాలని నిర్ణయించాం. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. ఏప్రిల్ 30న పెద్ది గ్రాండ్ రిలీజ్ ఉంది. అది విడుదలైతే ఈ మూవీ రిలీజ్ డేట్ మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అప్పుడు ఓ వారం వాయిదా వేసే ఛాన్స్ ఉంది.' అని చెప్పారు.
అమెరికా వెళ్లి మంచిగా సెటిల్ అవ్వాలనుకునే ఓ యువకుడికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. ఒక్క రోజులోనే ఆ యువకుడి జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది? ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది? సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలను ప్రతిబింబించేలా స్టోరీ రూపొందించినట్లు ట్రైజర్ను బట్టి తెలుస్తోంది. కామెడీ, మాస్ అంశాలను కలిపి మూవీని తెరకెక్కించారు.
ఓటీటీ డీల్ వల్లే...
ఓటీటీ డీల్ కారణంగానే మే 1న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు పవన్ సాధినేని తెలిపారు. 'పెద్ది రిలీజ్ అయినా మాకు సరిపడా థియేటర్స్ దొరికితే సేమ్ టైంకు రిలీజ్ చేసేస్తాం. పెద్ద సినిమాలతో పాటు చాలా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. ఒకవేళ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాం. మంచి ఓటీటీ డీల్ కుదిరింది. వారి కారణంగానే ఈ డేట్ ఫిక్స్ చేశాం.' అని చెప్పారు.
ఈ మూవీకి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా... తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటే హర్షవర్దన్, విష్ణు ఓయ్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పవన్ సాదినేని సమర్పణలో కల్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు.

























