అన్వేషించండి

‘విరూపాక్ష’ డైరెక్టర్ ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు: దర్శకుడు సుకుమార్

కార్తీక్ తన వద్దకు శిష్యుడిగా వచ్చినపుడు అతనికి ఓ ఆరోగ్య సమస్య ఉందని, కేవలం ఓ ఐదారు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారని దర్శకుడు సుకుమార్ అన్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిచింది. ఈ మూవీ తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బాగుండటంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవలే ‘విరూపాక్ష’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దర్శకడు కార్తీక్ దండు గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ.. ‘విరూపాక్ష’ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా కోసం టీమ్ చాలా కష్టపడిందని, కష్టానికి తగ్గట్టుగానే సినిమా చాలా బాగా వచ్చిందన్నారు సుకుమార్. కార్తీక్ తన వద్దకు శిష్యుడిగా వచ్చినపుడు అతనికి ఓ ఆరోగ్య సమస్య ఉందని అన్నారు. కేవలం ఓ ఐదారు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారని, కానీ తాను చనిపోయేలోపు ఎలాగైనా ఓ సినిమాకు దర్శకత్వం వహించి చనిపోవాలని కార్తీక్ అనేవాడని గుర్తుచేసుకున్నారు సుకుమార్. ఎప్పుడూ స్టెరాయిడ్స్ తీసుకొని బతికేవాడని, అవి ఇవ్వకపోతే అతని ప్లేట్ లెట్స్ పడిపోయి చనిపోతాడని అన్నారు. తనకున్న సమస్యను కూడా పట్టించుకోకుండా సినిమా కోసం కష్టపడేవాడని అన్నారు. అలాంటి కార్తీక్ ఇప్పుడు తన ఆరోగ్య సమస్యను అధిగమించి ఓ సినిమాకు దర్శకత్వం వహించడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్తీక్ ఆరోగ్య విషయంలో అతని తల్లి ఎంతో కష్టపడిందని, బహుశా ఆ తల్లి దీవెనలే కార్తీక్ ను మళ్లీ నిలబెట్టాయని అన్నారు. మొదట్లో కార్తీక్ తన వద్దకు ఓ కథతో వచ్చాడని, అయితే తనకు ఆ కథ నచ్చకపోవడంతో మరో కథ తయారు చేసుకొని రమ్మని చెప్పానని అన్నారు. అయితే కార్తీక్ కథ చాలా బాగా చెప్పాడని అనిపించిందని అన్నారు. కార్తీక్ కథ చెబుతుంటే ఎవరైనా అలా ఉండిపోతారని అన్నారు. అందుకే సినిమాను కూడా చాలా బాగా తీశాడని పేర్కొన్నారు సుకుమార్. ఈ సందర్భంగా కార్తీక్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సుకుమార్ శిష్యుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇటీవల ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు శ్రీకాంత్. ఇక ‘ఉప్పెన’ సినిమాతో సంచలన విజయం అందుకున్న బుచ్చిబాబు సనా కూడా సుకుమార్ శిష్యుడే. అలాగే ‘కుమారి 21ఎఫ్’, ‘18 పేజెస్’ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ శిష్యుడే. వీరంతా దర్శకులుగా మారి మంచి హిట్ లను అందుకున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి కార్తీక్ దండు కూడా రానున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21 న పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతోంది. మరి ఈ మూవీతో కార్తీక్ కు ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Ramachandra Yadav: కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
Embed widget