అన్వేషించండి

Dil Raju : సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో దిల్ రాజు సినిమా!

విజయ్ దళపతి హీరోగా 'వారిసు'తో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సినీ నిర్మాత దిల్ రాజు తాజాగా మరో తమిళ హీరోతో భారీ సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీ కాంత్ ను ఇటీవలే కలిశారని, ఆయన కూడా సైన్ చేశారని టాక్.

Dil Raju : వేణు టిల్లు దర్శకత్వంలో రూపొందిన 'బలగం' సినిమా విజయంతో ఆనందంలో ఉన్న సినీ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు తమిళ సినిమాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే విజయ్ దళపతి హీరోగా 'వారిసు' తమిళ వెర్షన్ తీసిన దిల్ రాజు.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

చిన్న సినిమానే అనుకున్నా.. ఎలాంటి హయ్యెస్ట్ ఎక్స్పెప్టేషన్స్ లేకపోయినా.. కేవలం రూ.16 లక్షలతో ప్రముఖ కమెడియన్ టిల్లు వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన 'బలగం' రీసెంట్ డేస్ లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా పోస్టర్, ట్రైలర్ రిలీజైన నాటి నుంచే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత రిలీజ్ చేసిన పాటలు మూవీపై పాజిటివ్ టాక్ వచ్చేందుకు కారణమయ్యాయి. అలా ముందు నుంచే మంచి రెస్పాన్స్ వస్తోన్న 'బలగం' సినిమా ఈ రోజు ఓ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. తెలంగాణలోని పల్లెలు, బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయత, ప్రేమ లాంటి మనిషికున్న అన్ని ఎమోషన్స్ ను అందరికీ అర్థమయ్యేలా వేణు చక్కగా తీయడంతో.. ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎంతో కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమాను ప్రతి పల్లెలోనూ ఉచితంగా గ్రామ పంచాయితీ సిబ్బందే ప్రదర్శనగా వేసి చూపిస్తుండడం గమనార్హం. 

అంత గొప్ప, మంచి సినిమా 'బలగం'ను నిర్మించిన దిల్ రాజుకు ఆయన కెరీర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. మొన్నటివరకూ ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ లు, పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న దిల్ రాజు.. ఇప్పుడు తాను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టారు. అందులోనూ తమిళ సినిమాలపై చూపు మళ్లినట్టు తెలుస్తోంది. 

ఇంతకుమునుపే తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దిల్ రాజు.. టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ తో 'వారిసు' తీశారు. ఈ మూవీ ఏకకాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా భారీ సక్సెస్ ను మూట గట్టుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం  వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించగా.. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించడంలో ఇప్పటికే దిట్ట అయిన దిల్ రాజు.. ఇప్పుడు మరో తమిళ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సూపర్ స్టార్, తలైవా రజనీ కాంత్ కు తగిన కథ ఒకటి సెట్‌ చేశారని, ఇందులో నటించడానికి రజనీకాంత్‌ కూడా అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఈ సినిమా కోసం దిల్ రాజు పెద్ద మొత్తంలోనే అడ్వాన్స్‌ను చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ రూమర్సే గనక నిజమైతే ఈ ప్రాజెక్ట్ కి ఎవరు దర్శకత్వం వహిస్తారోనని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ’జైలర్‌’లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘జై భీమ్‌’ ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు ఆయన పచ్చజెండా ఊపారు. ఇది రజనీ 170వ చిత్రం కావడం విశేషం. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకే రజనీ కాంత్, దిల్‌ రాజు బ్యానర్‌లో సినిమా మొదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో దిల్ రాజు చేస్తోన్న మరొక పెద్ద ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగా... స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం ఈ పొలిటికల్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహిస్తు్న్నారు.

Also Read : అనుపమలో ఇంత టాలెంట్ ఉందా? షార్ట్ ఫిల్మ్‌కు సినిమాటోగ్రఫీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GV Reddy Effect: జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GV Reddy Effect: జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
India In Semi Final: సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్.. బంగ్లా ప‌రాజ‌యంతో ఇరుజ ట్లు నాకౌట్ కు.. టోర్నీ నుంచి పాక్, బంగ్లా ఔట్
సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్.. బంగ్లా ప‌రాజ‌యంతో ఇరు జట్లు నాకౌట్ కు.. టోర్నీ నుంచి పాక్, బంగ్లా ఔట్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరిన్ని చిక్కులు - గన్నవరంలో చేసిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం
వల్లభనేని వంశీకి మరిన్ని చిక్కులు - గన్నవరంలో చేసిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం
Revanth Reddy Hot Comments: మెట్రో విస్తరణ, మూసి అభివృద్ధి అడ్డుకుంది కిషన్‌రెడ్డేనని కేంద్రమంత్రులే చెప్పారు: రేవంత్ సంచలన ఆరోపణలు
మెట్రో విస్తరణ, మూసి అభివృద్ధి అడ్డుకుంది కిషన్‌రెడ్డేనని కేంద్రమంత్రులే చెప్పారు: రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan: మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా - పార్టీ నేతలకు జగన్  భరోసా
మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా - పార్టీ నేతలకు జగన్ భరోసా
Embed widget