Dil Raju: 'ఆ నలుగురు' అంటూ వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు - పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ ఉందన్న దిల్ రాజు
Dil Raju Press Meet: సినీ ఇండస్ట్రీలో తాజా పరిణామాలు, ఎగ్జిబిటర్ల పర్సంటేజీ అంశాలపై నిర్మాత దిల్ రాజు తాజాగా స్పందించారు. పవన్ కల్యాణ్ కామెంట్స్పైనా ఆయన మాట్లాడారు.

Dil Raju About Theaters Band Issue: ఈస్ట్ గోదావరిలో ఓ వ్యక్తితో మొదలైన సమస్య తెలంగాణకు ఆపాదించి ఆ తర్వాత ఏపీ అలా తప్పుడు మెసేజ్ వెళ్లిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవల థియేటర్స్ బంద్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై ఆయన సోమవారం ప్రెస్ మీట్లో మాట్లాడారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదన్నారు.
అసలు సమస్య అక్కడే స్టార్ట్
పర్సంటేజ్ల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తూ.గో జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తమ దృష్టికి తెచ్చారని దిల్ రాజు తెలిపారు. 'ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ అండ్ పర్సంటేజ్ విధానం నడుస్తోంది. ఫస్ట్ వీక్ రెవెన్యూ బాగా వస్తే రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్స్ తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నాం. దీనిపై చర్చిస్తున్నాం. కానీ, ఓ కొలిక్కి రాలేదు. సరిగ్గా ఆ టైంలో 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ప్రకటించారు. కొన్ని కారణాలతో అది వాయిదా పడగా ఆ తర్వాత డేట్ వాళ్లు లాక్ చేయలేదు. పర్సంటేజ్ సమస్య ఈస్ట్ నుంచి మొదలై నైజాంకు వచ్చింది.' అని చెప్పారు.
'ఆ నలుగురు'.. ఇదిగో క్లారిటీ..
నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటే, ఎస్వీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్స్ 30 మాత్రమేనని దిల్ రాజు తెలిపారు. 'ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్స్ ఓనర్స్, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఇండస్ట్రీలో 'ఆ నలుగురు' అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోంది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. ' అని చెప్పారు.
పవన్ సినిమాలు ఆపే ధైర్యముందా?
ఇండస్ట్రీలో పవన్ సినిమాలు ఆపే ధైర్యం ఎవరికీ లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. 'మే 18న ఛాంబర్ మీటింగ్లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియా న్యూస్ ప్రచురించింది. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ చెబితే వద్దని వారించాను. ఛాంబర్కు వాళ్ల పర్సంటేజీల విషయంలో లేఖ రాశారు. వాళ్లు అనుకున్నది జరగకుంటే బంద్ చేస్తామనేది కేవలం ఆలోచన మాత్రమే. కొవిడ్ టైంలో తప్ప ఎప్పుడూ థియేటర్స్ బంద్ కాలేదు.
56 రోజులు మేం షూటింగ్స్ ఆపేసి నిర్మాతలుగా ఏమీ సాధించలేకపోయాం. నిర్మాతలందరం ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించాం. 'హరిహర వీరమల్లు' విషయంలో తప్పుగా మెసేజ్ వెళ్లింది. పవన్ కల్యాణ్ సినిమాలు ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మంత్రి దుర్గేష్ గారు నాకు ఫోన్ చేస్తే అది తప్పుడు సమాచారం అని చెప్పాను. జూన్లో పెద్ద సినిమాల రిలీజ్ ఉంది. ఆ టైంలో పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే మా ఆలోచన.' అని అన్నారు.
ఐక్యంగా ఉందాం
ఇండస్ట్రీలో టికెట్స్ ధరల పెంపు వంటి అంశాలపై అవసరం ఉంటే ఎవరికి వారే వెళ్లి కలుస్తున్నారని దిల్ రాజు అన్నారు. 'తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగా ఉన్నాయి. ఛాంబర్లోనే కొట్టుకుంటారు. ఐక్యత లేదు. సినిమా వాళ్లకు రెండు ప్రభుత్వాలు చాలా ముఖ్యం. కల్యాణ్ గారు చెప్పాక పక్కింటికి వెళ్లినంత సులభంగా వెళ్లి పేపర్ పట్టుకుని టికెట్ ధరలు పెంచుకుని వస్తున్నారు. అందరం కలిసి ఉండాలనే ఆలోచన మా దగ్గర తక్కువ. ఈ ఎపిసోడ్తో ఇప్పటికైనా తెర దించుదాం.' అని అన్నారు.
పవన్ కల్యాణ్ రిటర్న్ గిఫ్ట్ అంటూ అడిగిన ప్రశ్నకు దిల్ రాజు స్పందించారు. ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ పెద్ద అని ఆయన ఓ మాటంటే తీసుకోమా? అని దిల్ రాజు అన్నారు. ఓ సందర్భంలో తప్పుడు మెసేజ్ వెళ్లి పవన్కు కోపం వచ్చిందని అందువల్లే ఆయన అలా స్పందించారని ఆయన ఏమన్నా తీసుకుంటామని చెప్పారు.





















