అన్వేషించండి

Dil Raju: 'ఆ నలుగురు' అంటూ వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు - పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ ఉందన్న దిల్ రాజు

Dil Raju Press Meet: సినీ ఇండస్ట్రీలో తాజా పరిణామాలు, ఎగ్జిబిటర్ల పర్సంటేజీ అంశాలపై నిర్మాత దిల్ రాజు తాజాగా స్పందించారు. పవన్ కల్యాణ్ కామెంట్స్‌పైనా ఆయన మాట్లాడారు.

Dil Raju About Theaters Band Issue: ఈస్ట్ గోదావరిలో ఓ వ్యక్తితో మొదలైన సమస్య తెలంగాణకు ఆపాదించి ఆ తర్వాత ఏపీ అలా తప్పుడు మెసేజ్ వెళ్లిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవల థియేటర్స్ బంద్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై ఆయన సోమవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదన్నారు.

అసలు సమస్య అక్కడే స్టార్ట్

పర్సంటేజ్‌ల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తూ.గో జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తమ దృష్టికి తెచ్చారని దిల్ రాజు తెలిపారు. 'ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ అండ్ పర్సంటేజ్ విధానం నడుస్తోంది. ఫస్ట్ వీక్ రెవెన్యూ బాగా వస్తే రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్స్ తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నాం. దీనిపై చర్చిస్తున్నాం. కానీ, ఓ కొలిక్కి రాలేదు. సరిగ్గా ఆ టైంలో 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ప్రకటించారు. కొన్ని కారణాలతో అది వాయిదా పడగా ఆ తర్వాత డేట్ వాళ్లు లాక్ చేయలేదు. పర్సంటేజ్ సమస్య ఈస్ట్ నుంచి మొదలై నైజాంకు వచ్చింది.' అని చెప్పారు.

'ఆ నలుగురు'.. ఇదిగో క్లారిటీ..

నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటే, ఎస్వీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్స్ 30 మాత్రమేనని దిల్ రాజు తెలిపారు. 'ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్స్ ఓనర్స్, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఇండస్ట్రీలో 'ఆ నలుగురు' అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోంది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. ' అని చెప్పారు.

Also Read: ఇండస్ట్రీలో కొంతమంది అహంకారంతో వ్యవహరిస్తున్నారు - అల్లు అరవింద్ కామెంట్స్‌‌ స్వాగతించిన మంత్రి కందుల దుర్గేష్

పవన్ సినిమాలు ఆపే ధైర్యముందా?

ఇండస్ట్రీలో పవన్ సినిమాలు ఆపే ధైర్యం ఎవరికీ లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. 'మే 18న ఛాంబర్ మీటింగ్‌లో ఏం జరిగిందో తెలియకుండానే మీడియా న్యూస్ ప్రచురించింది. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ చెబితే వద్దని వారించాను. ఛాంబర్‌కు వాళ్ల పర్సంటేజీల విషయంలో లేఖ రాశారు. వాళ్లు అనుకున్నది జరగకుంటే బంద్ చేస్తామనేది కేవలం ఆలోచన మాత్రమే. కొవిడ్ టైంలో తప్ప ఎప్పుడూ థియేటర్స్ బంద్ కాలేదు.

56 రోజులు మేం షూటింగ్స్ ఆపేసి నిర్మాతలుగా ఏమీ సాధించలేకపోయాం. నిర్మాతలందరం ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించాం. 'హరిహర వీరమల్లు' విషయంలో తప్పుగా మెసేజ్ వెళ్లింది. పవన్ కల్యాణ్ సినిమాలు ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మంత్రి దుర్గేష్ గారు నాకు ఫోన్ చేస్తే అది తప్పుడు సమాచారం అని చెప్పాను. జూన్‌లో పెద్ద సినిమాల రిలీజ్ ఉంది. ఆ టైంలో పరిశ్రమను ఎలా కాపాడుకోవాలనేదే మా ఆలోచన.' అని అన్నారు.

ఐక్యంగా ఉందాం

ఇండస్ట్రీలో టికెట్స్ ధరల పెంపు వంటి అంశాలపై అవసరం ఉంటే ఎవరికి వారే వెళ్లి కలుస్తున్నారని దిల్ రాజు అన్నారు. 'తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగా ఉన్నాయి. ఛాంబర్‌లోనే కొట్టుకుంటారు. ఐక్యత లేదు. సినిమా వాళ్లకు రెండు ప్రభుత్వాలు చాలా ముఖ్యం. కల్యాణ్ గారు చెప్పాక పక్కింటికి వెళ్లినంత సులభంగా వెళ్లి పేపర్ పట్టుకుని టికెట్ ధరలు పెంచుకుని వస్తున్నారు. అందరం కలిసి ఉండాలనే ఆలోచన మా దగ్గర తక్కువ. ఈ ఎపిసోడ్‌తో ఇప్పటికైనా తెర దించుదాం.' అని అన్నారు.

పవన్ కల్యాణ్ రిటర్న్ గిఫ్ట్ అంటూ అడిగిన ప్రశ్నకు దిల్ రాజు స్పందించారు. ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ పెద్ద అని ఆయన ఓ మాటంటే తీసుకోమా? అని దిల్ రాజు అన్నారు. ఓ సందర్భంలో తప్పుడు మెసేజ్ వెళ్లి పవన్‌‌కు కోపం వచ్చిందని అందువల్లే ఆయన అలా స్పందించారని ఆయన ఏమన్నా తీసుకుంటామని చెప్పారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget