అన్వేషించండి

Kandula Durgesh: ఇండస్ట్రీలో కొంతమంది అహంకారంతో వ్యవహరిస్తున్నారు - అల్లు అరవింద్ కామెంట్స్‌‌ స్వాగతించిన మంత్రి కందుల దుర్గేష్

Theaters Bandh Issue: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది అహంకారంతో వ్యవహరిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సినీ పెద్దలు తమను కలవలేదని ఎప్పుడూ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు.

Kandula Durgesh About Allu Aravind Comments: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల పరిణామాలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' టైంలోనే థియేటర్స్ బంద్ వ్యవహారం తెరపైకి రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశించింది. పవన్ సినిమాను ఆపడం దుస్సాహసమే అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌పై తాజాగా ఏపీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. 

ఇండస్ట్రీలో కొందరు అహంకారంతో..

అల్లు అరవింద్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నామని.. ప్రస్తుతానికి బంద్ నిర్ణయం వెనక్కు తీసుకున్నందున ఈ సమస్య సమసిపోయినట్లేనని మంత్రి దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై కొంత కార్యాచరణ అవసరమని అన్నారు. 'కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలతో ఇండస్ట్రీకి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాం. టికెట్ రేట్ల పెంపు, షూటింగ్ అనుమతులు వెంటనే ఇస్తున్నాం. సినీ ప్రముఖులు కలవలేదని మేము ఎప్పుడూ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు.

ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు అహంకారంతో వ్యవహరిస్తున్నారు. మాకు ఎవరి సహకారం అవసరం లేదు మేమే చూసుకుంటాం అనే మాటలు అహంకార పూరితం అనిపిస్తోంది. ఎవరి ప్రోద్బలంతో ఆ మాట అన్నారో నాకు తెలీదు. సినీ పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో స్టార్ హీరోలను రప్పించి అవమానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.' అని మంత్రి చెప్పారు.

Also Read: అందరూ నిన్ను మోసం చేశారు.. నేను మాత్రం.. - ఇంట్రెస్టింగ్‌గా అడివి శేష్ 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్

ఆయనకు మానవత్వం ఉందా?

పవన్ కల్యాణ్ మూవీ ప్లాప్ అంటూ వైసీపీ మాజీ మంత్రి చేసిన కామెంట్స్‌పై మంత్రి కందుల ఫైరయ్యారు. 'గత ప్రభుత్వం సినిమా వాళ్లను ఎంత అవమానించిందో అందరికీ తెలుసు. 'సినిమా అనేది వ్యాపారమని.. వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు.' అని అంటున్నారు. అప్పుడు మీరు చేసిన నిర్వాకాలు అందరికీ తెలుసు. సినిమాకు సంబంధించి విషయాల్లో ప్రభుత్వ సహకారం ఏదో ఒక స్థాయిలో కచ్చితంగా ఉంటుంది.

ఓ పోరాట యోధుడి కథతో రూపొందిన సినిమా 'ఫ్లాప్ మూవీ' అంటున్నారు. ఆ వైసీపీ మాజీ మంత్రి కామెంట్స్ చూస్తుంటే అసలు ఆయనకు మానవత్వం ఉందా? అనిపిస్తుంది. సినిమా రిలీజ్ కాకముందే స్టేట్మెంట్ ఇచ్చారంటే.. ఆయన ఎంతమంది కుటుంబాలతో ఆడుకున్నాడో అర్థమవుతోంది. బాధ్యత కలిగిన మంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా?. ఇలాంటి వారే 'జంతు సమాన.. మూర్ఖత్వానికి నమూనా..' అని జంధ్యాల గారు ఎప్పుడో చెప్పారు. ప్రజలందరూ మీ చర్యలను గమనిస్తున్నారు.' అని కందుల అన్నారు.

ఇండస్ట్రీ అభివృద్ధికి పాలసీ

సినీ రంగానికి సహకరిస్తున్నప్పుడు వారు వచ్చి కలిస్తే సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. కలవడం, కలవకపోవడం వారి విజ్ఞతకే వదిలేశామని కందుల దుర్గేశ్ అన్నారు. 'ఇండస్ట్రీకి ఒక పాలసీ తీసుకొద్దామని అంటున్నాం. ఎగ్జిబిటర్లు, థియేటర్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఓ పాలసీ తీసుకొస్తామని చెబుతున్నాం. అలాగే మల్టీప్లెక్స్‌లో టికెట్, స్నాక్స్ ధరలపైనా విధి విధానాలు రూపొందించబోతున్నాం. దీనిపై విచారణకు ఆదేశించాం. నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటాం.' అని మంత్రి చెప్పారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget