అన్వేషించండి

Bunny Vas: థియేటర్స్‌లో రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీలోకి.. - టాప్ హీరోస్ ఆలోచించాలంటున్న నిర్మాత బన్నీ వాస్

Bunny Vas Reaction: ఇటీవల ఎగ్జిబిటర్లు, నిర్మాతల పర్సంటేజీ విధానంపై జరిగిన పరిణామాలపై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ తాజాగా స్పందించారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై దృష్టి సారించాలన్నారు.

Bunny Vas Reaction On Percentage Issue: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల పరిణామాలపై ప్రొడ్యూసర్ బన్నీ వాస్ తాజాగా స్పందించారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించేందుకు ఫోకస్ చేయాలని.. పర్సంటేజీల విధానంపై కాదంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఓటీటీల్లో మూవీస్ రిలీజ్ టైంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

'టాప్ హీరోస్ ఆలోచించాలి'

ఎగ్జిబిటర్లు, నిర్మాతలు గ్రహించాల్సింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజీ విధానం కాదని.. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు ఎలా రప్పించాలనే దానిపై దృష్టి సారించాలని బన్నీ వాస్ అన్నారు. 'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా, నాది పావలా అని కొట్టుకోవడం కాదు. ఇంతకు ముందులా మన బిజినెస్ ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచించాలి.' అని తెలిపారు.

ఓ మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయిన 28 రోజుల్లోపే (4 వారాలు) ఓటీటీలోకి వచ్చేస్తోందని.. ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం ఉందన్నారు బన్నీ వాస్. 'ఇదే విషయాన్ని టాప్ హీరోస్ కూడా ఆలోచించాలి. మీరు 2, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు దూరమైపోతారు. ఈ సమయంలో చాలామంది యజమానులు థియేటర్లు నడపలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడితే.. కేవలం మల్టీప్లెక్సుల వల్ల మీ సినిమాకు థియేటర్స్ నుంచి వచ్చే ఆదాయంలో కేవలం 43 శాతం మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది. ఈ విషయాన్ని టాప్ హీరోస్ గ్రహించాలి.' అంటూ పేర్కొన్నారు.

Also Read: 'స్పిరిట్' ఒక్కటే కాదు.. ప్రభాస్ 'కల్కి 2' నుంచి కూడా అవుట్? - కొంప ముంచుతున్న దీపికా డిమాండ్స్

ఇటీవల ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య పర్సంటేజీల విధానం ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదం వల్ల థియేటర్స్ బంద్ అనే అంశం తెరపైకి రాగా.. పవన్ మూవీ 'హరిహర వీరమల్లు' రిలీజ్ టైంలోనే ఇలా జరిగిందంటూ మరో చర్చ కూడా సాగింది. ఈ అంశంపై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ కూడా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదంటూ కామెంట్స్ చేశారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ మధ్య పర్సంటేజీల విధానం, ఇతర సమస్యలపై కూడా చర్చ సాగుతోందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ అంశాలపైనే బన్నీ వాస్ తాజాగా స్పందించారు.

ఓటీటీల అంశంపై.. 

సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీలోకి వస్తోంది. కొన్ని సినిమాలు నెల రోజుల్లోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ టైం పెంచడంపై టాప్ హీరోస్ దృష్టి సారించాలని బన్నీ వాస్ తాజాగా అన్నారు. ఇటీవల కమల్ హాసన్ కూడా ఇదే కామెంట్స్ చేశారు. ఆయన రీసెంట్ మూవీ 'థగ్ లైఫ్' కూడా థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా డిజిటల్ రైట్స్ డీల్ ఇచ్చారు. ఓటీటీలోకి ముందుగానే రావడంతోనే ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదని.. దీని వల్ల సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు బన్నీ వాస్.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget