అన్వేషించండి

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మంచి మనసు - స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్

Akshay Kumar Help: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్టంట్ వర్కర్స్‌కు అండగా నిలిచారు. దేశంలోని 650 మంది స్టంట్ వర్కర్లకు ఆరోగ్య, ప్రమాద బీమా వర్తించేలా ఇన్సూరెన్స్ చేయించారు.

Akshay Kumar Helped To Stunt Workers: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల షూటింగ్ సెట్‌లో ఊహించని ప్రమాదంలో స్టంట్ మ్యాన్ రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త విని చలించిపోయిన అక్షయ్... ఇండస్ట్రీలో 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ చేయించారు.

ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఆరోగ్యం, ప్రమాద బీమా రెండూ ఉన్నాయి. స్టంట్ మ్యాన్ సెట్‌లో కానీ బయట కానీ ఎక్కడైనా గాయపడితే రూ.5 లక్షల వరకూ బీమా పొందవచ్చు. దీంతో అక్షయ్‌పై స్టంట్ వర్కర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు ఆయన్ను అభినందిస్తున్నారు. అక్షయ్ చేసిన సహాయంపై బాలీవుడ్ ఫేమస్ స్టంట్ మాస్టర్ విక్రమ్ సింగ్ రియాక్ట్ అయ్యారు. 'మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు చేసిన ఈ సహాయం వల్ల బాలీవుడ్‌లో దాదాపు 650 నుంచి 700 మంది స్టంట్ మ్యాన్‌లు, యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు.' అంటూ థాంక్స్ చెప్పారు.

అసలేం జరిగిందంటే?

ఇటీవలే కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం జరిగింది. ఆర్య హీరోగా, డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న 'వేట్టువం' షూటింగ్ సెట్‌లో తాజాగా ఓ ప్రమాదం జరిగింది. నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా... స్టంట్ మ్యాన్ రాజు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన అత్యంత బాధాకరమని... రాజు మరణ వార్తతో తాను చలించిపోయినట్లు అక్షయ్ కుమార్ తెలిపారు.

సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ కోసం స్టంట్ కార్మికులు తమ ప్రాణాల పణంగా పెట్టాల్సి వస్తుందని అక్షయ్ అన్నారు. వారి శ్రమ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. 'ఒక్కోసారి షూటింగ్ టైంలో స్టంట్ చేసే వారికి ఊహించని ప్రమాదం జరిగితే వారి కుటుంబం రోడ్డున పడుతుంది. వారికి ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువ. ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు. వీరు వైద్య బీమాను భరించలేదు. దేశంలోని 650 మంది స్టంట్ వర్కర్ల ఆరోగ్య బీమాను చెల్లించాలని నిర్ణయించుకున్నా.' అని తెలిపారు. 

Also Read: 'కింగ్‌డమ్' మూవీ కోసం విజయ్ దేవరకొండ స్టంట్స్! - వైరల్ వీడియోపై ఫుల్ క్లారిటీ

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget