Priyanka Chopra : మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra Divorce : సోషల్ మీడియాలో డివోర్స్ రూమర్స్పై బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ఎనిమిదేళ్లుగా తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

Priyanka Chopra Emotional Comments On Divorce Rumours : గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తాను డివోర్స్ తీసుకోబోతున్నానంటూ సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. వీటికి గతంలోనే చెక్ పెట్టినా మరోసారి తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. సోషల్ మీడియాలో ఏదైనా ఫోటో షేర్ చేసినా... కొందరు అదే పనిగా ఏవేవో ఊహించుకుంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె భర్త గురించి మాట్లాడారు.
'విడిపోవాలని కోరుకుంటున్నారా?'
తన భర్త నిక్ జొనాస్తో జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకెళ్తున్నామని చెప్పారు ప్రియాంక చోప్రా. 'మేము బయట విషయాలను పెద్దగా పట్టించుకోం. డివోర్స్ తీసుకోబోతున్నామంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వచ్చినట్లు తెలిసింది. తమ వివాహ బంధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారా? ఎంతగా చెప్తున్నా తరచూ ఇలాంటి రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మేము వేర్వేరు దేశాలకు చెందిన వారం. వేర్వేరు మతాలు.
మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఇలా కొన్ని కారణాలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఎనిమిదేళ్లుగా మేము ఎంతో సంతోషంగా కలిసే ఉంటున్నాం. నిక్ జొనాస్ పరిచయం అయిన తర్వాత 6 నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. మా గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. నిక్ నాకు పరిచయం అయ్యాక సరైన జోడీ అనిపించి మరో అడుగు ముందుకేశాను.' అంటూ స్పష్టం చేశారు.
Also Read : పెద్ది షూటింగ్కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
'చాలా అలర్ట్గా ఉంటాం'
తన కుటుంబ భద్రత, తన కుమార్తె మాల్టి మేరీ ప్రైవసీ విషయంలో అత్యంత అలర్ట్గా ఉంటామని చెప్పారు ప్రియాంక చోప్రా. 'మా కుటుంబ భద్రత విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. నా కుమార్తె ఫోటోలు తీసి నెట్టింట వైరల్ చేయడం నాకు నచ్చదు. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకే సెక్యూరిటీని పెట్టుకున్నాం. మా అనుమతి లేకుండా మమ్మల్ని ఫోటోలు తీయకుండా వారు చూసుకుంటారు. నా కూతురి ప్రైవసీ కాపాడడం నా బాధ్యత. నాతో నేరుగా మాట్లాడే వారిని చాలా గౌరవిస్తా. నాతో ఎవరైనా ఫోటోలు దిగొచ్చు.' అని చెప్పారు.
తనకు నచ్చిన పని చేస్తూ కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేయడమే నిజమైన విజయం అని అన్నారు ప్రియాంక. బాలీవుడ్లో ఓ స్టార్గా ఎదిగిన తర్వాత 30 ఏళ్ల వయసులో అన్నింటినీ వదులుకుని హాలీవుడ్లోకి ఎంటర్ కావడం ఓ పెద్ద సాహసమని అన్నారు. అక్కడ స్టార్టింగ్లో కొన్ని స్టీరియో టైప్ రోల్స్ వచ్చినప్పటికీ... పట్టుదలతో శ్రమించి ఇప్పుడు తనకు నచ్చిన రోల్స్ ఎంచుకునే స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. కొత్త సవాళ్లను స్వీకరించడమే తనను ఈ స్టేజ్లో నిలబెట్టిందని వెల్లడించారు.
ప్రస్తుతం ప్రియాంక మహేశ్, రాజమౌళి కాంబో పాన్ వరల్డ్ అడ్వెంచరస్ వారణాసిలో మందాకిని పాత్రలో నటిస్తున్నారు. 2027, ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది.
























