Ranveer Singh : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
Ranveer Singh Reaction : కాంతార దేవతలను ఇమిటేట్ చేసిన వివాదంపై సారీ చెప్పేందుకు నటుడు రణవీర్ సింగ్ రెడీ అయ్యారు. చాముండి ఆలయాన్ని సందర్శించి ఆయన సారీ చెప్పనున్నారు.

Ranveer Singh Reaction About Comments On Kantar Deity Comments Issue : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ గతంలో 'కాంతార చాప్టర్ 1' మూవీ రిలీజ్ టైంలో ఆ దేవతను ఇమిటేట్ చేయడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ కాంట్రవర్సీలో ఆయన సారీ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
దీంతో చాముండి ఆలయాన్ని సందర్శించి... క్షమాపణ చెప్పాలని రణవీర్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. తాజా పరిణామాలతో రణవీర్ సింగ్ మైసూరులోని చాముండి దేవత ఆలయాన్ని సందర్శించి స్వయంగా క్షమాపణలు చెప్పనున్నారు.
అసలేం జరిగిందంటే?
- రోల్స్ ఇమిటేట్ - గతేడాది నవంబర్ 30న జరిగిన గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టైంలో కాంతార చాప్టర్ 1 మూవీ గురించి మాట్లాడిన రణవీర్... మూవీలో పంజుర్లి, గుళిగ దేవతలకు సంబంధించి రోల్స్ను ఇమిటేట్ చేశారు. దీనిపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగింది.
- సారీ చెప్పిన హీరో - తీవ్ర విమర్శలు రావడంతో హీరో రణవీర్ సింగ్ సారీ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ పోస్ట చేశారు. రిషబ్ చాలా పాత్రలు పోషించారని చెప్పడం కోసమే అలా చేసినట్లు వివరణ ఇచ్చారు.
- కోర్టులో పిటిషన్ - అయితే, రణవీర్ దైవాంశకు సంబంధించిన రోల్స్ను మిమిక్రీ చేశారని... సోషల్ మీడియాలో కాదని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ప్రశాంత్ మితల్ అనే లాయర్ బెంగుళూరు కోర్టులో డిసెంబరులో పిటిషన్ ఫైల్ చేశారు.
- కేసు నమోదు - దీనిపై విచారించిన న్యాయస్థానం రణవీర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
- ఊరట కల్పించాలని.. - ఆ వివాదంపై క్షమాపణలు చెప్పి, ప్రమాణ పత్రాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన నటుడు రణవీర్... తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ కోర్టుకు ఆశ్రయించారు.
- కోర్టు ఆదేశం - లెటర్ ద్వారా క్షమాపణలు కోరుతూ ప్రమాణ పత్రాన్ని ఇచ్చిన తర్వాత సంబంధిత దేవాలయానికి వెళ్లి పూజ చేసుకుంటానని రణవీర్ ఆయన తరఫు లాయర్ల ద్వారా కోర్టుకు తెలిపారు. ఆలయానికి వెళ్లి క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించింది.
- రణవీర్ సింగ్ త్వరలోనే ఆలయాన్ని సందర్శించి ఆయన తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా పడింది.
Also Read : మైథలాజికల్ ఎపిక్ నాగబంధం రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో వచ్చేది ఎప్పుడంటే?
ధురంధర్ 2 సక్సెస్ జోష్లో...
ప్రస్తుతం ధురంధర్ 2 మూవీ సక్సెస్ జోష్లో ఉన్నారు రణవీర్ సింగ్. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. అలాగే, పలు రికార్డులను చెరిపేసింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లాంగ్ రన్లో రూ.2 వేల కోట్ల మార్క్ టచ్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















