అన్వేషించండి

‘టైగర్ నాగేశ్వరరావు’కి మనసు ఇచ్చేసుకున్న మణి.. బ్యూటిఫుల్ మెలోడీతో ఆకట్టుకున్న జీవీ!

‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా నుంచి 'ఇచ్చేసుకుంటాలే' అంటూ సాగే మెలోడీ గీతాన్ని మేకర్స్ ఆవిష్కరించారు. రవితేజ, గాయత్రి భరద్వాజ్​లపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్​ను ఆకట్టుకుంటోంది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇందులో స్టూవర్ట్ పురం గజదొంగ పాత్రలో కనిపించబోతున్నారు రవితేజ. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్​గా నటించారు. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌ బస్టర్ సాంగ్స్​తో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్​గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 'ఇచ్చేసుకుంటాలే' అనే థర్డ్ సింగిల్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

'ఇచ్చేసుకుంటాలే.. నన్ను నీకు ఇచ్చేసుకుంటాలే... తెచ్చేసుకుంటాలే.. నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే... కొప్పులో మల్లె చెండులా నిన్ను ముడిచేసుకుంటాలే.. బువ్వలో ఉల్లిపాయలా నిన్ను కొరికేసుకుంటాలే..' అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇన్​స్టంట్ చార్ట్ బస్టర్​గా నిలిచింది. టైగర్ నాగేశ్వరరావుకి తనను తాను అంకితం చేసుకున్న యువతి మణి ప్రేమను ఈ రొమాంటిక్ అండ్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ద్వారా తెలియజేశారు. 

'ఇచ్చేసుకుంటాలే' పాటలో రవితేజ, గాయత్రి భరద్వాజ్ జంట అందంగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటోంది. చుట్టూ కొండలు, పచ్చని పొలాల మధ్య పల్లెటూరి వాతావరణాన్ని ఆవిష్కరించేలా చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్ గానూ చాలా బాగుంది. కొరియోగ్రాఫర్ పోనీ వర్మ సింపుల్ స్టెప్పులను కంపోజ్ చేయగా.. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ అంతే సింపుల్​గా డ్యాన్స్ చేసి అలరించింది. 

Also Read: ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో యాంగ్రీ మ్యాన్? సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్న సీనియర్ హీరో?

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఇప్పటికే విడుదలైన రెండు పాటలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడు 'ఇచ్చేసుకుంటాలే' సాంగ్ కోసం అందరినీ ఆకట్టుకునే క్లాసీ ట్యూన్​ని సమకూర్చారు. సింగర్ సింధూరి అద్భుతంగా ఆలపించింది. ఒక అబ్బాయిని పిచ్చిగా ప్రేమించే అమ్మాయి మదిలోని భావాలను వ్యక్తపరిచే సాహిత్యాన్ని అందించారు గీత రచయిత భాస్కర భట్ల. దీనికి మధి సినిమాటోగ్రఫీ నిర్వహించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేసారు.  

‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, జిషు సేన్‌ గుప్తా, మురళీ శర్మ, నాజర్, హరీష్ పేరడీ, సుదేవ్ నాయర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలోకి తీసుకురానున్నారు. 'భగవంత్ కేసరి' 'లియో' చిత్రాలకు పోటీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Also Read: చేతికి సెలైన్‌తో హాస్పిటల్ బెడ్ మీద సమంత - ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget