అన్వేషించండి

Anasuya Bharadwaj : 'మీరు అసూయ పడుతూనే ఉండండి' - అందరికీ ఇదే నా రిక్వెస్ట్... అనసూయ వరుస ట్వీట్స్

Anasuya Reaction : హీరోయిన్లపై కామెంట్స్ వివాదం హాట్ టాపిక్‌‌గా మారిన వేళ యాంకర్ అనసూయ వరుస ట్వీట్స్ చేశారు. శివాజీ కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆమె తాజాగా వరుస పోస్టులు పెట్టారు.

Anasuya Bharadwaj Tweets On Sivaji Comments : హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై నటుడు శివాజీ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన వేళ ఆయన క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అపాలజీ చెబుతూనే నటి, యాంకర్ అనసూయకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై ఆమె రియాక్ట్ అవుతూ వీడియో సైతం రిలీజ్ చేశారు. తాజాగా వరుసగా ట్వీట్స్ చేస్తుండగా వైరల్ అవుతున్నాయి.

'అందరికీ నా రిక్వెస్ట్'

కొంతమంది పురుషుపు, ఇంకా కొంతమంది మహిళలు కూడా నన్ను తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు అనసూయ. 'ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది అందరి గురించీ కాదు.

కానీ నేను పురుషులు.. మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విస్తృతంగా ఆలోచించండి. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటు పడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు.. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన సెలక్షన్స్ నుంచే వస్తుంది. మీడియా కూడా బాధ్యతతో వ్యవహరించాలి.' అని ట్వీట్ చేశారు.

'అసూయ పడుతూనే ఉండండి'

తాను ఎన్నో ఇబ్బందులు దాటుకుని వచ్చానని... ఓ విషయంలోనైనా బాధ పడకుండా బలంగా ముందుకు సాగుతానని అన్నారు అనసూయ. 'ప్రస్తుతం జరుగుతుంది పక్కన పెడితే నేను నా అభిప్రాయాన్ని ఏ విషయంలోనైనా బలంగా వినిపిస్తా. దేనికీ ప్రభావితం కాకుండా ధైర్యంగా నిలబడతాను. ఎన్నో ఏళ్ల నుంచి సమాజంలో నిర్లక్ష్యం చేసిన అంశాన్ని అర్థమయ్యేలా చెప్పి, దానిపై పోరాడాలనేదే నా ఉద్దేశం. ఏం జరిగినా నేను చెప్పింది చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. మీరు అసూయ పడుతూనే ఉండండి. మేము మరింత శక్తిమంతంగా మారతాం.' అని అన్నారు.

Also Read : ఓటీటీలోకి బిగ్గెస్ట్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్' - 2,400 కోట్ల కలెక్షన్స్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే'

ఈ రోజుకి ఇంకొకటి చెప్పాలంటూ లేటెస్ట్‌గా మరో ట్వీట్ చేశారు అనసూయ. 'ఉన్న ఇష్యూని అడ్రస్ చేయడం చేతకాక నన్ను కొందరు ఆంటీ అంటున్నారు. ఆయన్ను మాత్రం గారు అంటున్నారు. నాకు 40, ఆయనకు 54 అనుకుంటా. అయినా ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్ కోసం ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తున్నాం. ఈ కామెంట్ చేసే వారందరూ నిత్య యవ్వనులు. అది వేరే విషయం. ఇంక ఇంత కంటే ఏం చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే. హ్యాపీ క్రిస్మస్' అంటూ ట్వీట్ చేశారు.

'మీ రుణం తీర్చుకుంటా' అంటూ అనసూయపై శివాజీ సెటైరికల్ కామెంట్స్ చేయగా ఆమె స్పందించారు. మీలాంటి వాళ్ల సపోర్ట్ తనకు అవసరం లేదంటూ చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా వరుస ట్వీట్స్ చేశారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Advertisement

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget