By: ABP Desam | Updated at : 21 Apr 2022 09:55 AM (IST)
అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవగణ్ (Ajay Devgan) కలిసి ఓ యాడ్లో కనిపిస్తారు. గుర్తుందా? విమల్ ఇలాచీ (Vimal Elaichi Ad) ని ప్రమోట్ చేసే ఆ యాడ్ పాపులర్ కూడా! రీసెంట్గా షారుఖ్, అజయ్కి తోడుగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) కూడా యాడ్ అయ్యారు. ముగ్గురు స్టార్ హీరోలను చేసిన యాడ్ యూట్యూబ్లో విడుదల చేశారు. అక్షయ్ ఈ యాడ్ చేయడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దీనికి కారణం విమల్ ఇలాచీ బ్రాండ్ పొగాకు ఉత్పత్తులను కూడా అమ్ముతుంది. టొబాకోను ప్రమోట్ చేస్తారా? అంటూ అక్షయ్ మీద విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఆరోగ్య భారత్ కోసం ఆల్కహాల్, సిగరెట్ తదితర యాడ్స్ చేయమని చాలా ఆఫర్స్ వచ్చినా చేయలేదని గతంలో అక్షయ్ కుమార్ చెప్పారు. ఈ వీడియో బయటకు తీసుకొచ్చి ట్రెండ్ చేశారు. ప్రేక్షకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో విమల్ ఇలాచీ ప్రచార కర్త (బ్రాండ్ అంబాసిడర్)గా తాను తప్పుకొంటున్నట్టు అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతే కాదు... అభిమానులకు, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు సారీ చెప్పారు.
"నేను టొబాకోను ఆమోదించలేదు, ఆమోదించను కూడా! విమల్ ఇలాచీతో నేను అసోసియేట్ అవ్వడంపై మీ అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని నేను గౌరవిస్తాను. నేను చేసిన యాడ్ మీద వచ్చిన మీ రియాక్షన్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అందుకని, వినయపూర్వకంగా నేను వెనక్కి తగ్గుతున్నాను. ఆ యాడ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బును మంచి పనికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. చట్టప్రకారం... కాంట్రాక్ట్ ఉన్నన్ని రోజులూ ఆ సంస్థ యాడ్ టెలికాస్ట్ చేస్తుంది. భవిష్యత్తులో ఏదైనా ఎంపిక చేసుకునే ముందు జాగ్రత్తగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. ప్రతిఫలంగా మీ ప్రేమను ఆశిస్తున్నాను" అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
Also Read: డెలివరీ తర్వాత గ్లామరస్గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది - కాజల్ భావోద్వేగభరిత లేఖ
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Akshay Kumar (@akshaykumar)
Udaya Bhanu Re Entry : ఉదయ భాను రీ ఎంట్రీ - 'ఆగస్టు 6 రాత్రి' ఏం జరిగింది?
Prabhas - Tirumala Darshan : ఉదయమే ఏడు కొండల వేంకటేశ్వరుని దర్శించుకున్న ప్రభాస్
Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి
షారుక్తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్సీయూ!
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు