News
News
వీడియోలు ఆటలు
X

కూతురు ఆరాధ్య కోర్టు కేసుపై స్పందించిన ఐశ్వర్య రాయ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య ఆరోగ్యంపై పలు యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై ఇటీవల కోర్టుకు వెళ్లారు. 'పొన్నియిన్ సెల్వన్2' ప్రమోషన్స్ లో ఫేక్ న్యూస్ కేసుపై ఐశ్వర్య రాయ్ స్పందించింది.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ లెజెండరీ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌నువ‌రాలు, అభిషేక్-ఐశ్వర్య రాయ్ ల కుమార్తె ఆరాధ్య బ‌చ్చ‌న్‌ ఆరోగ్యంపై ఇటీవ‌ల యూట్యూబ్‌ లో ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేశారు. దీనిపై అభిషేక్ బ‌చ్చ‌న్ దంపతులు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించగా.. భ‌విష్య‌త్తులో ఇలాంటి తప్పుడు వార్త‌ల‌ను వ్యాప్తి చేయరాదని హెచ్చ‌రిస్తూ పలు యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకున్నారు. అయితే ఆరాధ్య ఫేక్ న్యూస్ కేసుపై తాజాగా ఆమె తల్లి ఐశ్వర్య రాయ్ బచ్చన్ స్పందించింది. వ్యక్తులను మానసికంగా, మనోభావాలను బాధించే అసంబద్ధమైన న్యూస్ కంటెంట్ గురించి మాట్లాడింది. 

ఐశ్వర్య రాయ్ బచ్చన్ 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఐశ్యర్య ఓ కార్యక్రమంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తప్పుడు కంటెంట్ రాయడం అనవసరమని, అది చాలా సున్నితమైనదని పేర్కొంది. మీడియా అలాంటి వార్తలను శాశ్వతంగా కొనసాగించదని తాను ఆశిస్తున్నానని చెప్పింది. 

మానసికంగా, సెంటిమెంటల్ గా బాధించే అసంబద్ధమైన ఫేక్ వార్తల గురించి ఐశ్యర్య బచ్చన్ మాట్లాడుతూ.. "మీడియాకు చెందిన వ్యక్తి ఆ వార్త వైరల్ అవుతోందని గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. మీరు దానిని శాశ్వతంగా కొనసాగించడం లేదని, మీరు దానిని ప్రోత్సహించడం లేదని భావిస్తున్నాను. తప్పుడు రాతలు లేదా అనవసరమైన రాతల ప్రతికూల ప్రభావాన్ని మీరు తెలివిగా గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు'' అని చెప్పుకొచ్చింది. 

కోర్టును ఆశ్రయించిన ఆరాధ్య బచ్చన్

కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ లో 11 ఏళ్ల ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌ లు కోర్టును ఆశ్ర‌యించారు. కేసు విచార‌ణ స‌మ‌యంలో ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తున్న న్యాయస్థానం నిల‌దీసింది. త‌ప్పుడు కంటెంట్‌ ను పోస్టు చేయ‌కుండా నిరోధించడానికి ఎలాంటి పాల‌సీలు లేవా అని కోర్టు ప్ర‌శ్నించింది. యూజ‌ర్ల‌కు ఓ ఫ్లాట్‌ ఫామ్ ఇచ్చేసి, వాళ్లు ఏది పోస్టు చేసినా త‌మ‌కు బాధ్య‌త లేద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో గూగుల్, యూట్యూబ్‌ కు స‌మ‌న్లు జారీ చేసింది. 

ప్ర‌తి చిన్నారికి గౌర‌వంగా, మ‌ర్యాద‌గా జీవించే హ‌క్కు ఉంద‌ని, ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సెలబ్రిటీల పిల్లలైనా, సాధారణ వ్యక్తి అయినా అందరూ ఒకటేనని జస్టిస్ సి హరిశంకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి పిల్లల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయడం సరికాదని హెచ్చరించారు. త‌క్ష‌ణ‌మే త‌మ ఫ్లాట్‌ ఫామ్ నుంచి ఆ వార్త‌ల‌ను తొల‌గించాల‌ని ఆదేశించిన కోర్టు.. ఆరాధ్య ఆరోగ్యం గురించి తప్పుడు కంటెంట్‌ ను పంచుకున్నందుకు తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధిస్తూ చర్యలు తీసుకుంది. 

Also Read : ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?

Published at : 26 Apr 2023 03:45 PM (IST) Tags: Abhishek Bachchan Aishwarya Rai Bachchan Aaradhya Bachchan PS 2 Aaradhya Bachchan Fake News

సంబంధిత కథనాలు

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి  ప్రత్యేక పార్కింగ్ స్థలాలు