అన్వేషించండి

Samantha: గుండె పగిలింది - జాహ్నవి మరణంపై స్పందించిన సమంత

తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పై తాజాగా హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

అమెరికాలో తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికాలోని సియాటిల్ నగరంలో ఈ ఘటన జరిగింది. పోలీసు వాహనం ఢీకొనడంతో జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతి చెందిన సమయంలో ఆ పోలీసు వాహనాన్ని కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది. ఆయన బాడీకామ్ ఫుటేజ్ ను పోలీసులు రిలీజ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పోలీసు నడుపుతున్న కారు వేగం గంటకు 119 కిలోమీటర్లు గా ఉంది. కారు ఢీకొన్న తర్వాత జాహ్నవి శరీరం దాదాపు 100 అడుగుల దూరంలో పడింది. క్రాస్ వాక్ వద్ద జాహ్నవి రోడ్డు దాటుతున్న సమయంలో అతి వేగంగా వచ్చిన పోలీస్ కారు ఆమెను ఢీకొట్టింది.

అయితే జీబ్రా క్రాసింగ్ వద్ద కాకుండా మరోచోట నుంచి జాహ్నవి రోడ్డు క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. జాహ్నవిని ఢీ కొట్టడానికి ఒక సెకను ముందు డ్రైవర్ బ్రేక్స్ వేసాడని, ఆ సమయంలో కారు 101 కిలోమీటర్ల వేగంతో ఉందని తాజాగా పోలీస్ రిపోర్ట్స్ లో పేర్కొన్నారు. జాహ్నవిని కారు బలంగా తాగడం వల్ల ఆమె శరీరం 100 అడుగుల దూరంలో పడినట్లు రిపోర్ట్ లో తెలిపారు. అయితే జాహ్నని ఢీకొన్న ప్రాంతంలో స్పీడ్ లిమిట్ మాత్రం గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. కానీ ఆ వాహనం గంటకు 119 కిలోమీటర్లు ఉంది. ఇదిలా ఉంటే తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల మృతి పై ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించి అమెరికా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా జాహ్నవి మృతి పై స్పందిస్తూ అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూఎస్ఏ లోని ఎస్పీడీ కి చెందిన పోలీసు అధికారి చర్యను పూర్తిగా ఖండిస్తూ.. 'అతని ప్రవర్తన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ఎన్నో ఆశయాలతో జీవితంలో ముందుకు సాగుతున్న యంగ్ స్టర్ జీవితం ఇలా చిన్న భిన్నం కావడం విషాదకరమని అన్నారు. అలాంటి ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం మరింత విషాదం,  దిగ్భ్రాంతికరమైన విషయమని' కేటీఆర్ ట్విట్టర్ వేదిక తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సైతం జాహ్నవి కందుల మృతి పై తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో సమంత జాహ్నవి కందుల యాక్సిడెంట్‌ తర్వాత పోలీస్ అధికారి నవ్వడం, అవమానకరంగా మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ జాహ్నవి మరణం, ఆ పోలీస్ అధికారి తీరుపై బాధను వ్యక్తం చేస్తూ "హార్ట్ బ్రేకింగ్"(Heart Breaking) అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఆదోని ఎంఐజి కాలనీకి చెందిన కందుల జాహ్నవి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2021 లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. ఈ ఏడాది జనవరి 23న కళాశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.

Also Read : చైతూను మిస్ అవుతోన్న సమంత? ఇన్‌స్టాలో మళ్లీ ప్రత్యక్షమైన పెళ్లి ఫొటోలు, ‘సామ్’థింగ్ ఫిషీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget