70MM Entertainments: రెండేళ్లలో ఆరు సినిమాలు... స్క్రిప్టులు లాక్ చేసిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్... పూజతో కొత్త అడుగు!
'భలే మంచి రోజు', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' వంటి హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఆరు కొత్త సినిమాలకు పూజ చేశారు.

ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలు ప్రొడ్యూస్ చేసిన సంస్థ 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్. సుధీర్ బాబు 'భలే మంచి రోజు', 'శ్రీదేవి సోడా సెంటర్', తాప్సీ పన్ను 'ఆనందో బ్రహ్మ', మమ్ముట్టి - జీవా 'యాత్ర' వంటి విజయవంతమైన చిత్రాలను 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఇప్పుడు తమ సంస్థలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
ఒకే రోజు ఆరు సినిమాలకు పూజ!
70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఆరు కొత్త సినిమాలకు స్క్రిప్టులు లాక్ చేశారు. తాజాగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి సినిమాలకు శ్రీకారం చుట్టారు. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు తమ సంస్థ నుంచి వచ్చిన సినిమాల తరహాలో ఆ సినిమాలు సైతం వేర్వేరు జానర్లలో ఉంటాయని పేర్కొన్నారు.
కొత్త సినిమాల గురించి నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ... ''మా సంస్థ నుంచి ప్రతి సినిమా మాంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది. మేమెప్పుడూ క్వాలిటీకి, కంటెంట్కి ప్రాధాన్యం ఇస్తాం. ఈ ఆరు సినిమాలు అదే ట్రడిషన్ కొనసాగిస్తాయి'' అని చెప్పారు.
Also Read: అమ్మకు అంకితం... తల్లి మీద సాయి దుర్గా తేజ్ ప్రేమ, గౌరవానికి ఫిల్మ్ ఫేర్ సలామ్
A Revolution for the Love of Cinema 🔥
— 70MM Entertainments (@70mmEntertains) August 10, 2025
70mm Entertainments is stepping into a new era locking 6 Path Breaking scripts to hit the big screens in the next 2 years ❤️🔥
Complete details rolling out soon ⏳@70mmEntertains @vijaychilla @devireddyshashi #70MMEntertainments pic.twitter.com/27iqW0kSV4
ఆరు సినిమాల్లో హీరోలు ఎవరంటే?
'భలే మంచి రోజు', 'శ్రీదేవి సోడా సెంటర్' తర్వాత నవ దళపతి సుధీర్ బాబుతో హ్యాట్రిక్ సినిమా చేసేందుకు 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు విజయ్ చిల్లా శశి దేవిరెడ్డి రెడీ అయ్యారు. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా మరో సినిమా చేయనున్నారు. గతంలో నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రెండు భాగాలుగా తీయాలనుకున్న 'పవర్ పేట' కథ సందీప్ కిషన్ దగ్గరకు వచ్చిందట.
మ్యాచో స్టార్ గోపీచంద్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, నాగశౌర్యలతోనూ సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయని తెలిసింది. ఆ ఆరు సినిమాల దర్శకుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?





















