అన్వేషించండి

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో గతవారం జరిగిన టాస్కులో శోభా, యావర్ గొడవపడ్డారు. ఆ గొడవలో తప్పు ఎవరిది అనే విషయంపై నాగార్జున క్లాస్ పీకారు.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ చేసే చిన్న చిన్న తప్పులు, వాళ్లు అనే చిన్న చిన్న మాటలే ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కోపంలో ఉన్నప్పుడు ఎవరు ఎంత బ్యాలెన్స్‌గా ఉన్నారు అనే విషయాన్ని ఆడియన్స్ ఎక్కువగా గమనిస్తారు. ఇక గతవారం జరిగిన ఫన్ టాస్కులలో దాదాపు అందరు కంటెస్టెంట్స్ తమ బ్యాలెన్స్ కోల్పోయారు. చిన్నగా మొదలయిన గొడవలన్నీ పెద్ద వాగ్వాదాలతోనే ముగిశాయి. అలాగే శోభా, యావర్‌ల మధ్య కూడా గొడవ జరిగింది. అంతే కాకుండా ఈవారం వారిద్దరి ప్రవర్తన కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అదే విషయం వారితో మాట్లాడడానికి వారిద్దరి సెపరేట్‌గా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు నాగార్జున.

కన్నీళ్లు పెట్టుకున్న శోభా..
ముందుగా శోభాను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఒక వీడియో చూపించారు నాగ్. అందులో ఈ శనివారం నాగ్ సార్‌తో అన్ని చెప్తాను లేకపోతే నా పేరు శోభా శెట్టినే కాదు అని శోభా చెప్పింది. అయితే నీ పేరు శోభానే.. చెప్పు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో అని నాగార్జున అడిగారు. శివాజీ.. తనను ముందు నుండే టార్గెట్ చేస్తున్నారని, ప్రతీ విషయంలో ఫేవరిజం అన్నట్టు మాట్లాడుతున్నారని చెప్పింది. అమర్‌దీప్, ప్రియాంక, శోభా.. ఇలా ముగ్గురు ఉన్నప్పుడు ఏదో ఒకటి కావాలని అంటున్నారని బయటపెట్టింది. అంతే కాకుండా అసలు ఎందుకిలా మాట్లాడుతున్నారని తను శివాజీతో క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసినా ఆయనే స్పందించలేదని కంప్లయింట్ చేసింది. శోభా సంచలకురాలిగా ఉన్నప్పుడు బాల్స్ గేమ్‌లో జరిగిన విషయాన్ని నాగార్జున గుర్తుచేశారు. ప్రియాంకకే సపోర్ట్ చేస్తూ తను అరవడం వల్లే శివాజీతో గొడవ మొదలయ్యిందని క్లారిటీ ఇచ్చారు.

అయితే తనకు తనకు ప్రియాంకకు సపోర్ట్ చేయాలనిపించే చేశానని శోభా సూటిగా చెప్పింది. అది తప్పే అని నాగార్జున ఖండించారు. ఆ తర్వాత యావర్ విషయంలో కూడా తను తప్పు చేసిందని మరొక వీడియో చూపించారు. ‘‘నీ వల్ల హౌజ్ వాతావరణమే మారిపోతుంది. నువ్వు అందరినీ కావాలని రెచ్చగొడుతున్నావు. నీ గేమ్ డిస్టర్బ్ చేసుకుంటున్నావు. అందరి గేమ్‌ను డిస్టర్బ్ చేస్తున్నావు’’ అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. దీంతో శోభా ఏడవడం మొదలుపెట్టింది. తాను హౌజ్ నుండి వెళ్లిపోతానేమో అన్న భయంతో ఒత్తిడి ఎక్కువయిపోతుందని బాధపడింది. శోభా బాధ చూసిన నాగార్జున స్ట్రాంగ్‌గా ఉండమని ధైర్యం చెప్పారు.

శోభాదే తప్పు అన్న యావర్..
శోభా తర్వాత యావర్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు నాగార్జున. బాల్స్ గేమ్‌లో శోభాతో ‘ఛీ, తూ’ అన్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే శోభా తనను ముందుగా రెచ్చగొట్టిందని అందుకే అలా అన్నానని తన ప్రవర్తనను సమర్థించుకున్నాడు యావర్. శోభా అలా అనొద్దు అంటున్న కూడా నువ్వు పదేపదే అంటూ ఉన్నావని గుర్తుచేశారు నాగార్జున. అయితే అబ్బాయిలయితే తాను సీరియస్‌గా హ్యాండిల్ చేసేవాడిని అని, అమ్మాయి కాబట్టి సున్నితంగా హ్యాండిల్ చేసినా.. శోభానే తనను రెచ్చగొట్టిందని యావర్ అన్నాడు. అంటే అబ్బాయిలను అయితే కొట్టేస్తావా అని నాగార్జున అడగగా.. తన ఉద్దేశం అది కాదని క్లారిటీ ఇచ్చాడు యావర్. తన ప్రవర్తన కరెక్ట్‌గా లేదు కాబట్టి వెళ్లి శోభాకు సారీ చెప్పమన్నారు నాగార్జున. శోభా రెచ్చగొట్టడం వల్లే తను అలా ప్రవర్తించానని, తనకు సారీ చెప్పడం ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ‘‘నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనిపిస్తేనే చెప్పు లేకపోతే నీ ఇష్టం’’ అన్నారు నాగార్జున. దీంతో కన్ఫెషన్ రూమ్‌ నుండి బయటికి వచ్చిన వెంటనే శోభా చేయి పట్టుకొని సారీ చెప్పాడు యావర్. శోభా కూడా తిరిగి సారీ చెప్పింది.

Also Read: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget