అన్వేషించండి

Poonam Pandey Death: పబ్లిసిటీ కోసం ప్రజల మనోభావాలతో ఆడుకుంది, పూనమ్‌పై పోలీస్ కేసు పెట్టాలి - సినీ వర్కర్స్ అసోసియేషన్

గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన పూనమ్ పాండేపై సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Cine Workers Association demands FIR against Poonam Pandey: ప్రముఖ మోడల్,బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి వ్యవహారం సీరియస్ అవుతోంది. మరణంతో పబ్లిసిటీకి ప్రయత్నించిందంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ తో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. సినీ అభిమానులు, ప్రజల మనోభాలతో ఆటలాడుకున్న పూనమ్ పై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సర్వేకల్ క్యాన్సర్ తో చనిపోయినట్లు పూనమ్ ప్రకటన

హీరోయిన్ పూనమ్ పాండే సర్వేకల్ క్యాన్సర్ కారణంగా మరణించినట్లు శుక్రవారం నాడు స్వయంగా ఆమె అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. 32 సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ తో పూనమ్ పాండే మరణించినట్లు తెలియడంతో అందరూ బాధపడ్డారు.  ఈ మృతి వార్తను ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సర్వేకల్ క్యాన్సర్ కారణంగా ఆమె చనిపోయినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో చాలామంది ఆందోళన చెందారు. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాళి అర్పించారు.

సర్వేకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం అలా చేశానన్న పూనమ్

ఆ తర్వాత రోజు తాను బతికే ఉన్నాను అంటూ పూనమ్ వీడియో రిలీజ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. సర్వేకల్ క్యాన్సర్ పై అందరికి అవగాహన కలిగించేందుకే తాను చనిపోయినట్లు పోస్ట్ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చింది. గర్భాశయ క్యాన్సర్ కారణంగా దేశంలో ఎంతో మంది స్త్రీలు  ప్రాణాలు కోల్పోతున్నారని.. అటువంటి వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని ఆలోచనతో తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు స్పష్టం చేశారు. అయితే, తన మరణ వార్తతో బాధపడిన ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు తెలిపింది.

పూనమ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ వర్కర్స్ అసోసియేషన్

పూనమ్ పాండే వ్యవహారంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. చీప్ పబ్లిసిటీ కోసం దేశ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుందని మండిపడింది. ఆమె మున్ముందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెతో పాటు ఆమె మేనేజర్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. “పూనమ్ పాండే సర్వేకల్ క్యాన్సర్ తో చనిపోయిందనే ఫేక్ న్యూస్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగించింది. ఇలాంటి చీప్ పబ్లిసిటీ దేశ ప్రజల మనోభావాలతో ఆడుకుంది. ఆమెతో పాటు ఆమె మేనేజర్ పైనా  చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను ఎవరూ సర్క్యులేట్ చేయకుండా ఉండాలంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ముంబై పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది. అయితే, ముంబై పోలీసులు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

Read Also: నెలకో సినిమా చొప్పున ఈ ఏడాది 15 సినిమాలు రిలీజ్ చేస్తాం: నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today March 24th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: శ్రీవల్లి నిజస్వరూపం వేదవతి భర్తతో చెప్పేస్తుందా! ధీరజ్ వెంట పడుతున్న ప్రేమ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: శ్రీవల్లి నిజస్వరూపం వేదవతి భర్తతో చెప్పేస్తుందా! ధీరజ్ వెంట పడుతున్న ప్రేమ!
Dhurandhar 2 Review : ధురంధర్‌లో మేజర్ ఇక్బాల్ - అది నా రివెంజ్... 26/11 భయానక అనుభవంపై నటుడు అర్జున్ రాంపాల్ రియాక్షన్
ధురంధర్‌లో మేజర్ ఇక్బాల్ - అది నా రివెంజ్... 26/11 భయానక అనుభవంపై నటుడు అర్జున్ రాంపాల్ రియాక్షన్
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Singer Mangli : మైక్రో ఫైనాన్స్... కోట్ల స్కామ్ ఆరోపణలు - ఆ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ స్ట్రాంగ్ రియాక్షన్
మైక్రో ఫైనాన్స్... కోట్ల స్కామ్ ఆరోపణలు - ఆ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Embed widget