అన్వేషించండి

Kantara Movie: ‘కాంతార’ సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతి

కన్నడ సినిమా ‘కాంతార’ సైలెంట్ గా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్బులో చేరబోతుంది. ఈ నేపథ్యంలో ఓ కన్నడ ప్రేక్షకుడు ‘కాంతార’ చూస్తూ థియేటర్ లోనే చనిపోయాడు.

న్నడ సినిమా 'కాంతార'(Kantara)కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఓ రేంజిలో వసూళ్లు రాబడుతోంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించి ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. కన్నడ నాట రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగుతో పాటు హిందీలోనూ మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొత్తంగా ఈ సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసే దిశగా దూసుకెళ్తోంది.

'KGF' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ 'కాంతార' చిత్రాన్ని నిర్మించారు. మరోసారి ఆయన పాన్ ఇండియా స్థాయిలో విజయం అందుకున్నారు. 'కాంతార' (Kantara Movie)లో కథానాయకుడిగా నటించిన రిషబ్ శెట్టి, సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన నటనకు, దర్శకత్వానికి తెలుగులో కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కర్నాటక కల్చర్ ను చక్కగా చూపించాడు రిషబ్. భూతకోలా సంప్రదాయం గురించి సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

త్వరలో ‘కాంతార’ సీక్వెల్!

'కాంతార' (Kantara) సాధించిన విజయంతో దీనికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేసే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సీక్వెల్ పై రిషబ్ శెట్టి స్పందించాడు కూడా. సీక్వెల్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని ఆయన వెల్లడించాడు. అయితే, తను మరో సినిమా చేయడానికి ముందు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నట్లు చెప్పాడు. కుటుంబంతో కలిసి ఈ సమాయాన్ని గడపనున్నట్లు వివరించాడు.  ఆయన మాటలు బట్టి చూస్తే తప్పకుండా ‘కాంతారా’ సీక్వెల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ‘కేజీఎఫ్’ బ్లాక్ బస్టర్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ నిర్మించాడు విజయ్ కిరగందూర్. ఇప్పుడు ‘కాంతారా’ మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి కూడా సీక్వెల్ తీస్తాడని సినీ పండితులు అంటున్నారు.

‘కాంతార’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

తాజాగా ‘కాంతారా’ సినిమా చూస్తూ ఓ కన్నడ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్నాటకకు చెందిన 45 ఏండ్ల రాజశేఖర్ అనే వ్యక్తి ఈ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాడు. సినిమా చూస్తూ, చూస్తూనే కుప్పకూలిపోయాడు. వెంటనే థియేటర్ యాజమాన్యం స్పందించి అతడిని హాస్పిటల్ కు తరలించింది. హాస్పిటల్ కు వెళ్లగానే పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. గుండెపోటు వల్లే రాజశేఖర్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కన్నడ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే, ఆ సినిమాకు అంత పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే, చనిపోయిన వ్యక్తి ఆ సన్నివేశాలను చూస్తూ చనిపోయాడా? లేదా ఇదివరకే అతడికి గుండె సమస్యలు ఉన్నాయా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Also read: కన్నింగ్ ఆటతో గెలుద్దామని ప్లానేసి ఓడిపోయిన గీతూ,వెక్కి వెక్కి ఏడుపు- చేపల టాస్కు అదిరిపోయింది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget