అన్వేషించండి

కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఆరు సీట్లు కాపులకేనా ? వైసీపీ వ్యూహాలేంటి ? 

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై వైసీపీ ఫోకస్ చేసింది. ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో  కాపులకు ప్రాధాన్యత ఇస్తోంది. 

YSRCP Focused On East Godavari : తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై వైసీపీ ఫోకస్ చేసింది. ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో  కాపులకు ప్రాధాన్యత ఇస్తోంది. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో...ఆరు సీట్లను కాపులకే కేటాయించేసింది. మిగిలిన సామాజిక వర్గాలు టికెట్ కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుతున్నా...కుదరదని ముఖం మీద చెప్పేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రమంతటా ప్రయోగాలు చేస్తున్న వైసీపీ...కాకినాడ పార్లమెంట్ పరిధిలో మాత్రం కాపులకే పెద్ద పీట వేయడం చర్చ నీయాంశంగా మారింది. 

ఏడులో ఆరు సీట్లు కాపులకే
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను బేరీజు వేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఎక్కడికక్కడ సీట్లు చించేస్తున్నారు. ఇప్పటి దాకా 72 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కమ్మ, కాపు, రెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చి బీసీలకు ప్రాధాన్యత కల్పించింది. కాకినాడ జిల్లాలో మాత్రం ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో ఒక్క కాకినాడ సిటీ మినహా మిగతా ఆరు చోట్ల కాపులకు అవకాశం ఇచ్చింది వైసీపీ. పెద్దాపురం నియోజకవర్గం సీటు మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగిరింది. ఇక్కడ టీడీపీ తరపున నిమ్మకాలయ చినరాజప్ప గెలుపొందారు. 

60శాతం కాపు ఓటర్లే
కాకినాడ పార్లమెంట్ సీటు పరిధిలో దాదాపు 60 శాతం కాపు ఓటర్లు ఉన్నారు. ఈ సారి కూడా అభ్యర్థుల్ని మాత్రమే మార్చింది తప్ప సామాజిక సమీకరణల్ని మార్చేందుకు ప్రయత్నించలేదు. కాకినాడ జిల్లాలో బీసీ నేతలు తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినా వైసీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదు. కాపు ఈక్వేషన్‌ను కదిలించకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం కంటే కాపులకే సీటు కేటాయిస్తే ఎలాంటి టెన్షన్ ఉండదని భావించింది. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత...ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు సీట్లను కాపులకే కేటాయించింది. కారణం ఏంటంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. కాకినాడ ఎంపీ సీటుతో పాటు రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన లెక్కలు వేసుకుంటోంది. 

వైసీపీ వైపు మొగ్గు చూపిన కాపులు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాపు ఓటర్లు తమవైపే మొగ్గుచూపారన్నది వైసీపీ లెక్క. ఈ ఎన్నికల్లో కాపు ఓట్లు రావాలంటే జిల్లాలో వేరే సామాజిక వర్గం జోలికి వెళ్ళకపోవడమే మంచిదని...జిల్లా నేతలు పార్టీ పెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. కాకినాడ జిల్లా పరిధిలో కాపులకు తప్ప ఇతరుల జోలికి వెళ్ళకూడదని వైసీపీ నిర్ణయించింది. మొదట్లో మరో సామాజికవర్గానికి అవకాశం ఇద్దామని భావించినా... సర్వే రిపోర్టుల ఆధారంగా కాపులకే ఇవ్వాలని డిసైడ్ అయింది వైసీపీ. అటు అమలాపురం లోక్‌సభ  పరిధి లో ఇద్దరు బీసీలకు ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ టిక్కెట్‌తో పాటు దాని పరిధిలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్‌ కూడా బీసీలకు ఇచ్చింది. దీంతో కాకినాడ పార్లమెట్ నియోజకవర్గంలో కాపు వ్యూహమే కరెక్ట్‌ అన్న నిర్ధారణకు వచ్చింది. పార్టీలతో సంబంధం లేకుండా... ఒక్కసారి తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో ఇక్కడ కాపులు గెలుస్తూ వస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కాపు అభ్యర్థులు ఉంటేనే లోక్‌సభ సీటు కూడా వర్కౌట్ అవుతుందన్న వైసీపీ లెక్కలు వేసుకుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Keralam CM VD Satheesan: కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
  VIjay Silence:మూడు రోజులుగా విజయ్ మౌనం.. ముఖ్యమంత్రిగానే మాట్లాడతాడా..?  ఈ సైలెన్స్‌కు అర్థమేంటి..?
మూడు రోజులుగా విజయ్ మౌనం.. ముఖ్యమంత్రిగానే మాట్లాడతాడా..?  ఈ సైలెన్స్‌కు అర్థమేంటి..?
TVK Vijay Masterstroke: విజయ్ మాస్టర్‌స్ట్రోక్.. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే యోచన..
విజయ్ మాస్టర్‌స్ట్రోక్.. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే యోచన..

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Shortage: ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
Bandi Bhagirath Case Latest News: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
Radhan Pandit: 101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
Google Pay UPI Circle: రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..
విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Embed widget