అన్వేషించండి

Maharashtra Elections 2024: ఏక్‌నాథ్ షిండే Vs దేవందర్‌ ఫడ్నవీస్‌- ముఖ్యమంత్రి పదవిపై ఎవరేమన్నారంటే?

Maharashtra Assembly Election 2024 మహారాష్ట్రలో ఓవైపు ఎన్నికల ఫలితాలు వస్తుండగానే మరోవైపు సీఎం పదవిపై చర్చ మొదలైంది. దేవందర్ ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్ షిండే కీలకవ్యాఖ్యలు చేశారు.

Maharashtra Assembly Election Result 2024: మహారాష్ట్రలో విజయం సాధించిన మహాయుతిలో సీఎం పదవిపై పితలాటకం మొదలైనట్టే కనిపిస్తోంది. కూటమిలో అనూహ్యాంగా భారీ విజయాన్ని బీజేపీ అందుకోవడంతో సీఎం పదవిపై ఆ పార్టీ ఫోకస్ చేసింది. అంతే కాకుండా షిండే నేతృత్వంలోనే శివసేన అనుకున్న మేజార్టి సాధించకపోవడం కూడా ఇక్కడ కీలకంగా మారింది. 

సీఎం పదవిపై దేవందర్ ఫడ్నవీస్‌కు కట్టబెట్టాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు గ్రహించిన ఏక్‌నాథ్ షిండే కీలకవ్యాఖ్యలు చేశారు. సీట్లకు సీఎం కుర్చీకి సమబంధం లేదని అన్నారు. మహాకూటమిలో ఎక్కువ సీట్లు వచ్చే పార్టీ నేతే ముఖ్యమంత్రి కావాలని మేం నిర్ణయించుకోలేదన్నారు షిండే . ముందుగా ఎన్నికల ఫలితాల తుది గణాంకాలను వచ్చాక చర్చిస్తాం. సీట్ల పంపకాల చర్చకు మూడు పార్టీలు కూర్చున్నట్లు కలిసి కూర్చుంటాం. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, మూడు పార్టీల సీనియర్‌ నేతలు ఒకే చోట కూర్చుని చర్చించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన విధంగానే ముఖ్యమంత్రి పదవిపై కూడా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. ముఖ్యమంత్రి పదవిపై తన వాదనను అంత తేలిగ్గా వదులుకోనని ఏకనాథ్ షిండే ప్రకటన సూచిస్తోంది. 

డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలుచ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించనట్టు వచ్చాయన్నారు. తామెవరూ ఊహించలేదన్నారు. అంచనాలకు మించినవిగా అభిప్రాయపడ్డారు. త్వరలోనే పార్టీ నేతలు కూర్చొని తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేస్తామన్నారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు ఫడ్నవీస్‌. మూడు పార్టీలు కలిసి సీఎంను నిర్ణయిస్తాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘తన బిడ్డ తప్పకుండా సీఎం అవుతాడని అన్నారు. ఇది చాలా పెద్ద రోజని అన్నారు. తను 24 గంటలు కష్టపడి పనిచేశాడని గుర్తు చేశారు. మరోవైపు పవార్‌ ఫ్యామిలీ కూడా అజిత్ పవార్ సీఎం రేసులో ఉంటారని ఆశాభావంతో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,  అజిత్ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడి విజయంపై అభినందనలు తెలిపారు.

మహాయుతి శాసనసభా పక్ష సమావేశం ఆదివారం జరగనుంది. నవంబర్ 25న బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్నిక జరగనుంది. నవంబర్ 26న ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బీజేపీ పరిశీలకుడు ఆదివారం ముంబైకి రానున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మెజారిటీ మార్కు దాటి దూసుకెళ్లింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 200పైగా స్థానాల్లో విజయం ఢంకా మోగించేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని MVA 58 స్థానాలకే పరిమితమైంది. ఇతరలు 13 స్థానాల్లో ఆధిక్యం కనబరిచారు. 

ముంబైలోని 36 సీట్లలో మహాయుతి 22 స్థానాల్లో, MVA 10, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్రలోని 58 సీట్లలో మహాయుతి 34 స్థానాల్లో, ఎంవీఏ 4, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తర మహారాష్ట్రలోని 47 స్థానాల్లో మహాయుతి 36 స్థానాల్లో, ఎంవీఏ 6, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

థానే కొంకణ్ ప్రాంతంలోని 39 స్థానాల్లో మహాయుతి 33 స్థానాల్లో, ఎంవీఏ 4 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరాఠ్వాడాలోని 46 స్థానాల్లో మహాయుతి 34 స్థానాల్లో, ఎంవీఏ 11 స్థానాల్లో, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. విదర్భలోని 62 స్థానాల్లో మహాయుతి 47 స్థానాల్లో, ఎంవీఏ 14 స్థానాల్లో, ఇతరులు 1 సీటులో ఆధిక్యంలో ఉన్నారు.

Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget