అన్వేషించండి

Maharashtra Elections 2024: ఏక్‌నాథ్ షిండే Vs దేవందర్‌ ఫడ్నవీస్‌- ముఖ్యమంత్రి పదవిపై ఎవరేమన్నారంటే?

Maharashtra Assembly Election 2024 మహారాష్ట్రలో ఓవైపు ఎన్నికల ఫలితాలు వస్తుండగానే మరోవైపు సీఎం పదవిపై చర్చ మొదలైంది. దేవందర్ ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్ షిండే కీలకవ్యాఖ్యలు చేశారు.

Maharashtra Assembly Election Result 2024: మహారాష్ట్రలో విజయం సాధించిన మహాయుతిలో సీఎం పదవిపై పితలాటకం మొదలైనట్టే కనిపిస్తోంది. కూటమిలో అనూహ్యాంగా భారీ విజయాన్ని బీజేపీ అందుకోవడంతో సీఎం పదవిపై ఆ పార్టీ ఫోకస్ చేసింది. అంతే కాకుండా షిండే నేతృత్వంలోనే శివసేన అనుకున్న మేజార్టి సాధించకపోవడం కూడా ఇక్కడ కీలకంగా మారింది. 

సీఎం పదవిపై దేవందర్ ఫడ్నవీస్‌కు కట్టబెట్టాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు గ్రహించిన ఏక్‌నాథ్ షిండే కీలకవ్యాఖ్యలు చేశారు. సీట్లకు సీఎం కుర్చీకి సమబంధం లేదని అన్నారు. మహాకూటమిలో ఎక్కువ సీట్లు వచ్చే పార్టీ నేతే ముఖ్యమంత్రి కావాలని మేం నిర్ణయించుకోలేదన్నారు షిండే . ముందుగా ఎన్నికల ఫలితాల తుది గణాంకాలను వచ్చాక చర్చిస్తాం. సీట్ల పంపకాల చర్చకు మూడు పార్టీలు కూర్చున్నట్లు కలిసి కూర్చుంటాం. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, మూడు పార్టీల సీనియర్‌ నేతలు ఒకే చోట కూర్చుని చర్చించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన విధంగానే ముఖ్యమంత్రి పదవిపై కూడా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. ముఖ్యమంత్రి పదవిపై తన వాదనను అంత తేలిగ్గా వదులుకోనని ఏకనాథ్ షిండే ప్రకటన సూచిస్తోంది. 

డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలుచ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించనట్టు వచ్చాయన్నారు. తామెవరూ ఊహించలేదన్నారు. అంచనాలకు మించినవిగా అభిప్రాయపడ్డారు. త్వరలోనే పార్టీ నేతలు కూర్చొని తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేస్తామన్నారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు ఫడ్నవీస్‌. మూడు పార్టీలు కలిసి సీఎంను నిర్ణయిస్తాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘తన బిడ్డ తప్పకుండా సీఎం అవుతాడని అన్నారు. ఇది చాలా పెద్ద రోజని అన్నారు. తను 24 గంటలు కష్టపడి పనిచేశాడని గుర్తు చేశారు. మరోవైపు పవార్‌ ఫ్యామిలీ కూడా అజిత్ పవార్ సీఎం రేసులో ఉంటారని ఆశాభావంతో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,  అజిత్ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడి విజయంపై అభినందనలు తెలిపారు.

మహాయుతి శాసనసభా పక్ష సమావేశం ఆదివారం జరగనుంది. నవంబర్ 25న బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్నిక జరగనుంది. నవంబర్ 26న ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బీజేపీ పరిశీలకుడు ఆదివారం ముంబైకి రానున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మెజారిటీ మార్కు దాటి దూసుకెళ్లింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 200పైగా స్థానాల్లో విజయం ఢంకా మోగించేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని MVA 58 స్థానాలకే పరిమితమైంది. ఇతరలు 13 స్థానాల్లో ఆధిక్యం కనబరిచారు. 

ముంబైలోని 36 సీట్లలో మహాయుతి 22 స్థానాల్లో, MVA 10, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్రలోని 58 సీట్లలో మహాయుతి 34 స్థానాల్లో, ఎంవీఏ 4, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తర మహారాష్ట్రలోని 47 స్థానాల్లో మహాయుతి 36 స్థానాల్లో, ఎంవీఏ 6, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

థానే కొంకణ్ ప్రాంతంలోని 39 స్థానాల్లో మహాయుతి 33 స్థానాల్లో, ఎంవీఏ 4 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరాఠ్వాడాలోని 46 స్థానాల్లో మహాయుతి 34 స్థానాల్లో, ఎంవీఏ 11 స్థానాల్లో, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. విదర్భలోని 62 స్థానాల్లో మహాయుతి 47 స్థానాల్లో, ఎంవీఏ 14 స్థానాల్లో, ఇతరులు 1 సీటులో ఆధిక్యంలో ఉన్నారు.

Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget