అన్వేషించండి

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Election Campaign in Telangana: సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారాలు చేయకూడదని అన్నారు. హైదరాబాద్ లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Vikas Raj On Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ (Vikas Raj) కీలక సూచనలు చేశారు. ఇక నుంచి సైలెంట్ టైం ఉంటుందని, ఎవరూ ప్రచార కార్యక్రమాలు (Political Advertisements) నిర్వహించకూడదని తెలిపారు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారాలు చేయకూడదని అన్నారు. హైదరాబాద్ లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేవలం అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో మాత్రమే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్కుల్లో ప్రచారం (Political Advertisements) పూర్తిగా నిషేధమని అన్నారు. ఓటరుకు ఇచ్చే స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదని.. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధం ఉంటాయని ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారని వివరించారు.

‘‘రానున్న 48 గంటలు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. ఎలాంటి ఒపీనియన్ పోల్స్ ఇవ్వకూడదు. పోలింగ్ బూత్ ల వద్ద ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. రేపు ఉదయం పోలింగ్ సిబ్బందికి అలెర్ట్ చేస్తున్నాం.. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. మనీ, లిక్కర్ పంపిణీ జరగకుండా సీసీటీవీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నాం. మాక్ పోలింగ్ కోసం 90 నిమిషాల ముందు ఎజెంట్స్ పోలింగ్ స్టేషన్స్ కి రావాలి. 27,178 మంది ఇంటి దగ్గర నుండే ఓటు వేశారు. 1.48 లక్షల మంది ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చాం. పోలింగ్ స్టేషన్ లోపల 27,094 వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. 

పోలింగ్ స్టేషన్ 7,500 వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. 35,655 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ స్టేషన్ కు అదే విధంగా రిటర్న్ లో ఎక్కడా ఆగకుండా సూచించిన దారిలోనే సిబ్బంది రావాలి. ఓటు వేయడానికి వెళ్లే వారు ఏదైనా కచ్చితంగా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్ళాలి. ఇప్పటిదాకా రూ.770 కోట్లు నగదు సీజ్ చేశాం’’ అని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు.

ఈవీఎంల తరలింపునకు రూట్ మ్యాప్

‘‘పోలింగ్ సిబ్బంది ఉదయం 5.30 నిమిషాలకు వాళ్ల వాళ్ల కేంద్రాల దగ్గర ఉండాలి. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్ లు ముట్టుకోవద్దు. హోం ఓటింగ్ 27,178 మంది ఓటు వేస్తే దాంట్లో 15,990 మంది సీనియర్ సిటిజన్ ఉన్నారు. 1.48 లక్షల మంది బ్యాలెట్ ఓట్లు వేశారు. ఆ ఓటింగ్ ఇవ్వాళ కూడా జరుగుతుంది.

35 వేల పోలింగ్ కేంద్రాలు, 3300 సెక్టార్ లో ఏర్పాటు చేశాం, ప్రతి సెక్టార్ కు ఒక ఇంచార్జి ఉన్నారు. EVM ల తరలింపు కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ తయారు చేశాం. ఎక్కడా ఆగకుండా వెళ్ళాలి. ఓటర్ 12 గుర్తింపు కార్డులలో ఎదైనా చూపించి ఓటు వేయొచ్చు. పోలింగ్ కేంద్రాల వద్దకు మొబైల్ ఫోన్ అనుమతి లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూమెంట్, వెహికిల్ ను మానిటరింగ్ చేయాలని డీఈవోలకు ఆదేశాలు ఇచ్చాం. 2018లో పోస్టల్ బ్యాలెట్ 1 లక్ష మంది వేస్తే, ఈసారి 1.5 లక్షలు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం’’ అని వికాస్ రాజ్ తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
Embed widget