అన్వేషించండి

KCR Election Campaign: హైదరాబాద్‌ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్‌ మీటింగ్

KCR Campaign In All Constituencies: సీఎం కేసీఆర్‌ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.

CM KCR Election Campaign: తెలంగాణలో హ్యాట్రిక్‌ కొట్టాలన్నది బీఆర్‌ఎస్‌ లక్ష్యం. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌.. ప్రజా వ్యతిరేకతను కూడా పాజిటివ్‌గా  మార్చుకునేందుకు చివరి వరకు ప్రయత్నిస్తోంది. హ్యాట్రిక్‌ కొట్టి... రికార్డ్‌ సృష్టించాలని విశ్వప్రయత్నం చేస్తోంది. బీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకున్న సీఎం  కేసీఆర్‌... ముమ్మరంగా ప్రచారం చేశారు. అక్టోబర్‌ 15 నుంచి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. ముందు రోజుకు రెండు, మూడు నిర్వహించిన సీఎం కేసీఆర్‌... ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి ప్రచారాన్ని మరింత విస్తృతం చేశారు. రోజుకు నాలుగు సభల్లో పాల్గొన్నారు.

అక్టోబర్ 15 నుంచి మొదలు

అక్టోబర్ 15న ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి... అదే రోజు హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత  రోజుకు రెండు, మూడు, నాలుగు చొప్పున సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏడు నియోజకవర్గాలు  మినహాయించి రాష్ట్రాన్ని మొత్తం చుట్టేశారు. నిన్నటి వరకు 94 సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌... ఇవాళ రెండు సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ కేసీఆర్‌ సొంత నియోజకవర్గం  అయిన గజ్వేల్‌లో సభతో కేసీఆర్‌ ప్రచారం ముగుస్తవుంది.

కేసీఆర్‌ పంచ్‌లు

సీఎం కేసీఆర్‌... తన సభల్లో ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ముఖ్యంగా కరెంట్‌, రైతుబంధు, ధరణిని ప్రధాన ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌  వస్తే... 24గంటల కరెంట్‌ ఉండదని ప్రచారం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డే ఆ విషయం చెప్పారని... 24గంటల కరెంట్‌ అవసరం లేదు.. మూడు గంటల ఇస్తే  సరిపోతుందని చెప్పారని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. అలాగే మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు దండగ అన్న విషయాన్ని కూడా ప్రచారం చేశారు.  ఇక... అతి ముఖ్యమైనది ధరణి... కాంగ్రెస్‌ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారని... అదే జరిగితే.. మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందన్నారు కేసీఆర్‌.  24గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, ధరణిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తే... తాను కూడా ఏమీ చేయలేనని చెప్పారు కేసీఆర్‌. ఓటు వేసే ముందు ప్రజలు  ఆలోచించుకోవాలన్నారు.

తేడా గమనించాలన్న కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్న కాంగ్రెస్‌ ప్రచారానికి కూడా కౌంటర్‌ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే ఉన్నాయని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమే  సుభిక్షంగా ఉండి ఉంటే... ఎన్టీఆర్‌ రెండు రూపాయలకు బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేదని పదేపదే ప్రశ్నించారు. ఏం చేశారని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని  ప్రశ్నించారు. అలాగే.. కాంగ్రెస్‌ వస్తే కుర్చీల కొట్లాట తప్ప ఇంకేమీ ఉండదని కూడా చెప్పారు సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్‌లో 12 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని... పదవి కోసం  కొట్టుకునే వారే తప్ప.. ప్రజల కోసం పనిచేసే వారు ఆ పార్టీలో లేరన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారెంటీలు అమలు కావడం లేదని... తెలంగాణలో కాంగ్రెస్‌ వచ్చినా  అలాగే ఉంటుందని చెప్పారు. అంతేకాదు... కాంగ్రెస్ వస్తే ఏది చేయాలన్న ఢిల్లీ బాసుల అనుమతి తీసుకోవాల్సి వస్తుందని.. కానీ, బీఆర్‌ఎస్‌ ఢిల్లీ బాసులు లేరని కూడా  ప్రజలు స్పష్టంగా వివరించారు. 50ఏళ్ల కాంగ్రెస్‌ పాలన.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు తేడా చూసి ఓటు వేయాలని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్‌. 

తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌... తెలంగాణ ఇవ్వలేదని.. ఇచ్చేలా తాము పోరాడామని అన్నారు సీఎం కేసీఆర్‌. 2004లోనే తెలంగాణ ఉచ్చుంటే.. వందలాది  మంది బలిదానాలు చేసుకునేవారు కాదన్నారు. కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టిన తర్వాత.. తెలంగాణ ఇవ్వక తప్పని సరి పరిస్థితి ఏర్పడిందని...  అందుకే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. 

ఈ ఎన్నికల్లో మూడోసారి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటామన్నారు. పెన్షన్‌ను దశల వారీగా 5వేలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌. అలాగే  గ్యాస్‌ సిలిండర్‌ను 400 రూపాయలకే ఇస్తామన్నారు. అలాగే.. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. రైతుబంధును 16వేలకు పెంచుతామన్నారు.  వీటితోపాటు మరిన్ని హామీలను కూడా ప్రకటించారు సీఎం కేసీఆర్‌. తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాల్సి అవసరం ఉందని... ఇప్పుడు రాష్ట్రం  కాంగ్రెస్‌ చేతుల్లోకి వెళ్తే అది అసాధ్యమని అన్నారు. అందుకే... మూడోసారి కూడా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజా ఆశీర్వాద సభల్లో.. ఓటర్లకు విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్‌.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Ramachandra Yadav: కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
Valentines Day Spots: ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటున్నారా ? అద్భుతమైన ప్రదేశాలు ఇవే
ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటున్నారా ? అద్భుతమైన ప్రదేశాలు ఇవే
Pushpa 2: 'పుష్ప 2', 'దంగల్' కలెక్షన్లను దాటేసి థియేటర్లలో దుమ్మురేపుతున్న మూవీ... 9 రోజుల్లో 700 కోట్ల సామి
'పుష్ప 2', 'దంగల్' కలెక్షన్లను దాటేసి థియేటర్లలో దుమ్మురేపుతున్న మూవీ... 9 రోజుల్లో 700 కోట్ల సామి
Kiran Royal: కిరణ్‌ రాయల్‌పై ఆరోపణలపై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్, అప్పటివరకూ పార్టీ కార్యక్రమాలకు దూరం
కిరణ్‌ రాయల్‌పై ఆరోపణలపై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్, అప్పటివరకూ పార్టీ కార్యక్రమాలకు దూరం
Embed widget