అన్వేషించండి

తెలంగాణ ఎన్నికల వేళ కర్ణాటక సమస్యలపై ప్రచారం- బీఆర్‌ఎస్‌ న్యూ స్ట్రేటజీ

గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లు విరామం లేకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా, ఏ మండలానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తులు వేస్తోంది. నోటిఫికేషన్ విడుదల కాకముందే దూకుడుగా వ్యవహరిస్తున్న గులాబీ పార్టీ...నోటిఫికేషన్ వచ్చాక జెట్ స్పీడ్ తో ప్రచారం చేసేందుకు రెడీ అవుతోంది. గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ విరామం లేకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా, ఏ మండలానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ స్ట్రాటజీ మార్చేసింది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కీలక నేతలంతా హస్తం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఇతరం నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. 

తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక రైతుల ఆందోళన
కర్ణాటక తరహాలోనూ తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ఇచ్చింది. తుక్కుగూడలో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఆరు హామీలను ప్రకటించారు. ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. దేశంలో ఎక్కడ 24 గంటల ఇవ్వడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24గంటల కరెంటును రైతులుకు ఇస్తున్నామని పదే పదే ప్రకటిస్తున్నారు. బహిరంగ సభలు, ప్రెస్ మీట్లలోనూ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు.  కరెంట్ రైతులకు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పి...మాట తప్పారని విమర్శిస్తున్నారు. ఆఖరికి రైతులంతా కలిసి కరెంట్ కోసం రోడ్లెక్కిఆందోళనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు సబ్ స్టేషన్ల దగ్గరకు వచ్చి మొసళ్లు వదులుతున్నారని ప్రజలకు చెబుతున్నారు. కర్ణాటకలోనే హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఎలా అమలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతల విమర్శలతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోనూ కొందరు రైతులు, హస్తం పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లయింది. 

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది  ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget