అన్వేషించండి

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

మునుగోడు ఉపఎన్నికల్లో ఎలా గెలవాలన్న అంశంపై టీ కాంగ్రెస్ నేతలు మేథోమథనం చేస్తున్నారు. అభ్యర్థి ఎంపికపై రకరకాల అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వినిపిస్తున్నారు .

Munugode Congress :   మునుగోడు ఉపఎన్నిక వ్యూహంపై ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ హైదరాబాద్ వచ్చి సమావేశాలు ప్రాంభించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బోసు రాజు ఇతర తెలంగాణ నేతలతో విస్తృత మంతనాలు జరుపుతున్నారు. అభ్యర్థి సలహా పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి మునుగోడు విషయంలో క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అక్కడ అజాదీ కా అమృత్ గౌరవ్ అనే కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. పదహారో తేదీ నుంచి ఈ పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ పరిధిలో బహిరంగసభ నిర్వహించారు. 

టీఆర్ఎస్, బీజేపీ కుట్రల వల్లే మునుగోడు ఉప ఎన్నిక

టీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కుని ఉపఎన్నిక తీసుకు వచ్చాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రెండు పార్టీలూ ఒక్కటేనన్నారు. ఎలాంటి ఒప్పందం లేకుండా రాజగోపాల్ రెడ్డి రాజీనామా లే్ఖ ఇచ్చిన ఐదు నిమిషాల్లో ఎలా ఆమోదిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని అన్నారు. హుజురాబాద్ ఎన్నిక టీఆర్ఎస్‌కు అవసరమని... మునుగోడు ఎన్నిక బీజేపీకి అవసరమని అన్నారు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటుంన్నారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 

ఫేక్ వీడియోపై ఇంకా రాద్దాంతమా ? టీడీపీపై వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహం !

కాంగ్రెస్ టిక్కెట్ కోసం పెరుగుతున్న ఆశావహులు

మరో వైపు కాంగ్రెస్ పార్టీలో మునుగోడు టిక్కెట్ కోసం డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. బీసీలకు టిక్కెట్ ఇవ్వాలని  సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్ వద్దని.. ఇలా ఇస్తే పాత వారితో సమస్యలు వస్తాయన్నారు. మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలోనే ఉపఎన్నికల స్ట్రాటజీ, ప్రచార కమిటీని నియమించారు. అభ్యర్థి విషయంలో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. అయినా మధుయాష్కీ మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే అభ్యర్థి విషయంలో మునుగోడు సీనియర్ నేత పాల్వాయి స్రవంతి ఆడియోటేప్ కలకలం రేపింది.  కృష్ణారెడ్డి అనే మరో నేతలకూ టిక్కెట్ ఇస్తే తీవ్ర నిర్ణయం తీసుకుంటానని ఆమె ఆ ఆడియో టేపులో హెచ్చరించారు.

తెలంగాణ బీజేపీకి కొత్త ఇంచార్జ్‌గా సునీన్ బన్సల్ - ఈయన ట్రాక్ రికార్డుకి ఓ రేంజ్

కాంగ్రెస్‌లో బయటకు వస్తున్న అంతర్గత ప్రజాస్వామ్యం పోకడలు

మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడంతో పాటు అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీదసాములా మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఉప ఎన్నికలు తెచ్చారన్న అంశంపై స్పష్టత ఉన్నా ఆ పార్ట నేతలు తమదైన మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బయటకే ప్రదర్శిస్తూ ఎవరి రాజకీయం వారు చేసుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఉపఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కృషి చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget