అన్వేషించండి

Supreme Court: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్ - కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దంటూ ఆంక్షలు

Andhra Pradesh News: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన్ను కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించింది.

Supreme Court Restrictions To Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakrishna Reddy) సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. మంగళవారం కౌంటింగ్ సందర్భంగా లెక్కింపు కేంద్రంలోకి వెళ్లకూడదని ఆయనపై సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశించింది. పాల్వాయిగేట్ టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం న్యాయస్థానం విచారించింది. ఈ నెల 6 వరకూ పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎత్తేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు హత్యాయత్నం చేశారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, కౌంటింగ్ రోజు కూడా ఆయన హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా, పోలింగ్ సమయంలో మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వైరల్ అవుతోన్న వీడియోను పిటిషనర్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు అందించారు. అయితే, ఇది అధికారిక వీడియో కాదంటూ పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదించారు. కాగా, అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయంటూ తెలిపిన బెంచ్.. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రజా ప్రతినిధిగా ఉండి.. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఇలా ఈవీఎం ధ్వంసం చేయడం ఏంటి.? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది. పిన్నెల్లి కౌంటింగ్ పరిసరాల్లోకి కూడా వెళ్లకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అటు, ఈ నెల 6 వరకూ పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అభిప్రాయపడింది.

ఇదీ జరిగింది

మే 13న పోలింగ్ డే సందర్భంగా ఏపీ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతుండగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కేసు నమోదు సహా చర్యలకు ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసింది. అయితే, దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై విచారించిన హైకోర్టు జూన్ 6 వరకూ ఆయన్ను అరెస్ట్ చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. అటు, ఈవీఎం ధ్వంసం కేసు సహా పిన్నెల్లిపై నమోదైన హత్యాయత్నం కేసు‌ల్లో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అనుసరించిన షరతులే ఈ మూడు కేసుల్లో కూడా వర్తిస్తాయని కోర్టు తేల్చిచెప్పింది. 

ఈ క్రమంలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈవీఎం ధ్వంసం సహా తనపై హత్యాయత్నం చేశారని.. తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం పిన్నెల్లిపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: AP Election Counting: తాడిపత్రిలో పోలీసుల హై అలర్ట్‌- తేడా వస్తే చచ్చేదాక స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే- నేతలకు అధికారుల హెచ్చరిక!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget