అన్వేషించండి

Sajjala Ramakrishna Reddy comments : కౌంటింగ్ అక్రమాలు ఎదుర్కొంటాం - ఈసీ తప్పు దిద్దుకోవాలి - సజ్జల కీలక వ్యాఖ్యలు

Andhra News : ఈసీ తప్పు దిద్దుకోవాలని సజ్జల సలహా ఇచ్చారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామన్నారు. టీడీపీ తెచ్చి పెట్టిన అధికారుల వల్లే అల్లర్లు జరిగాయని ఇది ఈసీ వైఫల్యమని సజ్జల అన్నారు.

Sajjala On EC :  కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదని.. కానీ  కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నామని..   ఇప్పటికైనా  ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచిందని సలహా ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ  సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుందని ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాారు.

ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం !                 

ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావన్నారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నామన్నారు.  తెలుగుదేశం కూటమి వలనే హింస జరిగిందని ఆరోపించారు. ఈసీ ద్వారా బదిలీ చేయించి వారు చెప్పిన అధికారుల్ని  నియమించారని.. వారే ఘర్షణలకు కారణమయ్యారన్నారు.  ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లేనన్నారు.  

ఓటింగ్ పెరిగితే వైసీపీ ఓడిపోతుందని టీడీపీ అనుకుంటోంది !                                        

ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని సజ్జల తెలిపారు.  గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామన్నారు. తమ సంప్రదాయ ఓటు  బ్యాంక్ చెక్కు చెదలేదని..  పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే  వైసీపీ  ఓడిపోతుందన్న భ్రమలో టీడీపీ ఉందన్నారు.  మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవని స్పష్టం చేశారు.  ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదన్నారు.  వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా అని ప్రశ్నించారు. 

తనను చూసి ఓటు వేయాలని  జగన్ అడిగారు !                                  

సీఎం జగన్‌ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. తనను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారన్నారు.  చంద్రబాబు పూర్తిగా నెగిటివ్‌ క్యాంపెన్‌ చేశారని విమర్శించారు.  ల్యాండ్‌ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారని.. విమర్శించారు.  పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయమని..  దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.   వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు  రాస్తున్నారని ఆరోపించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Rashmi Gautam: ముద్దులతో రష్మీ గౌతమ్ ఫోటోషూట్... ఏజ్ అంతా వేస్ట్ చేస్తుందా? అంకుల్స్ ఫాలోయింగ్ ఎక్కువా?
ముద్దులతో రష్మీ గౌతమ్ ఫోటోషూట్... ఏజ్ అంతా వేస్ట్ చేస్తుందా? అంకుల్స్ ఫాలోయింగ్ ఎక్కువా?
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Hyderabad News: భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
Entertainment Top Stories Today: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Embed widget