అన్వేషించండి

నేటి నుంచి రెండురోజులపాటు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన

PM Modi Visits In Telangana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమ, మంగళవారాల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

Modi Two Days Visit In Telangana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమ, మంగళవారాల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.15,718 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం అదిలాబాద్‌లో రూ.6,697 కోట్లు విలువైన, ఐదో తేదీన సంగారెడ్డిలో రూ.9,021 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలకుగాను ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని సభలు పార్టీ యంత్రాంగానికి మరింత ఊపు తీసుకువస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మోదీ సభలు నిర్వహణ ద్వారా ప్రజల చూపును తమవైపు తిప్పుకోవాలని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు. 

హెలికాఫ్టర్‌లో నాగ్‌పూర్‌ నుంచి అదిలాబాద్‌కు

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హెలికాఫ్టర్‌లో రానున్నారు. సోమవారం ఉదయం మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. గవర్నర్‌ తమిళ సై సౌందరరాజన్‌, సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుని అభివృద్ధి పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమమంతా ఒక ప్రాంగణంలో జరుగుతుంది. మరో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. 

ఆదిలాబాద్‌లో రెండు గంటలు

ఆదిలాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ రెండు గంటలపాటు సమయాన్ని వెచ్చించనున్నారు. ప్రధానితో కేంద్ర మంత్రులతోపాటు స్థానిక నేతలు బండి సంజయ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌తోపాటు పలువురు ముఖ్య నేతలు ప్రధాని సభలో పాల్గొననున్నారు. సభలు అనంతరం 12.10 గంటలకు హెలికాఫ్టర్‌లో ప్రధాని మోదీ బయలుదేరి నాందేడ్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళతారు. సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకుని రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. రెండో రోజు పర్యటన మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(సీఏఆర్‌ఓ)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలను చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రెండు వేల మందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు వేదికగా తెలంగాణలోని ప్రధాన పక్షాలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై వమోదీ విమర్శులు ఎక్కుపెట్టే అవకాశముంది. కుటుంబ పాలనను ప్రోత్సహించే పార్టీలుగా వీటిపై విమర్శలను ప్రధాని సందించనున్నారు. గడిచిన పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి, గతంలో జరిగిన అవినీతి, అక్రమాలు వంటి అనేక విషయాలపై మోదీ ప్రసంగించే అవకాశముందని చెబుతున్నారు.

Also Read: బీఆర్ఎస్‌కు మరో షాక్! బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Also Read:తెలంగాణలో 9మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget